మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత కనిపించకుండా పోయిన స్వీటీ అనుష్క తాజాగా మలయాళం మూవీ కథనర్ సెట్లో అడుగుపెట్టడం అభిమానులను సంతోషం ముంచెత్తుతోంది. విశ్వంభరలో చేస్తుందనే వార్త ఆ మధ్య షికారు చేసింది కానీ ఎందుకో వద్దనుకోవడంతో ఆ ఛాన్స్ కాస్తా త్రిషకు వెళ్లిపోయింది. దర్శకుడు క్రిష్ తో ప్లాన్ చేసుకున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు శీలవతి టైటిల్ ప్రచారంలో ఉంది కానీ ఇంకా అఫీషియల్ కాలేదు. ఇక అసలు విషయానికి వస్తే కథనర్ లో అనుష్క ఘోస్ట్ తరహా పాత్ర చేయబోతోందని కేరళ టాక్. ఆ వివరాలేంటో చూద్దాం.
కథనర్ అంటే తొమ్మిదో శతాబ్దానికి చెందిన కడమత్తు అనే క్రిస్టియన్ మత బోధకుడు, యోధుడి కథ. ఈయన హయాంలోనే కల్లియన్ కట్టు నీలి (అనుష్క) అనే అమ్మాయి ఉండేది. ట్రావెన్కోర్ కు సంబంధించిన జానపద పాటల్లో ఈమె ప్రస్తావన లేకుండా పాటలు పాడరు. అందమైన దేవత రూపంలో ఉండే దెయ్యంగా నీలి గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. దేవదాసి కూతురిగా పుట్టి కుటుంబంలోని అనూహ్య పరిణామాల వల్ల చేతబడులకు గురై చివరికి ఆత్మగా మారే క్రమంలో బోలెడు డ్రామా చోటు చేసుకుంటుంది. నీలికి కడమత్తుకు సంబంధం ఏంటనేది సస్పెన్స్.
ఇక్కడ చెప్పింది చాలా తక్కువ కానీ కథనర్, నీలిల గురించి కేరళ సాహిత్యంలో బోలెడు కంటెంట్ ఉంది. దాన్ని ఆధారంగా చేసుకునే దర్శకుడు రోజిన్ థామస్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ చెప్పిన డీటెయిల్స్ యూనిట్ అధికారికంగా చెప్పింది కాకపోయినా విశ్వసనీయ వర్గాల నుంచి లీకైనదే. మొత్తం రెండు భాగాలుగా ప్యాన్ ఇండియా రేంజ్ లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. 2025 విడుదలకు ప్లాన్ చేసుకుంటున్న ఈ పీరియాడిక్ థ్రిల్లర్ లో ఊహించని మలుపులు, షాకిచ్చే ఎపిసోడ్లు బోలెడు ఉంటాయట. ఈ లెక్కన అనుష్కని గతంలో ఎన్నడూ చూడని షాకింగ్ పాత్రలో చూడబోతున్నాం.
This post was last modified on March 12, 2024 11:02 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…