తెలుగులో శౌర్యం అనే రెగ్యులర్ మాస్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు తమిళ సినిమాటోగ్రాఫర్ శివ. ఆ తర్వాత అతను తెలుగులో తీసిన శంఖం, దరువు.. తమిళంలో తెరకెక్కించిన సిరుత్తై (విక్రమార్కుడు రీమేక్), వీరం, వివేకం, విశ్వాసం, అన్నాత్తె సగటు మాస్ మసాలా చిత్రాలే.
అలాంటి దర్శకుడు సూర్యతో జట్టు కడుతుంటే.. ఇంకో రెగ్యులర్ మాస్ మూవీనే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈసారి శివ అండ్ టీం కలిసి ఒక విజువల్ వండర్ తీస్తున్నారని.. ఈ సినిమా ఫస్ట్ టీజర్ రిలీజైనపుడే తెలిసిందే. అందులో విజువల్స్, సెట్టింగ్స్, ఎఫెక్ట్స్.. సూర్య లుక్స్, సినిమా నేపథ్యం అన్నీ చూసి ప్రేక్షకులకు మతి పోయింది. సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
లేటెస్ట్గా ముంబయిలో అమేజాన్ ప్రైమ్ మీట్ సందర్భంగా ఈ సినిమా నుంచి ఇంకో టీజర్ వదిలారు. తొలి టీజర్కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి ఇందులో విజువల్స్. సూర్య లుక్స్, తన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే టెర్రిఫిక్ అనిపించాయి. ఇందులో విలన్ పాత్ర చేస్తున్న బాబీ డియోల్ పాత్రను కూడా పరిచయం చేశారు. అతడి ఇంపాక్ట్ కూడా మామూలుగా లేదు. లుక్స్తోనే అతను భయపెట్టేశాడు.
సూర్య, బాబీ మధ్య క్లాష్ ఒక రేంజిలో ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మామూలుగా లేవు. మొత్తంగా కంగువ ప్రపంచంలోకి అడుగు పెట్టే ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి ఖాయమని అర్థమవుతోంది. ఈ సినిమా మీద సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ పెడుతున్నాడు. యువి క్రియేషన్స్ సైతం ఈ చిత్రంలో భాగస్వామి అన్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 20, 2024 7:15 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…