ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతటా సీక్వెల్స్, పార్ట్-2ల హవా నడుస్తోంది. భారీ చిత్రాలు చాలా వాటికి సీక్వెల్స్ ప్రకటించేస్తున్నారు. ఇక హిట్టయిన సినిమాలకైతే ఈ ఒరవడి ఇంకా పెరుగుతోంది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, దేవర.. ఈ జాబితా చాలా పెద్దదే.
ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’ను కూడా రెండు భాగాలుగా తీయడానికి ఎప్పుడో ప్రణాళికలు రచించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. పార్ట్-1 గత డిసెంబరులో రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయాన్ని అందుకుంది. అప్పుడే పార్ట్-2ను ‘సలార్: శౌర్యాంగపర్వం’ పేరుతో అనౌన్స్ చేశారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుంది, ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయాల్లో రకరకాల ఊహాగానాలు నడిచాయి. ముందు వెంటనే సినిమాను మొదలుపెడతారని వార్తలు రాగా.. తర్వాతేమో ఇప్పుడిప్పుడే ఆ మూవీ ఉండదని ప్రచారం జరిగింది.
ఐతే ‘సలార్’లో వరదరాజ మన్నార్గా కీలక పాత్ర పోషించిన మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్.. ‘సలార్-2’ షూట్, రిలీజ్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ‘సలార్-2’కు స్క్రిప్టు ఆల్రెడీ లాక్ అయిందని.. వచ్చే నెలలోనే షూటింగ్ ఉండొచ్చని అతను వెల్లడించాడు. అంతే కాక ‘శౌర్యాంగపర్వం’ వచ్చే ఏఢాదే విడుదలవుతుందని కూడా ప్రకటించాడు. తన కొత్త చిత్రం ‘ఆడు జీవితం’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా విలేకరులు ‘సలార్-2’ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించాడు పృథ్వీరాజ్.
ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి’, ‘రాజా సాబ్’ చిత్రాల షూటింగ్తో తీరిక లేకుండా ఉన్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇంత బిజీలో ప్రభాస్ ‘సలార్-2’కు ఎలా డేట్లు కేటాయించి వచ్చే ఏడాది సినిమా రిలీజయ్యేలా చూస్తాడో మరి.
This post was last modified on March 11, 2024 9:55 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…