మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత కనిపించకుండా పోయిన స్వీటీ అనుష్క తాజాగా మలయాళం మూవీ కథనర్ సెట్లో అడుగుపెట్టడం అభిమానులను సంతోషం ముంచెత్తుతోంది. విశ్వంభరలో చేస్తుందనే వార్త ఆ మధ్య షికారు చేసింది కానీ ఎందుకో వద్దనుకోవడంతో ఆ ఛాన్స్ కాస్తా త్రిషకు వెళ్లిపోయింది. దర్శకుడు క్రిష్ తో ప్లాన్ చేసుకున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు శీలవతి టైటిల్ ప్రచారంలో ఉంది కానీ ఇంకా అఫీషియల్ కాలేదు. ఇక అసలు విషయానికి వస్తే కథనర్ లో అనుష్క ఘోస్ట్ తరహా పాత్ర చేయబోతోందని కేరళ టాక్. ఆ వివరాలేంటో చూద్దాం.
కథనర్ అంటే తొమ్మిదో శతాబ్దానికి చెందిన కడమత్తు అనే క్రిస్టియన్ మత బోధకుడు, యోధుడి కథ. ఈయన హయాంలోనే కల్లియన్ కట్టు నీలి (అనుష్క) అనే అమ్మాయి ఉండేది. ట్రావెన్కోర్ కు సంబంధించిన జానపద పాటల్లో ఈమె ప్రస్తావన లేకుండా పాటలు పాడరు. అందమైన దేవత రూపంలో ఉండే దెయ్యంగా నీలి గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. దేవదాసి కూతురిగా పుట్టి కుటుంబంలోని అనూహ్య పరిణామాల వల్ల చేతబడులకు గురై చివరికి ఆత్మగా మారే క్రమంలో బోలెడు డ్రామా చోటు చేసుకుంటుంది. నీలికి కడమత్తుకు సంబంధం ఏంటనేది సస్పెన్స్.
ఇక్కడ చెప్పింది చాలా తక్కువ కానీ కథనర్, నీలిల గురించి కేరళ సాహిత్యంలో బోలెడు కంటెంట్ ఉంది. దాన్ని ఆధారంగా చేసుకునే దర్శకుడు రోజిన్ థామస్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ చెప్పిన డీటెయిల్స్ యూనిట్ అధికారికంగా చెప్పింది కాకపోయినా విశ్వసనీయ వర్గాల నుంచి లీకైనదే. మొత్తం రెండు భాగాలుగా ప్యాన్ ఇండియా రేంజ్ లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. 2025 విడుదలకు ప్లాన్ చేసుకుంటున్న ఈ పీరియాడిక్ థ్రిల్లర్ లో ఊహించని మలుపులు, షాకిచ్చే ఎపిసోడ్లు బోలెడు ఉంటాయట. ఈ లెక్కన అనుష్కని గతంలో ఎన్నడూ చూడని షాకింగ్ పాత్రలో చూడబోతున్నాం.
This post was last modified on March 12, 2024 11:02 am
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…