ఇండియన్ సినిమాలో ఓ అరంగేట్ర హీరో మీద అత్యధిక బడ్జెట్ పెట్టిన సినిమా అంటే.. ‘జాగ్వార్’యే. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన ‘జాగ్వార్’ మీద పెట్టిన బడ్జెట్ రూ.70 కోట్లు కావడం విశేషం.
ఆ సినిమాకు కథ అందించింది మన లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కాగా.. దర్శకత్వం వహించిన బాలయ్యతో ‘మిత్రుడు’ తీసిన మహాదేవ్. కానీ ఆ చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఏవో రెండు సినిమాలు చేసి మమ అనిపించాడు నిఖిల్. ఇంకా అతడికి సరైన హిట్ పడలేదు.
నాలుగో సినిమా కోసం మళ్లీ ఒక తెలుగు దర్శకుడిని ఎంచుకోవడం విశేషం. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో పరిచయమై.. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం’, ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాలు తీసిన విజయ్ కుమార్ కొండా ఈ చిత్రానికి దర్శకుడు.
తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. నిఖిల్ తొలి సినిమా స్టయిల్లోనే ఈ చిత్రానికి ‘రైడర్’ అని టైటిల్ పెట్టారు. ఇక ఫస్ట్ లుక్ చూస్తే ఏమాత్రం కొత్తదనం కనిపించడం లేదు. మన తెలుగు స్టార్ల మాస్ సినిమాల్లో చూసినట్లుగానే ఉంది ఈ లుక్. ముఖ్యంగా ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్ పరుగు తీస్తూ ఉండే లుక్ను యాజిటీజ్ దించేసినట్లుగా కనిపిస్తోంది.
‘రైడర్’ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగులోనూ తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ చూసిన మన జనాలకు బన్నీ కచ్చితంగా గుర్తుకొస్తాడనడంలో సందేహం లేదు. తొలి సినిమా సూపర్ హిట్టయ్యాక అంచనాలు అందుకోలేకపోయిన విజయ్కి ఇక్కడ కెరీర్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. రాజ్తరుణ్ లాంటి ఫాంలో లేని హీరోతో అతను తీసిన ‘ఒరేయ్ బుజ్జిగా’కు ఏమాత్రం బజ్ లేదు. ఈ చిత్రాన్ని ‘ఆహా’లో నేరుగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన రోజే ‘రైడర్’ ఫస్ట్ లుక్తో పలకరించాడు. చూస్తుంటే మన మాస్ సినిమాల్ని అటు ఇటు తిప్పి అక్కడ వడ్డించేలా కనిపిస్తున్నాడు విజయ్.
This post was last modified on September 12, 2020 11:20 am
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…