ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతటా సీక్వెల్స్, పార్ట్-2ల హవా నడుస్తోంది. భారీ చిత్రాలు చాలా వాటికి సీక్వెల్స్ ప్రకటించేస్తున్నారు. ఇక హిట్టయిన సినిమాలకైతే ఈ ఒరవడి ఇంకా పెరుగుతోంది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, దేవర.. ఈ జాబితా చాలా పెద్దదే.
ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’ను కూడా రెండు భాగాలుగా తీయడానికి ఎప్పుడో ప్రణాళికలు రచించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. పార్ట్-1 గత డిసెంబరులో రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయాన్ని అందుకుంది. అప్పుడే పార్ట్-2ను ‘సలార్: శౌర్యాంగపర్వం’ పేరుతో అనౌన్స్ చేశారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుంది, ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయాల్లో రకరకాల ఊహాగానాలు నడిచాయి. ముందు వెంటనే సినిమాను మొదలుపెడతారని వార్తలు రాగా.. తర్వాతేమో ఇప్పుడిప్పుడే ఆ మూవీ ఉండదని ప్రచారం జరిగింది.
ఐతే ‘సలార్’లో వరదరాజ మన్నార్గా కీలక పాత్ర పోషించిన మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్.. ‘సలార్-2’ షూట్, రిలీజ్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ‘సలార్-2’కు స్క్రిప్టు ఆల్రెడీ లాక్ అయిందని.. వచ్చే నెలలోనే షూటింగ్ ఉండొచ్చని అతను వెల్లడించాడు. అంతే కాక ‘శౌర్యాంగపర్వం’ వచ్చే ఏఢాదే విడుదలవుతుందని కూడా ప్రకటించాడు. తన కొత్త చిత్రం ‘ఆడు జీవితం’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా విలేకరులు ‘సలార్-2’ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించాడు పృథ్వీరాజ్.
ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి’, ‘రాజా సాబ్’ చిత్రాల షూటింగ్తో తీరిక లేకుండా ఉన్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇంత బిజీలో ప్రభాస్ ‘సలార్-2’కు ఎలా డేట్లు కేటాయించి వచ్చే ఏడాది సినిమా రిలీజయ్యేలా చూస్తాడో మరి.
This post was last modified on March 11, 2024 9:55 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…