ఎప్పుడెప్పుడు మొదలుకానుందాని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న మహేష్ బాబు రాజమౌళి కలయికలోని ప్యాన్ ఇండియా మూవీకి అడుగులు మొదలైపోయాయి. హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో దీనికి సంబంధించిన సెట్ పనులు జరుగుతుండగా ఇంకోవైపు జపాన్ లో ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ కు హాజరైన జక్కన్న కొన్ని కీలక అప్డేట్లు పంచుకున్నారు. ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వకుండా మహేష్ తప్ప క్యాస్టింగ్ లో ఇంకెవరిని ఖరారు చేయలేదని, స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నామని అక్కడికి వచ్చిన ఫారిన్ మీడియాకు సమాచారమిచ్చారు.
విడుదల సమయంలో మహేష్ బాబుని ఇక్కడికి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. దీన్ని బట్టి ఎస్ఎస్ఎంబి ప్రోగ్రెస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పైకి ఎలా చెప్పినా క్యాస్టింగ్ కు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు ఆల్రెడీ జరిగిపోయాయని ఇన్ సైడ్ టాక్. కాకపోతే వివరాలు లీక్ కాకుండా గుట్టుగా మైంటైన్ చేస్తున్నారు. ఒకదశలో హృతిక్ రోషన్ విలన్ గా నటిస్తాడనే ప్రచారం జరిగింది కానీ అది కూడా నిజం కాదని వినికిడి. ఊహించని కాంబోలు ఉండటం నిజమే కానీ ఆర్టిస్టుల నుంచి కాల్ షీట్స్ లాకయ్యే దాకా ఏదీ చెప్పలేమని అంటున్నారు. సో కొంచెం టైం అయితే పడుతుంది.
ఉగాదికి లాంఛనంగా ఒక ప్రెస్ మీట్ తో ఈ ప్రాజెక్టుని లాంచ్ చేయబోతున్నారని ఇప్పటికే టాక్ ఉంది. రెండు భాగాలు ఉంటుందనే అప్డేట్ కూడా ఆ రోజే ఇవ్వబోతున్నారు. ఎంత కాలంలో పూర్తవుతుందనేది మాత్రం ఇంకా చెప్పడం లేదు. బాహుబలికి అనుకోకుండా ఎక్కువ సమయం పట్టగా, ఆర్ఆర్ఆర్ కి కరోనా లాంటి అవాంతరాలు స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డుపడ్డాయి. ఎస్ఎస్ఎంబి 29కి ఎలాంటి అడ్డంకులు రాకపోతే రెండేళ్లలోనే ఫస్ట్ పార్ట్ రిలీజ్ ఉండొచ్చని తెలిసింది. అయినా రాజమౌళి ఎన్ని అనుకున్నా అన్నీ ఆయన చేతుల్లో ఉండవుగా. పరిస్థితుల ప్రభావం వల్ల నిర్ణయాలు మారొచ్చు.
తెలుగు సినిమాలో స్క్రీన్ ప్లే అనగానే గుర్తుకొచ్చే పేరు.. సుకుమార్. ఈ లెక్కల మాస్టారి కథన నైపుణ్యం గురించి ఎంత…
72వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న…
బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…