Movie News

గుంటూరు కారం.. బాధ మీడియాదే మాది కాదు

ఈ ఏడాది సంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ అంచనాలను అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌తో మహేష్ మూవీ అనేసరికి ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ అందుకు తగ్గ స్థాయిలో సినిమా లేకపోయిన మాట వాస్తవం. నిజానికి ఆ సినిమా మిడ్ నైట్ షోలకు వచ్చిన టాక్ చూస్తే.. డిజాస్టర్ అవుతుందేమో అన్న భయాలు కలిగాయి. కానీ సంక్రాంతి సీజన్లో సినిమా ఓ మోస్తరు వసూళ్లతో ఓకే అనిపించింది. కానీ చివరికి బయ్యర్లకు కొంత నష్టాలు తప్పలేదనే డిస్కషన్లే నడిచాయి ఇండస్ట్రీలో.

కానీ ఇదంతా మీడియా బాధే తప్ప.. తమకు వసూళ్ల పరంగా సమస్యే లేదంటున్నాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్స్‌లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘టిల్లు స్క్వేర్’కు సంబంధించిన ప్రెస్ మీట్లో ‘గుంటూరు కారం’ తాలూకు అసంతృప్తి గురించి అడిగితే ఆయన ఆసక్తికర రీతిలో స్పందించాడు.

‘గుంటూరు కారం’ విషయంలో బాధంతా మీడియాదే అని.. తమకైతే ఆ మూవీ విషయంలో ఏ బాధా లేదని ఆయన తేల్చేశారు. అంటే నిర్మాతలుగా తాము హ్యాపీ, అలాగే సినిమాను కొన్న బయ్యర్లూ హ్యాపీ.. అందరికీ ఈ చిత్రం లాభాలే మిగిల్చిందనే భావన వచ్చేలా ఆయన మాట్లాడారు. ఐతే మీడియాకు కౌంటర్ వేయడం బాగుంది కానీ.. ఈ సినిమాను భారీ రేట్లకు కొన్న బయ్యర్లు మాత్రం సేఫ్ జోన్లోకి రాలేదన్నది ట్రేడ్ వర్గాల మాట. స్వయంగా నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకే కొంత నష్టం తప్పలేదని ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరిగింది. మిగతా ఏ ఏరియాలోనూ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదన్నదే ట్రేడ్ వర్గాల సమాచారం.

ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రావాల్సిన కొత్త చిత్రం ఎప్పుడు ఉంటుందో చెప్పమని అడిగితే నాగవంశీ సమాధానం దాటవేశాడు. దాని గురించి వేరే ప్రెస్ మీట్లో మాట్లాడతానన్నాడు.

This post was last modified on March 19, 2024 10:30 am

Share
Show comments
Published by
satya

Recent Posts

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

22 mins ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

34 mins ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

3 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

3 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

3 hours ago

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…

4 hours ago