నందమూరి ఫ్యామిలీ నుంచి కొంచెం లేటుగా హీరో అయిన నటుడు చైతన్యకృష్ణ. నందమూరి జయకృష్ణ తనయుడైన చైతన్య.. చాలా ఏళ్ల కిందటే ‘ధమ్’ అనే సినిమాలో ఓ క్యారెక్టర్ రోల్ చేశాడు. రిలీజైనపుడు ఆ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ.. చైతన్య లీడ్ రోల్ చేసిన కొత్త చిత్రం ‘బ్రీత్’ రిలీజ్ టైంలో ‘ధమ్’లోని సీన్లు వైరల్ అయ్యాయి. అందులో చైతన్య హావభావాల మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.
ఇక ‘బ్రీత్’ సినిమా ఎంత దారుణమైన ఫలితాన్నందుకుందో తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూల తాలూకు వీడియోలకు బాగానే వ్యూస్ వచ్చాయి కానీ.. ‘బ్రీత్’ సినిమాను మాత్రం థియేటర్లకు వెళ్లి జనం చూడలేదు. ఈ చిత్రం ఈ నెల 8న ఆహా ఓటీటీ ద్వారా డిజిటల్గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇంతలో చైతన్యకృష్ణ కొత్త సినిమా గురించి కబురు బయటికి వచ్చింది.
చైతన్యకృష్ణ హీరోగా జీకే చౌదరి అనే కొత్త దర్శకుడు ఒక సినిమా తీయబోతున్నాడు. “నందమూరి చైౌతన్యకృష్ణ ఇన్ అండ్ యాజ్.. కొత్త సినిమా. వివరాలు త్వరలో” అని ఇన్నాళ్లు కో డైరెక్టర్గా పని చేసి ఇప్పుడు దర్శకుడిగా మారుతున్న జీకే చౌదరి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. బహుశా మరోసారి చైతన్యకృష్ణ తన సొంత సంస్థలోనే సినిమా చేస్తున్నట్లున్నాడు.
‘బ్రీత్’ రిజల్ట్ చూశాక అతణ్ని హీరోగా పెట్టి బయటి నిర్మాతలు సినిమా తీయడం కష్టమే. ‘బ్రీత్’ ప్రమోషన్ల టైంలోనే తాను ఇంకో మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లు చైతన్యకృష్ణ వెల్లడించాడు. అందులో ఇప్పుడు ప్రకటించిన సినిమా ఒకటి కావచ్చు. ఇదిలా ఉండగా.. ‘బ్రీత్’ మూవీ ఓటీటీలోకి వస్తుండడంతో ఆ సినిమా థియేట్రికల్ రిలీజ్ టైంలో పండుగ చేసుకున్న ట్రోలర్స్.. ఈ నందమూరి హీరోను ఇంకో రౌండ్ ఆటాడుకోవడానికి రెడీ అవుతున్నారు.
This post was last modified on March 6, 2024 3:48 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…