చిన్న సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు ఓటిటిలు ముందే కొనడానికి అంతగా ఆసక్తి చూపించవు. రిలీజయ్యాక ఫలితం చూసి అప్పుడో రేట్ ఆఫర్ చేస్తారు. నచ్చితే అమ్మొచ్చు లేదా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. ఇలా జరిగే సందర్భాలు తక్కువ. ఇటీవలే మలయాళంలో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మంజుమ్మెల్ బాయ్స్ షూటింగ్ జరుగుతున్న టైంలో బడ్జెట్ సరిపోక నిర్మాతలు ఓటిటి డీల్స్ కోసం ట్రై చేశారు. కానీ టైటిల్ తో పాటు క్యాస్టింగ్ కూడా ఏమంత ఆసక్తికరంగా అనిపించకపోవడంతో ఆశించిన రేట్ రాలేదు. దీంతో చేసేది లేక ప్రొడ్యూసర్లు ఏదోలా విడుదల చేసుకున్నారు.
కట్ చేస్తే మంజుమ్మెల్ బాయ్స్ రెండు వారాలు దాటకుండానే 100 కోట్ల గ్రాస్ దాటేసి బాప్రే అనిపించింది. దీంతో అరెరే ఎంత పొరపాటు జరిగిందని భావించిన ఓటిటిలు హుటాహుటిన తమ ప్రతినిధులను నిర్మాత దగ్గరకు పంపించాయి. మొదట్లో ఆయన చెప్పిన రేట్ కంటే పదింతలు ఎక్కువ ఇవ్వడానికి సిద్ధ పడుతున్నారట. ఒకవేళ త్వరగా స్ట్రీమింగ్ కు ఒప్పుకుంటే ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది. వస్తున్న ఆఫర్లు చూసి విశ్లేషించే పనిలో పడ్డ ప్రొడ్యూసర్ ఇంకా ఎవరికీ మాట ఇవ్వలేదని తెలిసింది. యాభై రోజుల తర్వాతే డిజిటల్ లో వచ్చేలా మంచి ధరకు త్వరలోనే ఫైనల్ చేస్తారట.
ఇక తెలుగు డబ్బింగ్ సంగతికొస్తే మార్చి 15 విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒరిజినల్ వెర్షన్ నిర్మాతలే ఏపీ తెలంగాణలో మైత్రి ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఒప్పందం జరిగిందని సమాచారం. పలువురు టాలీవుడ్ ప్రొడ్యూసర్లు డబ్బింగ్ రైట్స్ కోసం పోటీ పడినప్పటికీ ఎవరికీ ఇవ్వలేదని సమాచారం. అనువాదమే అయినా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ డబ్బింగ్ వెర్షన్ కి ది బాయ్స్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలిసింది. ఇలాంటి చిన్న సినిమాలు చేసే అద్భుతాల గురించి ముందే ఊహించడం కష్టం.
This post was last modified on March 8, 2024 10:01 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…