తల్లికి గౌరవమిస్తూ తన పేరుని సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్న సుప్రీమ్ హీరో నిన్న అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలిం సత్య స్క్రీనింగ్ సందర్భంగా జరిపిన ప్రెస్ మీట్ లో గాంజా శంకర్ ప్రస్తావన వచ్చినప్పుడు స్పందించాడు. ఇది క్యాన్సిలయ్యిందనే వార్త మీడియాలో చదివి తెలుసుకున్నాను తప్పించి నిజంగా ఉందో లేదో రివర్స్ లో జర్నలిస్టులను ప్రశ్నించడం కొత్త సందేహాలు రేపింది. వెబ్ సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ లో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన గాసిప్స్, అప్డేట్స్ రావడం సహజం. ఇది ఇప్పుడే కాదు ఇంటర్ నెట్ లేని యుగంలోనూ దిన, వార పత్రికల్లో వచ్చేవి.
ఒకవేళ గాంజా శంకర్ నిజంగా కొనసాగిస్తూ ఉంటే అదేదో ఓపెన్ గా చెప్పేస్తే సరిపోయేది. పుకార్లని నమ్మొద్దని, గాంజా శంకర్ హీరోగా నేనే చెబుతున్నానని అంటే అభిమానులకు ఒక గ్యారెంటీ దొరికేది. కానీ సాయి దుర్గ తేజ్ ఎంతసేపూ మీకే తెలుసు అని నొక్కి నొక్కి చెప్పడం అంతు చిక్కని విషయం. నెల రోజుల క్రితమే ఈ న్యూస్ చక్కర్లు కొడుతున్నా నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం అనుమానాలను పెంచుతూ వచ్చింది. అదేదో ఇప్పుడు కుండబద్దలు కొట్టినట్టు గాంజా శంకర్ చేస్తున్నాం అనేస్తే పోయదానికి నాకేం తెలియదనడం కొత్త డౌట్లు రేపుతోంది.
ఇదొక్కటే కాదు చిత్రలహరి 2 సైతం ఒక ట్వీట్ వల్ల ఆపేయాల్సి వచ్చిందని చెప్పడం కూడా వెరైటీగా ఉంది. అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి ముందే ఎవరో లీక్ చేశారనుకుందాం. ఆ మాత్రం దానికి రద్దు చేయడం ఎందుకు కొనసాగించవచ్చు కదా. పోనీ స్టోరీనో, షూట్ చేసిన వీడియోనో లీకైతే ఏదో అనుకోవచ్చు. జస్ట్ సీక్వెల్ తీస్తున్నారని బయటికి వచ్చినంత మాత్రాన ఆపేశామని చెప్పడం ఏ కోణంలో చూసినా లాజిక్ కు అందటం లేదు. మీరే చెప్పాలి అంటూ రివర్స్ లో మీడియాని ప్రశ్నించే బదులు గాంజా శంకర్, చిత్రలహరి 2 ఖచ్చితంగా ఉంటాయో లేదో చెప్పేస్తే ఈ చర్చే ఉండేది కాదుగా.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…