వివాదాస్పద కంటెంట్ తో రూపొందిన రజాకార్ ఈ రోజు విడుదలైంది. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దీని మీద పలు కాంట్రవర్సీలు రేగినా ప్రమోషన్ల విషయంలో నిర్మాతలు కొనసాగించిన లో ప్రొఫైల్ వల్ల జనాలకు అంతగా రీచ్ కాలేదని ఓపెనింగ్స్ చూస్తే అర్థమైపోయింది. నిన్న రాత్రే హైదరాబాద్ లో ప్రీమియర్ షో వేసిన రజాకార్ లో క్యాస్టింగ్ ఆసక్తికరంగా ఉండటంతో పాటు విజువల్స్ ని బట్టి బడ్జెట్ కూడా బాగానే పెట్టారని అర్థమైయింది. యాట సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరునారాయణరెడ్డి నిర్మించిన ఈ పీరియాడిక్ డ్రామా ఓ వర్గంలో ఉన్న అంచనాలకు తగ్గట్టు ఉందా.
1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చాక హైదరాబాద్ ను పాలిస్తున్న నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్(మకరంద్ దేశ్ పాండే)కు రాజ్యాధికారం వదులుకోవడం ఇష్టం లేక కేంద్రాన్ని ధిక్కరించి రిజ్వి(రాజ్ అర్జున్)నేతృత్వంలో రజాకార్ సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఊళ్ళ మీద పడి హిందువులను ఊచకోత కోస్తూ మతం మారేలా ప్రేరేపించడమే వీళ్ళ పని. ఒకదశ వరకు ఇదంతా సహిస్తూ వచ్చిన హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్(రాజ్ సప్రు) ఆఖరికి సైన్యాన్ని పంపిస్తాడు. అప్పటికే లక్షలాది అమాయకుల ప్రాణాలు కోల్పోయిన నైజాం గడ్డకు చివరికి విముక్తి దక్కడమే తెరమీద చూడాల్సిన కథ.
చరిత్రలో ఉన్న రజాకార్ దురాగతాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన సత్యనారాయణ ఫస్ట్ హాఫ్ మొత్తం వాళ్ళ హింసకు సంబంధించిన ఘట్టాలను ఎక్కువగా జొప్పించడంతో రిపీట్ అనిపిస్తాయి. కొన్ని బ్లాక్స్ చాలా బాగా వచ్చాయి. ఇంద్రజ, ప్రేమలు విడివిడిగా నటించిన ఎపిసోడ్స్ పేలాయి. రెండో సగంలో రజాకార్లను కట్టడి చేయడానికి పటేల్ ఏం చేశారనే పాయింట్ మీద ఆసక్తికరమైన క్లైమాక్స్ తో ముగించారు. టేకింగ్ పరంగా బాగానే ఉన్నా డ్రామా, ఎమోషన్ పూర్తిగా పండకపోవడంతో గొప్ప చిత్రం అనిపించుకోలేపోయింది. అయినా సరే నిజాయితీ కలిగిన ప్రయత్నంగా ఈ సబ్జెక్టు మీద ఆసక్తి ఉన్నవాళ్ళను నిరాశపరచలేదు.
This post was last modified on March 15, 2024 6:10 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…