ఎప్పుడెప్పుడు మొదలుకానుందాని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న మహేష్ బాబు రాజమౌళి కలయికలోని ప్యాన్ ఇండియా మూవీకి అడుగులు మొదలైపోయాయి. హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో దీనికి సంబంధించిన సెట్ పనులు జరుగుతుండగా ఇంకోవైపు జపాన్ లో ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ కు హాజరైన జక్కన్న కొన్ని కీలక అప్డేట్లు పంచుకున్నారు. ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వకుండా మహేష్ తప్ప క్యాస్టింగ్ లో ఇంకెవరిని ఖరారు చేయలేదని, స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నామని అక్కడికి వచ్చిన ఫారిన్ మీడియాకు సమాచారమిచ్చారు.
విడుదల సమయంలో మహేష్ బాబుని ఇక్కడికి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. దీన్ని బట్టి ఎస్ఎస్ఎంబి ప్రోగ్రెస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పైకి ఎలా చెప్పినా క్యాస్టింగ్ కు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు ఆల్రెడీ జరిగిపోయాయని ఇన్ సైడ్ టాక్. కాకపోతే వివరాలు లీక్ కాకుండా గుట్టుగా మైంటైన్ చేస్తున్నారు. ఒకదశలో హృతిక్ రోషన్ విలన్ గా నటిస్తాడనే ప్రచారం జరిగింది కానీ అది కూడా నిజం కాదని వినికిడి. ఊహించని కాంబోలు ఉండటం నిజమే కానీ ఆర్టిస్టుల నుంచి కాల్ షీట్స్ లాకయ్యే దాకా ఏదీ చెప్పలేమని అంటున్నారు. సో కొంచెం టైం అయితే పడుతుంది.
ఉగాదికి లాంఛనంగా ఒక ప్రెస్ మీట్ తో ఈ ప్రాజెక్టుని లాంచ్ చేయబోతున్నారని ఇప్పటికే టాక్ ఉంది. రెండు భాగాలు ఉంటుందనే అప్డేట్ కూడా ఆ రోజే ఇవ్వబోతున్నారు. ఎంత కాలంలో పూర్తవుతుందనేది మాత్రం ఇంకా చెప్పడం లేదు. బాహుబలికి అనుకోకుండా ఎక్కువ సమయం పట్టగా, ఆర్ఆర్ఆర్ కి కరోనా లాంటి అవాంతరాలు స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డుపడ్డాయి. ఎస్ఎస్ఎంబి 29కి ఎలాంటి అడ్డంకులు రాకపోతే రెండేళ్లలోనే ఫస్ట్ పార్ట్ రిలీజ్ ఉండొచ్చని తెలిసింది. అయినా రాజమౌళి ఎన్ని అనుకున్నా అన్నీ ఆయన చేతుల్లో ఉండవుగా. పరిస్థితుల ప్రభావం వల్ల నిర్ణయాలు మారొచ్చు.
This post was last modified on March 19, 2024 2:14 pm
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…