మాములుగా ఓటిటిలో డైరెక్ట్ రిలీజ్ జరుపుకుని వర్కౌట్ అయిన సినిమాకు కొనసాగింపు థియేటర్ కోసం చేయడం అరుదు. కానీ గత ఏడాది మా ఊరి పొలిమేర దర్శక నిర్మాతలు ఈ ట్రెండ్ ని బ్రేక్ చేసి విజయవంతంగా సూపర్ హిట్ అందుకున్నారు. సీక్వెల్ కు పెట్టిన బడ్జెట్ కి మూడింతలు వసూలు చేసి ఇప్పుడు థర్డ్ పార్ట్ కోసం రెడీ అవుతోంది. ఈసారి ఖర్చు మరింత పెంచబోతున్నారు. ఇప్పుడీ విజయమే ఓదెల రైల్వే స్టేషన్ మేకర్స్ ని పురికొల్పింది. ఇవాళ లాంఛనంగా ప్రారంభమైన ఓదెల 2ని కాశిని గ్రాండ్ గా మొదలుపెట్టారు. కీలకమైన షెడ్యూల్ అక్కడే చేయబోతున్నారు.
హెబ్బా పటేల్ మొదటి భాగంలో కీలక పాత్ర పోషించింది. అయితే అదిరిపోయే బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు కానీ డీసెంట్ గానే ఆడియన్స్ కి రీచ్ అయ్యింది. వయొలెన్స్, బోల్డ్ కంటెంట్ మీద కొన్ని నెగటివ్ కామెంట్స్ లేకపోలేదు. నిర్మాత సంపత్ నంది ఈసారి తగినన్ని జాగ్రత్తలు తీసుకుని ఏకంగా మిల్కీ బ్యూటీ తమన్నాని తీసుకొచ్చి గ్లామర్ ఫ్యాక్టర్ పెంచాడు. ఇతని డైరెక్షన్ లో గతంలో తమన్నా రచ్చ, సీటీ మార్ చేసింది. ఆ బాండింగే ఇప్పుడీ ప్రాజెక్టు ఒప్పుకోవడానికి కారణం కావొచ్చు. తమన్నా బోల్డ్ సీన్స్ కి అభ్యంతరం చెప్పడం లేదని హిందీ వెబ్ సిరీస్ లో ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది.
చూస్తుంటే మెల్లగా ఓటిటి కంటెంట్ లు బిగ్ స్క్రీన్ కోసం తయారవుతున్నాయని అర్థమవుతోంది. హాట్ స్టార్, ఆహా లాంటి ఫ్లాట్ ఫార్మ్స్ ఈ విషయంలో ఎలాంటి నిబంధనలు పెట్టకపోవడంతో నిర్మాతల పని సుళువవుతోంది. అదే వరల్డ్ వైడ్ రీచ్ ఉన్న ఓటిటిల్లో ఇలా చేయలేము. అగ్రిమెంట్ లో ముందుగానే తమతో చేసిన టైటిల్, సబ్జెక్టులతో అనుమతి లేకుండా కొనసాగింపులు చేయకూడదని కండీషన్లు పెడతారు. హాట్ స్టార్ మినహాయింపుగా నిలుస్తోంది. ఓదెల 2 బడ్జెట్ దాదాపు నాలుగైదింతలు పెంచారట. కాంతార, విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్నాడు.
This post was last modified on March 1, 2024 8:01 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…