సుషాంత్ సింగ్ రాజ్పుట్కి న్యాయం జరిగేలా చూడాలని, బాలీవుడ్లో వేళ్లూనుకుపోయిన బంధుప్రీతి అతడిని బలి తీసుకుందని ముందుగా థియరీ వినిపించింది కంగన రనౌత్. మీడియా ముందుగా అదే పల్లవి ఎత్తుకుని కంగనని ఎడాపెడా ఇంటర్వ్యూలు కూడా చేసేసి బాలీవుడ్ డౌన్ డౌన్ అనేసింది. అయితే సుషాంత్ తండ్రి రియా చక్రవర్తిని వేలెత్తి చూపించడంతో మీడియా దృష్టి అటు మరలిపోయింది. కా
నీ కంగన మాత్రం మొదట్నుంచీ బంధుప్రీతి, అవుట్ సైడర్స్ టాపిక్కే కట్టుబడింది. రియా చక్రవర్తిని అంతా వేలెత్తి చూపిస్తున్నా, ఆమెని దోషిగా నిలబెట్టి ఎంక్వయిరీలంటూ తిప్పుతున్నా, ఆఖరుకి అరెస్ట్ చేసినా కంగన స్పందించలేదు.
ఇదిలావుండగా అటు రియా చక్రవర్తి అరెస్ట్ తో పాటు కంగన ఆఫీసుని అక్రమ కట్టడం పేరిట కూలగొట్టడం ఒకేసారి జరగడంతో రియా తరఫున గళమెత్తిన బాలీవుడ్ సెలబ్రిటీలు పనిలో పనిగా కంగనకు జరిగిన దానిని ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనికి కంగన తనదయిన శైలిలో స్పందించింది. తనకు మాఫియాకి తొత్తులయిన వారి మద్దతు అక్కర్లేదని, తనను, ఒక డ్రగ్ అడిక్ట్ ప్లస్ ఒక సూపర్ స్టార్ సొమ్ము మీద పడి బ్రతికే వాళ్లకూ (రియా చక్రవర్తి) ఒకే గాటన కట్టి మీ సింపతీ చెప్పవద్దని ఘాటుగా గడ్డి పెట్టింది.
సుషాంత్ కోసం తన పోరాటం కొనసాగుతుందని అంటూనే రియా చక్రవర్తి పట్ల కించిత్ కనికరం లేదా జాలి తనకు లేనే లేవని కంగన ఈ వ్యాఖ్యలతో తేల్చి పారేసింది.
ఇదిలావుంటే రియా తరఫున మాట్లాడుతోన్న షిబానీ దండేకర్ ‘టూ సెకండ్స్ ఫేమ్’ కోసం పాకులాడుతోందని సుషాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖాండేను కామెంట్ చేయడంతో ఫాన్స్ ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. రియా మాదిరిగా నువ్వు కూడా ఫర్హాన్ అక్తర్ డబ్బులు తిని బతికేస్తున్నావని అనడమే కాకుండా ఆమె వికీ పీడియా పేజీనిండా ‘గోల్డ్ డిగ్గర్’ అంటూ వివిధ వ్యాఖ్యలతో ఎటాక్ చేసి చుక్కలు చూపించారు.
This post was last modified on September 12, 2020 10:54 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…