సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ శంకర్.. తన ఆగమనాన్ని ఘనంగా చాటిన సినిమా ‘జెంటిల్ మేన్’. అర్జున్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన ఆ చిత్రం దక్షిణాదిన అంతటా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఈ చిత్రం సెన్సేషనల్ హిట్టయింది.
ఆ తర్వాత ఈ చిత్రాన్ని చిరంజీవి హీరోగా హిందీలో ఇదే పేరుతో తెరకెక్కించారు. అక్కడా బాగానే ఆడింది. ఈ ఒక్క సినిమాతోనే స్టార్ డైరెక్టర్ అయిపోయిన శంకర్ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. హీరో అర్జున్కు కూడా ఆ సమయానికి కెరీర్లో ఇదే అది పెద్ద హిట్. ‘జెంటిల్మేన్’ స్ఫూర్తితో తర్వాతి ఏళ్లలో మరెన్నో చిత్రాలు వచ్చాయి. ఒక మంచి పని కోసం బడా బాబుల్ని కొల్లగొట్టే హీరో పాత్రలు, కథలు మరెన్నో చూశాం. ఈ ఫార్ములా బాగా అరిగిపోయింది కూడా.
ఐతే ‘జెంటిల్మేన్’ వచ్చిన 27 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ అనౌన్స్ చేయడం విశేషం. 90ల్లో ‘జెంటిల్మేన్’ సహా కొన్ని భారీ చిత్రాలు నిర్మించి సెన్సేషన్ క్రియేట్ చేసిన కేటీ కుంజుమోనే ఈ సీక్వెల్ ప్రకటన చేయడం విశేషం. ఇందులో వివిధ భాషలకు చెందిన పెద్ద తారలు నటిస్తారని కూడా ఆయన ప్రకటించారు. కానీ సీక్వెల్కు శంకరే దర్శకుడా కాదా అన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. శంకర్ ఇప్పటికే తన మరో బ్లాక్ బస్టర్ ‘భారతీయుడు’కు సీక్వెల్ తీస్తున్నాడు. లాక్ డౌన్ లేకుంటే ఈపాటికి ఆ చిత్రం పూర్తయ్యేది.
ఒకప్పటితో పోలిస్తే శంకర్ సత్తా తగ్గినప్పటికీ ఇంకా ఆయనతో సినిమాలు చేయడానికి హీరోలు, నిర్మాతలు లైన్లో ఉన్నారు. మరి కుంజుమోన్తో ‘జెంటిల్ మేన్’ చేయడానికి శంకర్ ఓకే అన్నాడా లేదా వేరే దర్శకుడెవరైనా ‘జెంటిల్ మేన్’ సీక్వెల్ తీయబోతున్నాడా అన్నది చూడాలి. నాగార్జునతో తీసిన ‘రక్షకుడు’ సినిమాతో గట్టి ఎదురు దెబ్బ తిన్న కుంజుమోన్.. తర్వాతి కాలంలో మరికొన్ని ఫ్లాపులు ఎదురవడంతో సినిమాలు మానేశారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన ‘జెంటిల్ మేన్’ సీక్వెల్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on September 11, 2020 3:20 pm
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…