మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత కనిపించకుండా పోయిన స్వీటీ అనుష్క తాజాగా మలయాళం మూవీ కథనర్ సెట్లో అడుగుపెట్టడం అభిమానులను సంతోషం ముంచెత్తుతోంది. విశ్వంభరలో చేస్తుందనే వార్త ఆ మధ్య షికారు చేసింది కానీ ఎందుకో వద్దనుకోవడంతో ఆ ఛాన్స్ కాస్తా త్రిషకు వెళ్లిపోయింది. దర్శకుడు క్రిష్ తో ప్లాన్ చేసుకున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు శీలవతి టైటిల్ ప్రచారంలో ఉంది కానీ ఇంకా అఫీషియల్ కాలేదు. ఇక అసలు విషయానికి వస్తే కథనర్ లో అనుష్క ఘోస్ట్ తరహా పాత్ర చేయబోతోందని కేరళ టాక్. ఆ వివరాలేంటో చూద్దాం.
కథనర్ అంటే తొమ్మిదో శతాబ్దానికి చెందిన కడమత్తు అనే క్రిస్టియన్ మత బోధకుడు, యోధుడి కథ. ఈయన హయాంలోనే కల్లియన్ కట్టు నీలి (అనుష్క) అనే అమ్మాయి ఉండేది. ట్రావెన్కోర్ కు సంబంధించిన జానపద పాటల్లో ఈమె ప్రస్తావన లేకుండా పాటలు పాడరు. అందమైన దేవత రూపంలో ఉండే దెయ్యంగా నీలి గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. దేవదాసి కూతురిగా పుట్టి కుటుంబంలోని అనూహ్య పరిణామాల వల్ల చేతబడులకు గురై చివరికి ఆత్మగా మారే క్రమంలో బోలెడు డ్రామా చోటు చేసుకుంటుంది. నీలికి కడమత్తుకు సంబంధం ఏంటనేది సస్పెన్స్.
ఇక్కడ చెప్పింది చాలా తక్కువ కానీ కథనర్, నీలిల గురించి కేరళ సాహిత్యంలో బోలెడు కంటెంట్ ఉంది. దాన్ని ఆధారంగా చేసుకునే దర్శకుడు రోజిన్ థామస్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ చెప్పిన డీటెయిల్స్ యూనిట్ అధికారికంగా చెప్పింది కాకపోయినా విశ్వసనీయ వర్గాల నుంచి లీకైనదే. మొత్తం రెండు భాగాలుగా ప్యాన్ ఇండియా రేంజ్ లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. 2025 విడుదలకు ప్లాన్ చేసుకుంటున్న ఈ పీరియాడిక్ థ్రిల్లర్ లో ఊహించని మలుపులు, షాకిచ్చే ఎపిసోడ్లు బోలెడు ఉంటాయట. ఈ లెక్కన అనుష్కని గతంలో ఎన్నడూ చూడని షాకింగ్ పాత్రలో చూడబోతున్నాం.
This post was last modified on March 12, 2024 11:02 am
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…
తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…
పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గ ధామంగా మారుతుందని.. మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి.. పెట్టుబడి దారులతో…
డిసెంబరు 5 నుంచి వాయిదా పడ్డ నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘అఖండ-2’ను మరీ ఆలస్యం చేయకుండా వారం వ్యవధిలోనే…