Movie News

బాలీవుడ్ షేకైపోతోంది


మూడు నెలల కిందట సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినప్పటి నుంచి బాలీవుడ్‌‌లో ఒక అలజడి కనిపిస్తోంది. అతడి మృతికి బాలీవుడ్ బడా బాబులు, నెపోటిజం బ్యాచే పరోక్షంగా కారణమంటూ ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది పక్కన పెడితే.. సామాన్య జనాల నుంచి బాలీవుడ్లో ఓ వర్గం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. ఆ ప్రభావం వారి సినిమాల మీద కూడా పడింది. సడక్-2 సినిమానే అందుకు ఉదాహరణ.

మరోవైపు కరణ్ జోహార్, సోనాక్షి సిన్హా లాంటి వాళ్లు సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ కేసు తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇది కొత్త మలుపు తిరిగి ఇప్పుడు డ్రగ్స్ ఆరోపణల్లో చిక్కుకుంది బాలీవుడ్. సుశాంత్ మృతి విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అతడి ప్రేయసి రియా చక్రవర్తిని డ్రగ్స్ తీసుకుందన్న ఆరోపణలతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఆమె అరెస్టుతోనే బాలీవుడ్లో అలజడి రేగింది. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, సైమోన్ ఖంబట్టా లాంటి వాళ్ల పేర్లు చెప్పిన రియా.. వారిని ఈ కేసులోకి లాగడంతో బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేగింది. పైకి ఎవరికి వాళ్లు గంభీరంగా కనిపిస్తున్నారు కానీ.. లోలోన అందరూ షేకైపోతున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.

ఇలా పేర్లు చెప్పడం మొదలుపెడితే.. ఆ జాబితా చాలా పెద్దదే ఉంటుందని.. మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్లందరి పేర్లూ బయటికి వస్తాయని.. బయట చాలా మంచి ఇమేజ్ ఉన్న చాలామంది డ్రగ్ అడిక్ట్‌లే అని.. ఆ విషయం బయటపడితే వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంటుందని.. ఈ ఆరోపణలు, కేసులు ఎంత వరకు నిలబడతాయన్నది పక్కన పెడితే.. తమ పేర్లు బయటికి వచ్చి ఇమేజ్ దెబ్బ తింటే అంతే సంగతులని వాళ్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని బాలీవుడ్ మీడియా అంటోంది.

టాలీవుడ్లో ఇంతకుముందు డ్రగ్ కేసు ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. చివరికి ఈ కేసు నీరుగారిపోయినప్పటికీ.. పోలీసుల విచారణకు హాజరైన వాళ్ల ఇమేజ్ మాత్రం దెబ్బ తింది. ఇప్పుడు బాలీవుడ్ జనాల భయం కూడా ఇదే.

This post was last modified on September 13, 2020 11:13 am

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

8 minutes ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

4 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

8 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

8 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

9 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

9 hours ago