Movie News

కర్రీ సైనైడ్ త‌ర్వాత ఈ డాక్యుమెంట‌రీనే సంచ‌ల‌నం

కొన్ని నెల‌ల కింద‌ట స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన క‌ర్రీ అండ్ సైనైడ్-ది జాలీ జోసెఫ్ కేస్ డాక్యుమెంట‌రీ ఎంత‌టి సంచ‌ల‌నం రేపిందో తెలిసిందే. కేర‌ళ‌లో త‌న కుటుంబ స‌భ్యులు, బంధువుల‌నే వేర్వేరు కార‌ణాల‌తో సైనైడ్ పెట్టి హ‌త్య చేసిన జాలీ జోసెఫ్ మీద తీసిన ఆ డాక్యుమెంట‌రీని దేశ విదేశాల్లో కోట్ల‌మంది ఎగ‌బ‌డి చూశారు. దానికి రికార్డు స్థాయిలో వ్యూస్ వ‌చ్చాయి. కొన్ని వారాల పాటు నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లో ట్రెండ్ అయింది ఆ డాక్యుమెంట‌రీ.

ఇప్పుడు అదే కోవ‌లో మ‌రో క్రైమ్ డాక్యుమెంట‌రీ నెట్‌ఫ్లిక్స్‌లో సంచ‌ల‌నం రేపుతోంది. అదే.. ది ఇంద్రాణి ముఖ‌ర్జియా స్టోరీ-బ‌రీడ్ ట్రూత్. ఇటీవ‌లే ఈ క్రైమ్ డాక్యుమెంట‌రీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. అప్ప‌ట్నుంచి అది రిలీజైన అన్ని భాష‌ల్లో టాప్‌-10లో కొన‌సాగుతోంది.

ఈ డాక్యుమెంట‌రీ చుట్టూ అనేక వివాదాలు నెల‌కొన‌డంతో రిలీజ్ విష‌యంలో ఇబ్బందులు త‌ప్ప‌లేదు. అన్ని అడ్డంకుల‌నూ దాటి ఎట్ట‌కేల‌కు ఈ డాక్యుమెంట‌రీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. అక్క‌డ దీనికి రికార్డు స్థాయిలో వ్యూస్ వ‌స్తున్నాయి. అవ‌తార్, ల‌వ్ ఈజ్ బ్లైండ్ లాంటి అంత‌ర్జాతీయ సినిమాల వ్యూస్‌ను ఇది త‌క్కువ రోజుల్లోనే దాటేయ‌డం విశేషం.

ఇంద్రాణి ముఖ‌ర్జియా వ్య‌వ‌హారం కొన్నేళ్ల కింద‌ట సంచ‌ల‌నం రేపింది. ఆమె ఒకరి త‌ర్వాత ఒక‌రు ఇద్ద‌రు భ‌ర్త‌ల నుంచి విడిపోయింది. మూడో భ‌ర్త కుమారుడితో ఇంద్రాణి మొద‌టి భ‌ర్త కూతురు ప్రేమ‌లో ప‌డింది. ఈ విష‌య‌మై గొడ‌వ‌లు జ‌రిగి.. త‌న కూతురిని గొంతు నులిమి చంపేసింది ఇంద్రాణి. ఈ విష‌యంలో ఆమె డ్రైవ‌ర్ ద్వారా మూడేళ్ల త‌ర్వాత బ‌య‌ట‌ప‌డింది. వీరి కుటుంబంలో సంబంధ బాంధ‌వ్యాలు, హ‌త్య‌కు దారి తీసిన ప‌రిస్థితులు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి.

This post was last modified on March 10, 2024 10:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

26 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

33 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

4 hours ago