గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ఒక ప్రాపగండా సినిమా తీసి.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి మీద బురదజల్లే ప్రయత్నం చేశాడు సీనియర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆ చిత్రం వైసీపీకి నిజంగా కలిసి వచ్చిందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఐతే వైసీపీ మాత్రం ఆ నమ్మకంతోనే ఈసారి ఆయనకు మరింత ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇచ్చి ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలు తీయించిందన్న విషయం బహిరంగ రహస్యమే.
ఐతే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను మరింతగా టార్గెట్ చేస్తూ వర్మ తీసిన ఈ సినిమాలకు కోర్టు కేసుల రూపంలో అడ్డంకులు ఎదురవడం.. వాయిదాల మీద వాయిదాలు పడడం తెలిసిందే. ఈ అడ్డంకులు తొలగిపోయాక కూడా ఫిబ్రవరి 23కు వ్యూహంను షెడ్యూల్ చేసి, చివరి నిమిషంలో వాయిదా వేశాడు వర్మ.
ఇక వర్మ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయా లేదా అనుకుంటుండగా.. మార్చి 2కు ‘వ్యూహం’ కోసం కొత్త డేట్ ఇచ్చిన వర్మ.. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగలిగాడు. ఈ వీకెండ్లో ‘ఆపరేషన్ వాలెంటైన్’; ‘చారి 111’, ‘భూతద్దం భాస్కర నారాయణ’ చిత్రాలు ఆల్రెడీ విడుదల కాగా.. తర్వాతి రోజు చడీ చప్పుడు లేకుండా థియేటర్లలోకి దిగింది ‘వ్యూహం’.
ఐతే వర్మ అంచనా వేసినట్లు టీడీపీ, జనసేన వాళ్లు ఈ సినిమా కోసం ఎగబడడం లాంటిదేమీ జరగలేదు. వాళ్లు అసలు ఈ సినిమాను పట్టించుకోనే లేదు. పోనీ వైసీపీ వాళ్లయినా ఓన్ చేసుకున్నారా అంటే అదీ జరగలేదు. ఈ సినిమా గురించి అసలు ఎక్కడా డిస్కషనే లేదు. ‘వ్యూహం’ రిలీజైన సంగతి కూడా సామాన్య జనాలకు తెలియని పరిస్థితి. రిలీజైన చోటల్లా థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సినిమా చూసిన వాళ్లు కూడా మరీ నాసిరకంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on March 2, 2024 4:37 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…