లాక్ డౌన్ టైంలో మెగాస్టార్ చిరంజీవి చాలా షాకులే ఇచ్చారు. తొలిసారి సోషల్ మీడియాలో అడుగు పెట్టారు. అందులో చాలా చురుగ్గా వ్యవహరించారు. రకరకాల వంటకాలు చేసి ఆశ్చర్యపరిచారు. ఈ మధ్యే ఆయన మీసం తీసి నయా లుక్లోకి మారడం మరో షాక్. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు ఏకంగా ‘గుండు’ లుక్తో దర్శనమిచ్చి విస్మయానికి గురి చేశారు.
మధ్యలో షూటింగుల్లేకపోవడంతో చిరు సరదాగా మీసం తీసినట్లు భావించారంతా. కానీ ఇంకొన్ని రోజుల్లో ‘ఆచార్య’ షూటింగ్ పున:ప్రారంభం కాబోతుండగా ఇలా గుండుతో దర్శనమివ్వడం షాక్కు గురి చేసింది అందరినీ. సోషల్ మీడియాలో ఆయన గుండు లుక్ నిమిషాల్లో వైరల్ అయిపోయింది. మెగా అభిమానులు చిరును ఎప్పుడైనా సరే ఇలాంటి లుక్లో చూస్తామని అసలు ఊహించలేదు.
నాలుగు దశాబ్దాల కెరీర్లో చిరు గుండుతో కనిపించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మీడియా హడావుడి లేనపుడు, తన మీద ఫోకస్ లేని కెరీర్ తొలి రోజుల్లో చిరు గుండు చేయించుకున్నారేమో తెలియదు కానీ.. ఆయన ఈ లుక్లో పబ్లిక్కు దర్శనమివ్వడం మాత్రం ఇదే తొలిసారి. చాలామంది హీరోల్లాగే ఆయన సినిమాల్లో మీసం తీయడానికి కూడా ఇష్టపడరు. ఒక్క ‘చంటబ్బాయి’ సినిమాలో మాత్రమే మీసం తీసి ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత మరే సినిమాలోనూ చిరు మీసం కూడా తీయలేదు.
టాలీవుడ్ టాప్ స్టార్లు డీగ్లామరైజ్డ్గా కనిపించడం అనే కాన్సెప్టే ఉండేది కాదు ఒకప్పుడు. పాత్ర కోసం మన హీరోలు గుండు చేయించుకోవడం తెలుగులో అరుదు. కళ్యాణ్ రామ్ లాంటి వాళ్లు ఒకరిద్దరు తప్పితే గుండు జోలికే వెళ్లలేదు ఎవరూ. అలాంటిది ఇప్పుడు చిరు ఇలా జుట్టు తీసేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. మరి ఇది ‘ఆచార్య’ కోసమా.. లేక ‘వేదాలం’ రీమేక్ కోసమా.. లేక మామూలుగానే గుండు చేయించుకున్నారా అన్నది చూడాలి.
This post was last modified on September 11, 2020 1:50 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…