ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతటా సీక్వెల్స్, పార్ట్-2ల హవా నడుస్తోంది. భారీ చిత్రాలు చాలా వాటికి సీక్వెల్స్ ప్రకటించేస్తున్నారు. ఇక హిట్టయిన సినిమాలకైతే ఈ ఒరవడి ఇంకా పెరుగుతోంది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, దేవర.. ఈ జాబితా చాలా పెద్దదే.
ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’ను కూడా రెండు భాగాలుగా తీయడానికి ఎప్పుడో ప్రణాళికలు రచించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. పార్ట్-1 గత డిసెంబరులో రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయాన్ని అందుకుంది. అప్పుడే పార్ట్-2ను ‘సలార్: శౌర్యాంగపర్వం’ పేరుతో అనౌన్స్ చేశారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుంది, ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయాల్లో రకరకాల ఊహాగానాలు నడిచాయి. ముందు వెంటనే సినిమాను మొదలుపెడతారని వార్తలు రాగా.. తర్వాతేమో ఇప్పుడిప్పుడే ఆ మూవీ ఉండదని ప్రచారం జరిగింది.
ఐతే ‘సలార్’లో వరదరాజ మన్నార్గా కీలక పాత్ర పోషించిన మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్.. ‘సలార్-2’ షూట్, రిలీజ్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ‘సలార్-2’కు స్క్రిప్టు ఆల్రెడీ లాక్ అయిందని.. వచ్చే నెలలోనే షూటింగ్ ఉండొచ్చని అతను వెల్లడించాడు. అంతే కాక ‘శౌర్యాంగపర్వం’ వచ్చే ఏఢాదే విడుదలవుతుందని కూడా ప్రకటించాడు. తన కొత్త చిత్రం ‘ఆడు జీవితం’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా విలేకరులు ‘సలార్-2’ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించాడు పృథ్వీరాజ్.
ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి’, ‘రాజా సాబ్’ చిత్రాల షూటింగ్తో తీరిక లేకుండా ఉన్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇంత బిజీలో ప్రభాస్ ‘సలార్-2’కు ఎలా డేట్లు కేటాయించి వచ్చే ఏడాది సినిమా రిలీజయ్యేలా చూస్తాడో మరి.
This post was last modified on March 11, 2024 9:55 pm
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…