మొన్నటిదాకా పృథ్విరాజ్ సుకుమారన్ అంటే మనకంతగా పరిచయం లేదు కానీ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ లో ప్రభాస్ ప్రాణ స్నేహితుడు వరదరాజ మన్నార్ పాత్రలో చూశాక ఒక్కసారిగా దగ్గరివాడు అయిపోయాడు. అందుకే ఇతని సినిమాలు క్రమంగా ప్యాన్ ఇండియా ఫ్లేవర్ తో తెలుగులోనూ రాబోతున్నాయి. వాటిలో ది గోట్ లైఫ్ ఆడు జీవితం ఒకటి. ఈ నెల మార్చి 28 విడుదలకు రెడీ అవుతోంది. దీంట్లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది భారీ బడ్జెట్ తో ఆరుదైన లొకేషన్లలో తీసిన సర్వైవల్ థ్రిల్లర్. కొంతసేపు మినహాయించి సినిమా మొత్తం ఒకే పాత్రతో వివిధ ప్రాంతాల్లో జరుగుతుంది.
జాతీయ అవార్డు దక్కించుకున్న బ్లెస్సీ దర్శకత్వంలో రూపొందిన ఆడు జీవితంలో అమలా పాల్ హీరోయిన్. లెజెండరీ మ్యుజిషియన్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. దట్టమైన ఎడారిలో మండుటెండల మధ్య నెలల తరబడి నిర్మాణం జరిగింది. ప్రముఖ రచయిత బెన్యామిన్ ఇదే టైటిల్ తో రాసిన సూపర్ హిట్ నవల ఆధారంగా దీన్ని రూపొందించారు. పృథ్విరాజ్ షాకింగ్ గెటప్స్ లో కనిపిస్తాడు. కమర్షియల్ వాసనలు మచ్చుకు కూడా లేని గోట్ లైఫ్ ని ముందు ఏప్రిల్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ తర్వాత మార్చుకుని మార్చి ఆఖరి వారానికి తీసుకొస్తున్నారు.
అన్ని ప్రధాన భాషల్లో ఆడు జీవితం డబ్బింగ్ కానుంది. పృథ్విరాజ్ నటుడిగా మాత్రమే కాదు చిరంజీవి గాడ్ ఫాదర్ ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ దర్శకుడిగానూ చాలా పేరుంది. సలార్ 2 శౌర్యంగ పర్వంలో ప్రభాస్ తో సమానంగా తనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇకపై తాను నటించిన అన్ని చిత్రాలు తెలుగులో డబ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో ఒకటి రెండు అనువాదం చేశాక బిజినెస్ లేక ఆగిపోయాయి. ఈసారి సమస్య లేకుండా ట్రైలర్ తోనే అంచనాలు తెచ్చుకున్నారు. టిల్లు స్క్వేర్ తో ఆడు జీవితం పోటీ పడనుంది.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…