క్షణ క్షణం సినిమా పాటలో సిరివెన్నెల రాసిన ఒక చరణం ఉంటుంది. కో అంటే కోటి, దొర్లుకుంటూ వస్తుంది కొండ మీది కోతి అంటూ డబ్బుంటే ఏదైనా చేయొచ్చనే అర్థంలో శాస్త్రి గారి సాహిత్యం కాలంతో సంబంధం లేకుండా ఇప్పటికీ కనెక్టవుతూనే ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావనకు ఒక ప్యాన్ ఇండియా పెళ్లి కారణం. అదేంటి మూవీస్ కి వాడే ఈ పదం హఠాత్తుగా మ్యారేజ్ కు ఎందుకనే పాయింట్ కి వద్దాం. భారతదేశపు బిజినెస్ దిగ్గజం ముఖేష్ అంబానీ గారాల వారసుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫోటోలు వీడియోలకే మైండ్ పోతోంది.
స్టార్ హీరోలు గ్రూప్ డాన్సర్లుగా మారుతున్నారు. బాలీవుడ్ ని శాశించే స్థాయిలో ఉన్న షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటోళ్ళు స్టేజి మీద ఆడుతూ పాడుతూ ఉంటే చూసేవాళ్లకు రెండు కళ్ళు చాలడం లేదు. ఖరీదయిన ఒక లగ్జరి బస్సులో వేదిక దగ్గరకు వెళ్లేందుకు తారలందరూ సామాన్యుల్లా సీట్ల కోసం వెతుకుంటున్న వీడియోలు చూసి జనాలు ఔరా అనుకుంటున్నారు. అసలు కలలో కూడా చూస్తామా లేదా అనే దృశ్యాలు ముఖేష్ అంబానీ పుణ్యమాని జరిగిపోతున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రిహానా ప్రోగ్రాంకే 70 కోట్లకు ఖర్చు పెట్టారనే వార్త ఆల్రెడీ వైరల్ అయ్యింది.
బోలెడు విశేషాలు వస్తూనే ఉన్నాయి. పెళ్లి ఖర్చు వెయ్యి కోట్లకు పైగానే అవుతుందని ఒక అంచనా. అంబానీ సంపదలో ఇదో వెంట్రుక ముక్కంత బడ్జెట్. సౌత్ నుంచి కూడా ఎందరో సెలబ్రిటీలకు ఆహ్వానాలు వెళ్లాయి. వందల ఎకరాల్లో జరుగుతున్న ఈ వేడుకని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు జీవితంలో మర్చిపోలేరని అంటున్నారు. ఫ్యాన్స్ దేవుడిగా కొలిచే స్టార్లు అంబానీ ఇంట్లో అతి మాములు మనుషుల్లా కనిపించడం చూసి షాక్ తినని వారు లేరు. నిజంగా అంబానీ కనక సినిమా ప్రొడక్షన్ ని సీరియస్ గా తీసుకుంటే హాలీవుడ్ ని తలదన్నే ప్యాన్ వరల్డ్ మూవీని తీయడం ఎంత సేపు. జరగాలనే కోరుకుందాం.
This post was last modified on March 2, 2024 5:44 pm
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…