మొన్నటిదాకా పృథ్విరాజ్ సుకుమారన్ అంటే మనకంతగా పరిచయం లేదు కానీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ లో ప్రభాస్ ప్రాణ స్నేహితుడు వరదరాజ మన్నార్ పాత్రలో చూశాక ఒక్కసారిగా దగ్గరివాడు అయిపోయాడు. అందుకే ఇతని సినిమాలు క్రమంగా ప్యాన్ ఇండియా ఫ్లేవర్ తో తెలుగులోనూ రాబోతున్నాయి. వాటిలో ది గోట్ లైఫ్ ఆడు జీవితం ఒకటి. ఈ నెల మార్చి 28 విడుదలకు రెడీ అవుతోంది. దీంట్లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది భారీ బడ్జెట్ తో ఆరుదైన లొకేషన్లలో తీసిన సర్వైవల్ థ్రిల్లర్. కొంతసేపు మినహాయించి సినిమా మొత్తం ఒకే పాత్రతో వివిధ ప్రాంతాల్లో జరుగుతుంది.
జాతీయ అవార్డు దక్కించుకున్న బ్లెస్సీ దర్శకత్వంలో రూపొందిన ఆడు జీవితంలో అమలా పాల్ హీరోయిన్. లెజెండరీ మ్యుజిషియన్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. దట్టమైన ఎడారిలో మండుటెండల మధ్య నెలల తరబడి నిర్మాణం జరిగింది. ప్రముఖ రచయిత బెన్యామిన్ ఇదే టైటిల్ తో రాసిన సూపర్ హిట్ నవల ఆధారంగా దీన్ని రూపొందించారు. పృథ్విరాజ్ షాకింగ్ గెటప్స్ లో కనిపిస్తాడు. కమర్షియల్ వాసనలు మచ్చుకు కూడా లేని గోట్ లైఫ్ ని ముందు ఏప్రిల్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ తర్వాత మార్చుకుని మార్చి ఆఖరి వారానికి తీసుకొస్తున్నారు.
అన్ని ప్రధాన భాషల్లో ఆడు జీవితం డబ్బింగ్ కానుంది. పృథ్విరాజ్ నటుడిగా మాత్రమే కాదు చిరంజీవి గాడ్ ఫాదర్ ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ దర్శకుడిగానూ చాలా పేరుంది. సలార్ 2 శౌర్యంగ పర్వంలో ప్రభాస్ తో సమానంగా తనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇకపై తాను నటించిన అన్ని చిత్రాలు తెలుగులో డబ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో ఒకటి రెండు అనువాదం చేశాక బిజినెస్ లేక ఆగిపోయాయి. ఈసారి సమస్య లేకుండా ట్రైలర్ తోనే అంచనాలు తెచ్చుకున్నారు. టిల్లు స్క్వేర్ తో ఆడు జీవితం పోటీ పడనుంది.
This post was last modified on March 10, 2024 10:36 am
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…