నందమూరి ఫ్యామిలీ నుంచి కొంచెం లేటుగా హీరో అయిన నటుడు చైతన్యకృష్ణ. నందమూరి జయకృష్ణ తనయుడైన చైతన్య.. చాలా ఏళ్ల కిందటే ‘ధమ్’ అనే సినిమాలో ఓ క్యారెక్టర్ రోల్ చేశాడు. రిలీజైనపుడు ఆ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ.. చైతన్య లీడ్ రోల్ చేసిన కొత్త చిత్రం ‘బ్రీత్’ రిలీజ్ టైంలో ‘ధమ్’లోని సీన్లు వైరల్ అయ్యాయి. అందులో చైతన్య హావభావాల మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.
ఇక ‘బ్రీత్’ సినిమా ఎంత దారుణమైన ఫలితాన్నందుకుందో తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూల తాలూకు వీడియోలకు బాగానే వ్యూస్ వచ్చాయి కానీ.. ‘బ్రీత్’ సినిమాను మాత్రం థియేటర్లకు వెళ్లి జనం చూడలేదు. ఈ చిత్రం ఈ నెల 8న ఆహా ఓటీటీ ద్వారా డిజిటల్గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇంతలో చైతన్యకృష్ణ కొత్త సినిమా గురించి కబురు బయటికి వచ్చింది.
చైతన్యకృష్ణ హీరోగా జీకే చౌదరి అనే కొత్త దర్శకుడు ఒక సినిమా తీయబోతున్నాడు. “నందమూరి చైౌతన్యకృష్ణ ఇన్ అండ్ యాజ్.. కొత్త సినిమా. వివరాలు త్వరలో” అని ఇన్నాళ్లు కో డైరెక్టర్గా పని చేసి ఇప్పుడు దర్శకుడిగా మారుతున్న జీకే చౌదరి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. బహుశా మరోసారి చైతన్యకృష్ణ తన సొంత సంస్థలోనే సినిమా చేస్తున్నట్లున్నాడు.
‘బ్రీత్’ రిజల్ట్ చూశాక అతణ్ని హీరోగా పెట్టి బయటి నిర్మాతలు సినిమా తీయడం కష్టమే. ‘బ్రీత్’ ప్రమోషన్ల టైంలోనే తాను ఇంకో మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లు చైతన్యకృష్ణ వెల్లడించాడు. అందులో ఇప్పుడు ప్రకటించిన సినిమా ఒకటి కావచ్చు. ఇదిలా ఉండగా.. ‘బ్రీత్’ మూవీ ఓటీటీలోకి వస్తుండడంతో ఆ సినిమా థియేట్రికల్ రిలీజ్ టైంలో పండుగ చేసుకున్న ట్రోలర్స్.. ఈ నందమూరి హీరోను ఇంకో రౌండ్ ఆటాడుకోవడానికి రెడీ అవుతున్నారు.
This post was last modified on March 6, 2024 3:48 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…