లాక్ డౌన్ టైంలో మెగాస్టార్ చిరంజీవి చాలా షాకులే ఇచ్చారు. తొలిసారి సోషల్ మీడియాలో అడుగు పెట్టారు. అందులో చాలా చురుగ్గా వ్యవహరించారు. రకరకాల వంటకాలు చేసి ఆశ్చర్యపరిచారు. ఈ మధ్యే ఆయన మీసం తీసి నయా లుక్లోకి మారడం మరో షాక్. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు ఏకంగా ‘గుండు’ లుక్తో దర్శనమిచ్చి విస్మయానికి గురి చేశారు.
మధ్యలో షూటింగుల్లేకపోవడంతో చిరు సరదాగా మీసం తీసినట్లు భావించారంతా. కానీ ఇంకొన్ని రోజుల్లో ‘ఆచార్య’ షూటింగ్ పున:ప్రారంభం కాబోతుండగా ఇలా గుండుతో దర్శనమివ్వడం షాక్కు గురి చేసింది అందరినీ. సోషల్ మీడియాలో ఆయన గుండు లుక్ నిమిషాల్లో వైరల్ అయిపోయింది. మెగా అభిమానులు చిరును ఎప్పుడైనా సరే ఇలాంటి లుక్లో చూస్తామని అసలు ఊహించలేదు.
నాలుగు దశాబ్దాల కెరీర్లో చిరు గుండుతో కనిపించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మీడియా హడావుడి లేనపుడు, తన మీద ఫోకస్ లేని కెరీర్ తొలి రోజుల్లో చిరు గుండు చేయించుకున్నారేమో తెలియదు కానీ.. ఆయన ఈ లుక్లో పబ్లిక్కు దర్శనమివ్వడం మాత్రం ఇదే తొలిసారి. చాలామంది హీరోల్లాగే ఆయన సినిమాల్లో మీసం తీయడానికి కూడా ఇష్టపడరు. ఒక్క ‘చంటబ్బాయి’ సినిమాలో మాత్రమే మీసం తీసి ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత మరే సినిమాలోనూ చిరు మీసం కూడా తీయలేదు.
టాలీవుడ్ టాప్ స్టార్లు డీగ్లామరైజ్డ్గా కనిపించడం అనే కాన్సెప్టే ఉండేది కాదు ఒకప్పుడు. పాత్ర కోసం మన హీరోలు గుండు చేయించుకోవడం తెలుగులో అరుదు. కళ్యాణ్ రామ్ లాంటి వాళ్లు ఒకరిద్దరు తప్పితే గుండు జోలికే వెళ్లలేదు ఎవరూ. అలాంటిది ఇప్పుడు చిరు ఇలా జుట్టు తీసేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. మరి ఇది ‘ఆచార్య’ కోసమా.. లేక ‘వేదాలం’ రీమేక్ కోసమా.. లేక మామూలుగానే గుండు చేయించుకున్నారా అన్నది చూడాలి.
This post was last modified on September 11, 2020 1:50 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…