శనివారం జియో సినిమాలో హనుమాన్ హిందీ వెర్షన్ ఓటిటి స్ట్రీమింగ్ మొదలుపెట్టడం ఆలస్యం ఒక్కసారిగా ఆ యాప్ కి వ్యూయర్స్ తాకిడి అమాంతం పెరిగిపోయింది. ఎదురు చూసే కొద్దీ ఒరిజినల్ తెలుగు ప్రింట్ అందుబాటులోకి రాకపోవడం పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే అల్రెర్ట్ అయిపోయిన జీ5 సంస్థ హడావిడిగా ఆదివారం తెల్లవారకుండానే తెలుగు వెర్షన్ పెట్టేసింది. ఇప్పుడు అసలు ట్విస్టు విషయానికి వద్దాం. హిందీలో 2 గంటల 38 నిముషాలు ఉన్న హనుమాన్ తెలుగులో మాత్రం 2 గంటల 30 నిమిషాలే ఉన్నాడు.
దీంతో ఏదో ఎపిసోడ్ కట్ అయ్యిందని మూవీ లవర్స్ తెగ ఖంగారు పడ్డారు. అయితే అసలు ట్విస్టు వేరే ఉంది. తెలుగులో ఎలాంటి కత్తిరింపులు లేవు. కానీ తేడా జరిగింది. అదెలా అంటే ఫ్రేమ్ రేట్ లో వచ్చిన మార్పు వల్ల కోత పడింది. అంటే ఒరిజినల్ వెర్షన్ మైక్రో సెకండ్ల తేడాతో కొంచెం వేగంగా పరిగెత్తితే హిందీ మాత్రం సాధారణ స్పీడ్ తో థియేటర్ లో చూసిన లెన్త్ తో ఉంటుంది. అందుకే ఈ వ్యత్యాసం. అంతే తప్ప పాట, సీన్ ఏదీ తీసేయలేదు. ఇది అవగాహన లేకపోవడంతో కొందరు హనుమాన్ పూర్తిగా లేదనే అసంతృప్తి ఫీలవుతున్నారు. ఇదే సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ఏది ఏమైనా రిలీజైన 66 రోజులకు హనుమాన్ డిజిటల్ లో రావడం విశేషమే అయినా మరీ ఇంత లేట్ చేసినా వెయిట్ చేసేంత ఓపిక డిజిటల్ ఫ్యాన్స్ లో తగ్గిపోతోంది. దీంతో పాటు సంక్రాంతికి సమాంతరంగా విడుదలైన మిగిలిన మూడు సినిమాలు నెల రోజుల లోపే ఓటిటిలో రాగా హనుమాన్ మాత్రం రెండు నెలల తర్వాత దర్శనమిచ్చింది. ఎలాగూ బాక్సాఫీస్ వద్ద ఒకటి రెండు తప్ప పెద్దగా హడావిడి చేస్తున్న సినిమాలేం లేవు. సో ఇంట్లో కూర్చుని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయడానికి హనుమాన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. వచ్చే నెల శ్రీరామనవమికి వ్యూస్ మారుమ్రోగిపోతాయి.
This post was last modified on March 18, 2024 6:59 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…