చిన్న సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు ఓటిటిలు ముందే కొనడానికి అంతగా ఆసక్తి చూపించవు. రిలీజయ్యాక ఫలితం చూసి అప్పుడో రేట్ ఆఫర్ చేస్తారు. నచ్చితే అమ్మొచ్చు లేదా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. ఇలా జరిగే సందర్భాలు తక్కువ. ఇటీవలే మలయాళంలో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మంజుమ్మెల్ బాయ్స్ షూటింగ్ జరుగుతున్న టైంలో బడ్జెట్ సరిపోక నిర్మాతలు ఓటిటి డీల్స్ కోసం ట్రై చేశారు. కానీ టైటిల్ తో పాటు క్యాస్టింగ్ కూడా ఏమంత ఆసక్తికరంగా అనిపించకపోవడంతో ఆశించిన రేట్ రాలేదు. దీంతో చేసేది లేక ప్రొడ్యూసర్లు ఏదోలా విడుదల చేసుకున్నారు.
కట్ చేస్తే మంజుమ్మెల్ బాయ్స్ రెండు వారాలు దాటకుండానే 100 కోట్ల గ్రాస్ దాటేసి బాప్రే అనిపించింది. దీంతో అరెరే ఎంత పొరపాటు జరిగిందని భావించిన ఓటిటిలు హుటాహుటిన తమ ప్రతినిధులను నిర్మాత దగ్గరకు పంపించాయి. మొదట్లో ఆయన చెప్పిన రేట్ కంటే పదింతలు ఎక్కువ ఇవ్వడానికి సిద్ధ పడుతున్నారట. ఒకవేళ త్వరగా స్ట్రీమింగ్ కు ఒప్పుకుంటే ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది. వస్తున్న ఆఫర్లు చూసి విశ్లేషించే పనిలో పడ్డ ప్రొడ్యూసర్ ఇంకా ఎవరికీ మాట ఇవ్వలేదని తెలిసింది. యాభై రోజుల తర్వాతే డిజిటల్ లో వచ్చేలా మంచి ధరకు త్వరలోనే ఫైనల్ చేస్తారట.
ఇక తెలుగు డబ్బింగ్ సంగతికొస్తే మార్చి 15 విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒరిజినల్ వెర్షన్ నిర్మాతలే ఏపీ తెలంగాణలో మైత్రి ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఒప్పందం జరిగిందని సమాచారం. పలువురు టాలీవుడ్ ప్రొడ్యూసర్లు డబ్బింగ్ రైట్స్ కోసం పోటీ పడినప్పటికీ ఎవరికీ ఇవ్వలేదని సమాచారం. అనువాదమే అయినా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ డబ్బింగ్ వెర్షన్ కి ది బాయ్స్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలిసింది. ఇలాంటి చిన్న సినిమాలు చేసే అద్భుతాల గురించి ముందే ఊహించడం కష్టం.
This post was last modified on March 8, 2024 10:01 am
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…