హీరో గోపీచంద్ అభిమానులు హిట్టు కోసం మొహం వాచిపోయిన తరుణంలో వస్తున్న సినిమా భీమా. మార్చి 8 శివరాత్రి పండగ సందర్భంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ట్రైలర్ ని బట్టి కాన్సెప్ట్ ఏదో డిఫరెంట్ గా ట్రై చేసిన ఫీలింగ్ ఇచ్చారు. పోలీస్ ఆఫీసర్ గా, పల్లె జనంలో ఒకడిగా రెండు షేడ్స్ కనిపిస్తున్నాయి. డ్యూయల్ రోలా లేక ఇంకేదయినా ట్విస్టు పెట్టారా అనేది వేచి చూడాలి. వరస డిజాస్టర్ల దెబ్బకు గోపిచంద్ మార్కెట్ దెబ్బ తిన్న మాట వాస్తవం. అలా అని అతని సినిమాలు అసలు ఎవరూ చూడటం లేదని కాదు అర్థం. ఓపెనింగ్స్ ఇప్పటికీ వస్తున్నాయి. అసలు మ్యాటర్ వేరే ఉంది.
భీమా దర్శకుడు ఏ హర్ష కన్నడం నుంచి వచ్చాడు. మనకు అంత అవగాహన లేదు కానీ శాండల్ వుడ్ లో ఇతని ట్రాక్ రికార్డు పెద్దదే. శివరాజ్ కుమార్ ఏకంగా నాలుగు సినిమాలు చేస్తే వాటిలో రెండు అతి పెద్ద బ్లాక్ బస్టర్స్. ముఖ్యంగా భజరంగి ఓ రేంజ్ లో ఆడింది. పునీత్ రాజ్ కుమార్ తో అంజనీ పుత్రతో మంచి సక్సెస్ అందుకున్నాడు. డివోషనల్ బ్యాక్ డ్రాప్ పెడుతూనే కమర్షియల్ టచ్ ఇవ్వడంలో ఇతను సిద్ధహస్తుడు. అందుకే ట్రైలర్ చూసాక ఎలాంటి అభిప్రాయం కలిగినా స్క్రీన్ మీద ఫైనల్ అవుట్ ఫుట్ మాత్రం మంచిదే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. మరి భలే ఛాన్స్ ఏమనుకుంటున్నారా.
సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఫుల్ జోష్ తీసుకొచ్చిన మాస్ సినిమా ఏదీ లేదు. అన్ని చిన్న బడ్జెట్ సినిమాలు వేసుకుని సగం కూడా నిండని థియేటర్లతో నెట్టుకుంటూ వచ్చారు. మధ్యలో ఈగల్ లాంటివి వచ్చినా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. ఆపరేషన్ వాలెంటైన్ సైతం మాస్ కోసం తీసింది కాదు. ఈ నేపథ్యంలో భీమా కనక జనాలకు కనెక్ట్ అయితే లక్కే. 14 నుంచి 20 కోట్ల లోపే తెలుగు థియేట్రికల్ బిజినెస్ చేశారనే టాక్ ఉంది. నిజమైతే మాత్రం హిట్టు టాక్ తో తొందరగానే లాభాలు పట్టొచ్చు. విశ్వక్ సేన్ గామి పోటీ ఉన్నా దాని జానర్ వేరు కాబట్టి టెన్షన్ లేదు.
This post was last modified on March 1, 2024 5:42 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…