Movie News

మహేష్ బాబు 29 ఇంకా చాలా పనుంది

ఎప్పుడెప్పుడు మొదలుకానుందాని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న మహేష్ బాబు రాజమౌళి కలయికలోని ప్యాన్ ఇండియా మూవీకి అడుగులు మొదలైపోయాయి. హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో దీనికి సంబంధించిన సెట్ పనులు జరుగుతుండగా ఇంకోవైపు జపాన్ లో ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ కు హాజరైన జక్కన్న కొన్ని కీలక అప్డేట్లు పంచుకున్నారు. ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వకుండా మహేష్ తప్ప క్యాస్టింగ్ లో ఇంకెవరిని ఖరారు చేయలేదని, స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నామని అక్కడికి వచ్చిన ఫారిన్ మీడియాకు సమాచారమిచ్చారు.

విడుదల సమయంలో మహేష్ బాబుని ఇక్కడికి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. దీన్ని బట్టి ఎస్ఎస్ఎంబి ప్రోగ్రెస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పైకి ఎలా చెప్పినా క్యాస్టింగ్ కు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు ఆల్రెడీ జరిగిపోయాయని ఇన్ సైడ్ టాక్. కాకపోతే వివరాలు లీక్ కాకుండా గుట్టుగా మైంటైన్ చేస్తున్నారు. ఒకదశలో హృతిక్ రోషన్ విలన్ గా నటిస్తాడనే ప్రచారం జరిగింది కానీ అది కూడా నిజం కాదని వినికిడి. ఊహించని కాంబోలు ఉండటం నిజమే కానీ ఆర్టిస్టుల నుంచి కాల్ షీట్స్ లాకయ్యే దాకా ఏదీ చెప్పలేమని అంటున్నారు. సో కొంచెం టైం అయితే పడుతుంది.

ఉగాదికి లాంఛనంగా ఒక ప్రెస్ మీట్ తో ఈ ప్రాజెక్టుని లాంచ్ చేయబోతున్నారని ఇప్పటికే టాక్ ఉంది. రెండు భాగాలు ఉంటుందనే అప్డేట్ కూడా ఆ రోజే ఇవ్వబోతున్నారు. ఎంత కాలంలో పూర్తవుతుందనేది మాత్రం ఇంకా చెప్పడం లేదు. బాహుబలికి అనుకోకుండా ఎక్కువ సమయం పట్టగా, ఆర్ఆర్ఆర్ కి కరోనా లాంటి అవాంతరాలు స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డుపడ్డాయి. ఎస్ఎస్ఎంబి 29కి ఎలాంటి అడ్డంకులు రాకపోతే రెండేళ్లలోనే ఫస్ట్ పార్ట్ రిలీజ్ ఉండొచ్చని తెలిసింది. అయినా రాజమౌళి ఎన్ని అనుకున్నా అన్నీ ఆయన చేతుల్లో ఉండవుగా. పరిస్థితుల ప్రభావం వల్ల నిర్ణయాలు మారొచ్చు.

Satya

Recent Posts

వేగంగా సినిమాలు చేయడం ఒక ఆర్టు

మన హీరోలేమో ఏడాదికి ఒక రిలీజ్ ఉండటమే మహా కష్టమైపోయి ప్యాన్ ఇండియా మోజులో ఏళ్లకేళ్లు ఖర్చు పెట్టేస్తున్నారు. మనం…

1 hour ago

నాగ వంశీపై రిలీజుల ఒత్తిడి ఎక్కువే

జనవరిలో 'అనగనగా ఒక రాజు' విడుదల టైంలో నిర్మాత నాగవంశీ ఇకపై తమ బ్యానర్ నుంచి నెలకో సినిమా ఉంటుందని…

2 hours ago

శోభితకు సమంత పంచ్ వేసిందా?

టాలీవుడ్ హీరోయిన్లలో సమంత చాలా చాలా స్పెషల్ అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. విజయశాంతిలా, అనుష్కలా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయకపోయినా…

5 hours ago

ఎవరీ ఐఏఎస్ శ్రీలక్ష్మి?

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పోస్టింగ్…

5 hours ago

లెనిన్ మేలుకునే టైం వచ్చేసింది

సరిగ్గా ఇంకో పదిహేను రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ…

5 hours ago

మీర్జాపూర్ మూవీ… అన్నీ ఉన్నాయ్ కానీ

ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యూపీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ సిరీస్.. తొలి…

6 hours ago