ఒకప్పుడు బాలీవుడ్లో రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి బోలెడంతమంది అసిస్టెంట్లకు అవకాశమిచ్చి.. వారితో సినిమాలు తీసి ఒక పెద్ద వ్యవస్థలా మారాడు.
ఇప్పుడు టాలీవుడ్లో సుకుమార్ సైతం ఇలాగే తన శిష్యులు బోలెడంతమందిని దర్శకులను చేస్తున్నాడు. కొందరిని సొంత సంస్థ ద్వారా పరిచయం చేస్తే.. కొందరికి వేరే వాళ్ల ద్వారా అవకాశాలిస్తున్నాడు. అలా దర్శకులుగా మారిన చాలామంది సుక్కుకు మంచి పేరు తెచ్చిపెడుతున్నారు. ఆ శిష్యులందరిలో సుక్కు ఎక్కువ గర్వపడేలా చేసింది బుచ్చిబాబు సానానే. ఉప్పెనతో అతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్న సినిమా అనుకున్న ఉప్పెన ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు బుచ్చిబాబు తన రెండో సినిమాకు రెడీ అయ్యాడు. ఏకంగా రామ్ చరణ్తో అతను సినిమా తీయబోతున్నాడు.
పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా బుధవారమే ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్తో కలిసి సుకుమార్ నిర్మిస్తున్నాడు. ఉప్పెనలో కూడా ఆయన నిర్మాణ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. కాగా చరణ్తో బుచ్చిబాబు సినిమా కథా చర్చలు జరిగేటపుడు తనకు బుచ్చిబాబు షాకుల మీద షాకులు ఇచ్చినట్లు సుకుమార్ ప్రారంభోత్సవ వేడుకలో చెప్పారు.
ముందు అతను ఉప్పెన తరహాలోనే చిన్న సినిమా చేస్తాడని అనుకున్నానని.. కానీ కథ చెప్పాక దాని రేంజ్ వేరని అర్థమైందని సుక్కు చెప్పాడు. ఐతే హీరో ఎవరు అంటే రామ్ చరణ్ అన్నాడని.. అప్పుడు అమ్మో అనుకున్నానని, ఒకవైపు తాను కూడా చరణ్ కోసం ట్రై చేస్తుంటే బుచ్చిబాబుకు అదే హీరో కావాలా అనుకున్నానని సుక్కు చెప్పాడు. ఇక సంగీత దర్శకుడు ఎవరు అంటే ఏఆర్ రెహమాన్ అన్నాడని.. దీంతో మళ్లీ తాను షాకయ్యానని.. కానీ తన కథకు ఎవరు కావాలో వాళ్లనే బుచ్చిబాబు తీసుకున్నాడని సుకుమార్ చెప్పాడు
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…