యూత్ ని టార్గెట్ చేసుకుని హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తీసిన మలయాళం సినిమా ప్రేమలు కేరళలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో చూస్తున్నాం. తెలుగు డబ్బింగ్ వెర్షన్ అదే టైటిల్ తో ఈ శుక్రవారం రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ కార్తికేయ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ అనువాదం, ప్రమోషన్ వగైరా కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నాడు. మార్చి 8 దీంతో పాటు విశ్వక్ సేన్ గామి, గోపీచంద్ భీమా విడుదలవుతున్నాయి. అజయ్ దేవగన్-మాధవన్ బాలీవుడ్ హారర్ సైతాన్ కూడా చెప్పుకోదగ్గ అంచనాలతో థియేటర్లలో అడుగు పెడుతోంది.
వీటితో కాంపిటీషన్ ని దృష్టిలో పెట్టుకుని ఇటీవలి కాలంలో ట్రెండ్ గా మారిపోయిన ముందు రోజు ప్రీమియర్లకు ప్రేమలు రెడీ అయిపోయింది. మార్చి 7 సాయంత్రం ముఖ్యమైన కేంద్రాల్లో షోలు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్ ఏఎంబి, ఏఏఏ, ప్రసాద్ మల్టీప్లెక్సు బుకింగ్స్ ఆల్రెడీ మొదలైపోయాయి. మిగిలిన చోట్ల మెల్లగా యాడ్ చేసుకుంటూ వెళ్తారు. మేజర్ నుంచి బేబీ దాకా ఎన్నో సినిమాలకు ఈ స్ట్రాటజీ బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది. ఇలా వేయడం వల్లే రంగబలి నుంచి ట్రూ లవర్ దాకా దెబ్బ తిన్నవి లేకపోలేదు. సో ఇది రెండు వైపులా పదునున్న రిస్క్.
ఆల్రెడీ ఒరిజినల్ వెర్షన్ ప్రూవ్ చేసుకున్నదే కాబట్టి తెలుగులోనూ అదే స్పందన దక్కుతుందనే ధీమాలో ఉన్నారు దర్శక నిర్మాతలు. పైగా కేవలం వారం గ్యాప్ లో ఇంకో మల్లువుడ్ సెన్సేషన్ మంజుమ్మెల్ బాయ్స్ ని తెస్తున్నారు. ఆలోగానే ప్రేమలు వీలైనంత రాబట్టుకోవాలి. బిజినెస్ పరంగా తక్కువ పెట్టుబడి కాబట్టి టాక్ పాజిటివ్ గా వస్తే వసూళ్ల రూపంలో యూతే తిరిగి ఇచ్చేస్తారు. కాకపోతే ఆ స్థాయిలో కనెక్ట్ అవ్వాలి మరి. మంచి ట్రెండీ కంటెంట్ తో రూపొందిన ప్రేమలు హీరో హీరోయిన్లు ఆల్రెడీ భాగ్యనగరంలోనే మకాం వేసి ఇంటర్వ్యూలు గట్రా తెగ ఇచ్చేస్తున్నారు.
This post was last modified on March 5, 2024 2:34 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…