ఈ ఏడాది సంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ అంచనాలను అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్తో మహేష్ మూవీ అనేసరికి ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ అందుకు తగ్గ స్థాయిలో సినిమా లేకపోయిన మాట వాస్తవం. నిజానికి ఆ సినిమా మిడ్ నైట్ షోలకు వచ్చిన టాక్ చూస్తే.. డిజాస్టర్ అవుతుందేమో అన్న భయాలు కలిగాయి. కానీ సంక్రాంతి సీజన్లో సినిమా ఓ మోస్తరు వసూళ్లతో ఓకే అనిపించింది. కానీ చివరికి బయ్యర్లకు కొంత నష్టాలు తప్పలేదనే డిస్కషన్లే నడిచాయి ఇండస్ట్రీలో.
కానీ ఇదంతా మీడియా బాధే తప్ప.. తమకు వసూళ్ల పరంగా సమస్యే లేదంటున్నాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్స్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘టిల్లు స్క్వేర్’కు సంబంధించిన ప్రెస్ మీట్లో ‘గుంటూరు కారం’ తాలూకు అసంతృప్తి గురించి అడిగితే ఆయన ఆసక్తికర రీతిలో స్పందించాడు.
‘గుంటూరు కారం’ విషయంలో బాధంతా మీడియాదే అని.. తమకైతే ఆ మూవీ విషయంలో ఏ బాధా లేదని ఆయన తేల్చేశారు. అంటే నిర్మాతలుగా తాము హ్యాపీ, అలాగే సినిమాను కొన్న బయ్యర్లూ హ్యాపీ.. అందరికీ ఈ చిత్రం లాభాలే మిగిల్చిందనే భావన వచ్చేలా ఆయన మాట్లాడారు. ఐతే మీడియాకు కౌంటర్ వేయడం బాగుంది కానీ.. ఈ సినిమాను భారీ రేట్లకు కొన్న బయ్యర్లు మాత్రం సేఫ్ జోన్లోకి రాలేదన్నది ట్రేడ్ వర్గాల మాట. స్వయంగా నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకే కొంత నష్టం తప్పలేదని ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరిగింది. మిగతా ఏ ఏరియాలోనూ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదన్నదే ట్రేడ్ వర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రావాల్సిన కొత్త చిత్రం ఎప్పుడు ఉంటుందో చెప్పమని అడిగితే నాగవంశీ సమాధానం దాటవేశాడు. దాని గురించి వేరే ప్రెస్ మీట్లో మాట్లాడతానన్నాడు.
This post was last modified on March 19, 2024 10:30 am
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…