సుషాంత్ సింగ్ రాజ్పుట్కి న్యాయం జరిగేలా చూడాలని, బాలీవుడ్లో వేళ్లూనుకుపోయిన బంధుప్రీతి అతడిని బలి తీసుకుందని ముందుగా థియరీ వినిపించింది కంగన రనౌత్. మీడియా ముందుగా అదే పల్లవి ఎత్తుకుని కంగనని ఎడాపెడా ఇంటర్వ్యూలు కూడా చేసేసి బాలీవుడ్ డౌన్ డౌన్ అనేసింది. అయితే సుషాంత్ తండ్రి రియా చక్రవర్తిని వేలెత్తి చూపించడంతో మీడియా దృష్టి అటు మరలిపోయింది. కా
నీ కంగన మాత్రం మొదట్నుంచీ బంధుప్రీతి, అవుట్ సైడర్స్ టాపిక్కే కట్టుబడింది. రియా చక్రవర్తిని అంతా వేలెత్తి చూపిస్తున్నా, ఆమెని దోషిగా నిలబెట్టి ఎంక్వయిరీలంటూ తిప్పుతున్నా, ఆఖరుకి అరెస్ట్ చేసినా కంగన స్పందించలేదు.
ఇదిలావుండగా అటు రియా చక్రవర్తి అరెస్ట్ తో పాటు కంగన ఆఫీసుని అక్రమ కట్టడం పేరిట కూలగొట్టడం ఒకేసారి జరగడంతో రియా తరఫున గళమెత్తిన బాలీవుడ్ సెలబ్రిటీలు పనిలో పనిగా కంగనకు జరిగిన దానిని ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనికి కంగన తనదయిన శైలిలో స్పందించింది. తనకు మాఫియాకి తొత్తులయిన వారి మద్దతు అక్కర్లేదని, తనను, ఒక డ్రగ్ అడిక్ట్ ప్లస్ ఒక సూపర్ స్టార్ సొమ్ము మీద పడి బ్రతికే వాళ్లకూ (రియా చక్రవర్తి) ఒకే గాటన కట్టి మీ సింపతీ చెప్పవద్దని ఘాటుగా గడ్డి పెట్టింది.
సుషాంత్ కోసం తన పోరాటం కొనసాగుతుందని అంటూనే రియా చక్రవర్తి పట్ల కించిత్ కనికరం లేదా జాలి తనకు లేనే లేవని కంగన ఈ వ్యాఖ్యలతో తేల్చి పారేసింది.
ఇదిలావుంటే రియా తరఫున మాట్లాడుతోన్న షిబానీ దండేకర్ ‘టూ సెకండ్స్ ఫేమ్’ కోసం పాకులాడుతోందని సుషాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖాండేను కామెంట్ చేయడంతో ఫాన్స్ ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. రియా మాదిరిగా నువ్వు కూడా ఫర్హాన్ అక్తర్ డబ్బులు తిని బతికేస్తున్నావని అనడమే కాకుండా ఆమె వికీ పీడియా పేజీనిండా ‘గోల్డ్ డిగ్గర్’ అంటూ వివిధ వ్యాఖ్యలతో ఎటాక్ చేసి చుక్కలు చూపించారు.
ది రాజా సాబ్ తర్వాత దాన్ని మర్చిపోయే సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. వాళ్ళు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు తెలుగువాళ్లే. ఆర్య తీసిన సుకుమార్,…
రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రష్యా…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతం…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…