గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ఒక ప్రాపగండా సినిమా తీసి.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి మీద బురదజల్లే ప్రయత్నం చేశాడు సీనియర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆ చిత్రం వైసీపీకి నిజంగా కలిసి వచ్చిందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఐతే వైసీపీ మాత్రం ఆ నమ్మకంతోనే ఈసారి ఆయనకు మరింత ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇచ్చి ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలు తీయించిందన్న విషయం బహిరంగ రహస్యమే.
ఐతే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను మరింతగా టార్గెట్ చేస్తూ వర్మ తీసిన ఈ సినిమాలకు కోర్టు కేసుల రూపంలో అడ్డంకులు ఎదురవడం.. వాయిదాల మీద వాయిదాలు పడడం తెలిసిందే. ఈ అడ్డంకులు తొలగిపోయాక కూడా ఫిబ్రవరి 23కు వ్యూహంను షెడ్యూల్ చేసి, చివరి నిమిషంలో వాయిదా వేశాడు వర్మ.
ఇక వర్మ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయా లేదా అనుకుంటుండగా.. మార్చి 2కు ‘వ్యూహం’ కోసం కొత్త డేట్ ఇచ్చిన వర్మ.. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగలిగాడు. ఈ వీకెండ్లో ‘ఆపరేషన్ వాలెంటైన్’; ‘చారి 111’, ‘భూతద్దం భాస్కర నారాయణ’ చిత్రాలు ఆల్రెడీ విడుదల కాగా.. తర్వాతి రోజు చడీ చప్పుడు లేకుండా థియేటర్లలోకి దిగింది ‘వ్యూహం’.
ఐతే వర్మ అంచనా వేసినట్లు టీడీపీ, జనసేన వాళ్లు ఈ సినిమా కోసం ఎగబడడం లాంటిదేమీ జరగలేదు. వాళ్లు అసలు ఈ సినిమాను పట్టించుకోనే లేదు. పోనీ వైసీపీ వాళ్లయినా ఓన్ చేసుకున్నారా అంటే అదీ జరగలేదు. ఈ సినిమా గురించి అసలు ఎక్కడా డిస్కషనే లేదు. ‘వ్యూహం’ రిలీజైన సంగతి కూడా సామాన్య జనాలకు తెలియని పరిస్థితి. రిలీజైన చోటల్లా థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సినిమా చూసిన వాళ్లు కూడా మరీ నాసిరకంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…