సుషాంత్ సింగ్ రాజ్పుట్కి న్యాయం జరిగేలా చూడాలని, బాలీవుడ్లో వేళ్లూనుకుపోయిన బంధుప్రీతి అతడిని బలి తీసుకుందని ముందుగా థియరీ వినిపించింది కంగన రనౌత్. మీడియా ముందుగా అదే పల్లవి ఎత్తుకుని కంగనని ఎడాపెడా ఇంటర్వ్యూలు కూడా చేసేసి బాలీవుడ్ డౌన్ డౌన్ అనేసింది. అయితే సుషాంత్ తండ్రి రియా చక్రవర్తిని వేలెత్తి చూపించడంతో మీడియా దృష్టి అటు మరలిపోయింది. కా
నీ కంగన మాత్రం మొదట్నుంచీ బంధుప్రీతి, అవుట్ సైడర్స్ టాపిక్కే కట్టుబడింది. రియా చక్రవర్తిని అంతా వేలెత్తి చూపిస్తున్నా, ఆమెని దోషిగా నిలబెట్టి ఎంక్వయిరీలంటూ తిప్పుతున్నా, ఆఖరుకి అరెస్ట్ చేసినా కంగన స్పందించలేదు.
ఇదిలావుండగా అటు రియా చక్రవర్తి అరెస్ట్ తో పాటు కంగన ఆఫీసుని అక్రమ కట్టడం పేరిట కూలగొట్టడం ఒకేసారి జరగడంతో రియా తరఫున గళమెత్తిన బాలీవుడ్ సెలబ్రిటీలు పనిలో పనిగా కంగనకు జరిగిన దానిని ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనికి కంగన తనదయిన శైలిలో స్పందించింది. తనకు మాఫియాకి తొత్తులయిన వారి మద్దతు అక్కర్లేదని, తనను, ఒక డ్రగ్ అడిక్ట్ ప్లస్ ఒక సూపర్ స్టార్ సొమ్ము మీద పడి బ్రతికే వాళ్లకూ (రియా చక్రవర్తి) ఒకే గాటన కట్టి మీ సింపతీ చెప్పవద్దని ఘాటుగా గడ్డి పెట్టింది.
సుషాంత్ కోసం తన పోరాటం కొనసాగుతుందని అంటూనే రియా చక్రవర్తి పట్ల కించిత్ కనికరం లేదా జాలి తనకు లేనే లేవని కంగన ఈ వ్యాఖ్యలతో తేల్చి పారేసింది.
ఇదిలావుంటే రియా తరఫున మాట్లాడుతోన్న షిబానీ దండేకర్ ‘టూ సెకండ్స్ ఫేమ్’ కోసం పాకులాడుతోందని సుషాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖాండేను కామెంట్ చేయడంతో ఫాన్స్ ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. రియా మాదిరిగా నువ్వు కూడా ఫర్హాన్ అక్తర్ డబ్బులు తిని బతికేస్తున్నావని అనడమే కాకుండా ఆమె వికీ పీడియా పేజీనిండా ‘గోల్డ్ డిగ్గర్’ అంటూ వివిధ వ్యాఖ్యలతో ఎటాక్ చేసి చుక్కలు చూపించారు.
This post was last modified on September 12, 2020 10:54 am
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…