హీరో గోపీచంద్ అభిమానులు హిట్టు కోసం మొహం వాచిపోయిన తరుణంలో వస్తున్న సినిమా భీమా. మార్చి 8 శివరాత్రి పండగ సందర్భంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ట్రైలర్ ని బట్టి కాన్సెప్ట్ ఏదో డిఫరెంట్ గా ట్రై చేసిన ఫీలింగ్ ఇచ్చారు. పోలీస్ ఆఫీసర్ గా, పల్లె జనంలో ఒకడిగా రెండు షేడ్స్ కనిపిస్తున్నాయి. డ్యూయల్ రోలా లేక ఇంకేదయినా ట్విస్టు పెట్టారా అనేది వేచి చూడాలి. వరస డిజాస్టర్ల దెబ్బకు గోపిచంద్ మార్కెట్ దెబ్బ తిన్న మాట వాస్తవం. అలా అని అతని సినిమాలు అసలు ఎవరూ చూడటం లేదని కాదు అర్థం. ఓపెనింగ్స్ ఇప్పటికీ వస్తున్నాయి. అసలు మ్యాటర్ వేరే ఉంది.
భీమా దర్శకుడు ఏ హర్ష కన్నడం నుంచి వచ్చాడు. మనకు అంత అవగాహన లేదు కానీ శాండల్ వుడ్ లో ఇతని ట్రాక్ రికార్డు పెద్దదే. శివరాజ్ కుమార్ ఏకంగా నాలుగు సినిమాలు చేస్తే వాటిలో రెండు అతి పెద్ద బ్లాక్ బస్టర్స్. ముఖ్యంగా భజరంగి ఓ రేంజ్ లో ఆడింది. పునీత్ రాజ్ కుమార్ తో అంజనీ పుత్రతో మంచి సక్సెస్ అందుకున్నాడు. డివోషనల్ బ్యాక్ డ్రాప్ పెడుతూనే కమర్షియల్ టచ్ ఇవ్వడంలో ఇతను సిద్ధహస్తుడు. అందుకే ట్రైలర్ చూసాక ఎలాంటి అభిప్రాయం కలిగినా స్క్రీన్ మీద ఫైనల్ అవుట్ ఫుట్ మాత్రం మంచిదే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. మరి భలే ఛాన్స్ ఏమనుకుంటున్నారా.
సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఫుల్ జోష్ తీసుకొచ్చిన మాస్ సినిమా ఏదీ లేదు. అన్ని చిన్న బడ్జెట్ సినిమాలు వేసుకుని సగం కూడా నిండని థియేటర్లతో నెట్టుకుంటూ వచ్చారు. మధ్యలో ఈగల్ లాంటివి వచ్చినా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. ఆపరేషన్ వాలెంటైన్ సైతం మాస్ కోసం తీసింది కాదు. ఈ నేపథ్యంలో భీమా కనక జనాలకు కనెక్ట్ అయితే లక్కే. 14 నుంచి 20 కోట్ల లోపే తెలుగు థియేట్రికల్ బిజినెస్ చేశారనే టాక్ ఉంది. నిజమైతే మాత్రం హిట్టు టాక్ తో తొందరగానే లాభాలు పట్టొచ్చు. విశ్వక్ సేన్ గామి పోటీ ఉన్నా దాని జానర్ వేరు కాబట్టి టెన్షన్ లేదు.
This post was last modified on March 1, 2024 5:42 pm
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…
90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…
ముందు సౌత్ సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్లో స్థిరపడ్డ హీరోయిన్లు చాలామంది.. ఇక్కడి సినిమాలు, పరిస్థితుల గురించి విమర్శలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్కు ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో తెలిసిందే. ‘జస్ట్ ఆస్కింగ్’…
పదేళ్లకు పైగా 33 మంది పసి బాలురపై పునరావృత లైంగిక దాడులకు పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ బందా ప్రత్యేక పోక్సో…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటిస్తే.. అది అమలు కావాల్సిందే!. అది గిరిజన ప్రాంతమైనా.. మైదాన ప్రాంతమైనా.. చెప్పినట్టు…