సుషాంత్ సింగ్ రాజ్పుట్కి న్యాయం జరిగేలా చూడాలని, బాలీవుడ్లో వేళ్లూనుకుపోయిన బంధుప్రీతి అతడిని బలి తీసుకుందని ముందుగా థియరీ వినిపించింది కంగన రనౌత్. మీడియా ముందుగా అదే పల్లవి ఎత్తుకుని కంగనని ఎడాపెడా ఇంటర్వ్యూలు కూడా చేసేసి బాలీవుడ్ డౌన్ డౌన్ అనేసింది. అయితే సుషాంత్ తండ్రి రియా చక్రవర్తిని వేలెత్తి చూపించడంతో మీడియా దృష్టి అటు మరలిపోయింది. కా
నీ కంగన మాత్రం మొదట్నుంచీ బంధుప్రీతి, అవుట్ సైడర్స్ టాపిక్కే కట్టుబడింది. రియా చక్రవర్తిని అంతా వేలెత్తి చూపిస్తున్నా, ఆమెని దోషిగా నిలబెట్టి ఎంక్వయిరీలంటూ తిప్పుతున్నా, ఆఖరుకి అరెస్ట్ చేసినా కంగన స్పందించలేదు.
ఇదిలావుండగా అటు రియా చక్రవర్తి అరెస్ట్ తో పాటు కంగన ఆఫీసుని అక్రమ కట్టడం పేరిట కూలగొట్టడం ఒకేసారి జరగడంతో రియా తరఫున గళమెత్తిన బాలీవుడ్ సెలబ్రిటీలు పనిలో పనిగా కంగనకు జరిగిన దానిని ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనికి కంగన తనదయిన శైలిలో స్పందించింది. తనకు మాఫియాకి తొత్తులయిన వారి మద్దతు అక్కర్లేదని, తనను, ఒక డ్రగ్ అడిక్ట్ ప్లస్ ఒక సూపర్ స్టార్ సొమ్ము మీద పడి బ్రతికే వాళ్లకూ (రియా చక్రవర్తి) ఒకే గాటన కట్టి మీ సింపతీ చెప్పవద్దని ఘాటుగా గడ్డి పెట్టింది.
సుషాంత్ కోసం తన పోరాటం కొనసాగుతుందని అంటూనే రియా చక్రవర్తి పట్ల కించిత్ కనికరం లేదా జాలి తనకు లేనే లేవని కంగన ఈ వ్యాఖ్యలతో తేల్చి పారేసింది.
ఇదిలావుంటే రియా తరఫున మాట్లాడుతోన్న షిబానీ దండేకర్ ‘టూ సెకండ్స్ ఫేమ్’ కోసం పాకులాడుతోందని సుషాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖాండేను కామెంట్ చేయడంతో ఫాన్స్ ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. రియా మాదిరిగా నువ్వు కూడా ఫర్హాన్ అక్తర్ డబ్బులు తిని బతికేస్తున్నావని అనడమే కాకుండా ఆమె వికీ పీడియా పేజీనిండా ‘గోల్డ్ డిగ్గర్’ అంటూ వివిధ వ్యాఖ్యలతో ఎటాక్ చేసి చుక్కలు చూపించారు.
This post was last modified on September 12, 2020 10:54 am
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…