మాములుగా ఓటిటిలో డైరెక్ట్ రిలీజ్ జరుపుకుని వర్కౌట్ అయిన సినిమాకు కొనసాగింపు థియేటర్ కోసం చేయడం అరుదు. కానీ గత ఏడాది మా ఊరి పొలిమేర దర్శక నిర్మాతలు ఈ ట్రెండ్ ని బ్రేక్ చేసి విజయవంతంగా సూపర్ హిట్ అందుకున్నారు. సీక్వెల్ కు పెట్టిన బడ్జెట్ కి మూడింతలు వసూలు చేసి ఇప్పుడు థర్డ్ పార్ట్ కోసం రెడీ అవుతోంది. ఈసారి ఖర్చు మరింత పెంచబోతున్నారు. ఇప్పుడీ విజయమే ఓదెల రైల్వే స్టేషన్ మేకర్స్ ని పురికొల్పింది. ఇవాళ లాంఛనంగా ప్రారంభమైన ఓదెల 2ని కాశిని గ్రాండ్ గా మొదలుపెట్టారు. కీలకమైన షెడ్యూల్ అక్కడే చేయబోతున్నారు.
హెబ్బా పటేల్ మొదటి భాగంలో కీలక పాత్ర పోషించింది. అయితే అదిరిపోయే బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు కానీ డీసెంట్ గానే ఆడియన్స్ కి రీచ్ అయ్యింది. వయొలెన్స్, బోల్డ్ కంటెంట్ మీద కొన్ని నెగటివ్ కామెంట్స్ లేకపోలేదు. నిర్మాత సంపత్ నంది ఈసారి తగినన్ని జాగ్రత్తలు తీసుకుని ఏకంగా మిల్కీ బ్యూటీ తమన్నాని తీసుకొచ్చి గ్లామర్ ఫ్యాక్టర్ పెంచాడు. ఇతని డైరెక్షన్ లో గతంలో తమన్నా రచ్చ, సీటీ మార్ చేసింది. ఆ బాండింగే ఇప్పుడీ ప్రాజెక్టు ఒప్పుకోవడానికి కారణం కావొచ్చు. తమన్నా బోల్డ్ సీన్స్ కి అభ్యంతరం చెప్పడం లేదని హిందీ వెబ్ సిరీస్ లో ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది.
చూస్తుంటే మెల్లగా ఓటిటి కంటెంట్ లు బిగ్ స్క్రీన్ కోసం తయారవుతున్నాయని అర్థమవుతోంది. హాట్ స్టార్, ఆహా లాంటి ఫ్లాట్ ఫార్మ్స్ ఈ విషయంలో ఎలాంటి నిబంధనలు పెట్టకపోవడంతో నిర్మాతల పని సుళువవుతోంది. అదే వరల్డ్ వైడ్ రీచ్ ఉన్న ఓటిటిల్లో ఇలా చేయలేము. అగ్రిమెంట్ లో ముందుగానే తమతో చేసిన టైటిల్, సబ్జెక్టులతో అనుమతి లేకుండా కొనసాగింపులు చేయకూడదని కండీషన్లు పెడతారు. హాట్ స్టార్ మినహాయింపుగా నిలుస్తోంది. ఓదెల 2 బడ్జెట్ దాదాపు నాలుగైదింతలు పెంచారట. కాంతార, విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్నాడు.
This post was last modified on March 1, 2024 8:01 pm
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…