ఎప్పుడెప్పుడు మొదలుకానుందాని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న మహేష్ బాబు రాజమౌళి కలయికలోని ప్యాన్ ఇండియా మూవీకి అడుగులు మొదలైపోయాయి. హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో దీనికి సంబంధించిన సెట్ పనులు జరుగుతుండగా ఇంకోవైపు జపాన్ లో ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ కు హాజరైన జక్కన్న కొన్ని కీలక అప్డేట్లు పంచుకున్నారు. ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వకుండా మహేష్ తప్ప క్యాస్టింగ్ లో ఇంకెవరిని ఖరారు చేయలేదని, స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నామని అక్కడికి వచ్చిన ఫారిన్ మీడియాకు సమాచారమిచ్చారు.
విడుదల సమయంలో మహేష్ బాబుని ఇక్కడికి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. దీన్ని బట్టి ఎస్ఎస్ఎంబి ప్రోగ్రెస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పైకి ఎలా చెప్పినా క్యాస్టింగ్ కు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు ఆల్రెడీ జరిగిపోయాయని ఇన్ సైడ్ టాక్. కాకపోతే వివరాలు లీక్ కాకుండా గుట్టుగా మైంటైన్ చేస్తున్నారు. ఒకదశలో హృతిక్ రోషన్ విలన్ గా నటిస్తాడనే ప్రచారం జరిగింది కానీ అది కూడా నిజం కాదని వినికిడి. ఊహించని కాంబోలు ఉండటం నిజమే కానీ ఆర్టిస్టుల నుంచి కాల్ షీట్స్ లాకయ్యే దాకా ఏదీ చెప్పలేమని అంటున్నారు. సో కొంచెం టైం అయితే పడుతుంది.
ఉగాదికి లాంఛనంగా ఒక ప్రెస్ మీట్ తో ఈ ప్రాజెక్టుని లాంచ్ చేయబోతున్నారని ఇప్పటికే టాక్ ఉంది. రెండు భాగాలు ఉంటుందనే అప్డేట్ కూడా ఆ రోజే ఇవ్వబోతున్నారు. ఎంత కాలంలో పూర్తవుతుందనేది మాత్రం ఇంకా చెప్పడం లేదు. బాహుబలికి అనుకోకుండా ఎక్కువ సమయం పట్టగా, ఆర్ఆర్ఆర్ కి కరోనా లాంటి అవాంతరాలు స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డుపడ్డాయి. ఎస్ఎస్ఎంబి 29కి ఎలాంటి అడ్డంకులు రాకపోతే రెండేళ్లలోనే ఫస్ట్ పార్ట్ రిలీజ్ ఉండొచ్చని తెలిసింది. అయినా రాజమౌళి ఎన్ని అనుకున్నా అన్నీ ఆయన చేతుల్లో ఉండవుగా. పరిస్థితుల ప్రభావం వల్ల నిర్ణయాలు మారొచ్చు.
This post was last modified on March 19, 2024 2:14 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…