స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్… వీళ్లకు తోడు ఇంకొందరు స్టార్లు కలిశారంటే చాలు బడ్జెట్ ఈజీగా వంద కోట్లు దాటేస్తుంటుంది. పాట తీయాలంటే కోట్లు.. ఫైట్ తీయాలంటే కోట్లు.. కొన్ని నిమిషాల సన్నివేశాలకు కూడా కోట్లే. తీరా సినిమా చూస్తే ఈ అనవసర హంగులు, ఆర్భాటాలు తప్ప కంటెంట్ ఉండదు. అదే రొడ్డకొట్టుడు కథలు.. అవే అలవాటైన విజువల్స్. ఇలాంటి పెద్ద సినిమాల్లో ఒక పాటకో, ఫైట్కో పెట్టే బడ్జెట్ ఇస్తే అదిరిపోయే సినిమా తీస్తామని ఎంతోమంది ప్రతిభావంతులైన దర్శకులు నిర్మాతల వెంట పడుతుంటారు. కానీ వాళ్లను పట్టించుకోరు. కావాల్సిందల్లా క్రేజీ కాంబినేషనే.
ఐతే ఓ చిన్న సినిమా బృందం.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సమకూర్చుకుని.. ఏకంగా ఆరేళ్ల పాటు ఎంతో శ్రమకు ఓర్చి, ఒక తపనతో తీసిన సినిమా ‘గామి’కి వచ్చిన ఔట్ పుట్ చూసి ఇప్పుడు ఇండస్ట్రీ జనాలు నివ్వెరపోతున్నారు. క్రౌడ్ ఫండింగ్తో తీసిన సినిమాలో ఇలాంటి విజువల్సా.. ఇంత కొత్తదనమా.. అని షాకై చూస్తున్నారు ‘గామి’ ట్రైలర్ను. విషయం లేని సినిమాలకు వందల కోట్లు పోసే నిర్మాతలు ఈ చిన్న సినిమాకు వచ్చిన ఔట్ పుట్ చూసి ముక్కున వేలేసుకుంటారనడంలో సందేహం లేదు.
ఇంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్లు, చిన్న చిన్న ప్రోమోలు, మేకింగ్ వీడియోలతోనే ‘గామి’ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ట్రైలర్ చూసిన వాళ్లకు మతులు పోతున్నాయి. ఒక ఎపిక్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగించింది ఈ ట్రైలర్. ప్రతి ఫ్రేమ్లోనూ ‘గామి’ టీం తపన అంతా కనిపించింది. కొంచెం ప్రోత్సాహం అందిస్తే యంగ్ టీమ్స్ ఎలాంటి అద్భుతాలు చేయగలవో ‘గామి’ ట్రైలర్ రుజువు చేసింది.
ఇలాంటి గొప్ప ప్రయత్నానికి కొంచెం ఆలస్యంగా అయినా యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్ అండగా నిలవడం గొప్ప విషయం. ట్రైలర్తో పెంచిన అంచనాలను సినిమా అందుకుని.. ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచినట్లయితే.. టాలీవుడ్కు ఇదొక పెద్ద పాఠంలా మారడం ఖాయం.
This post was last modified on March 1, 2024 12:30 pm
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలుగువారి చూపంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదనే. అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఫలితాలు ఎలా…
నాయకుడు అంటే నలుగురికి ఆదర్శంగా నిలవాలి. అందునా ప్రజాప్రతినిధి అంటే మరింత బాధ్యతతో వ్యవహరించాలి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన తాను…
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వరకు కూడా.. అనేక జాగ్రత్తలు తీసుకున్నా రు. అధికారులను మార్చేశారు.…
రాష్ట్రంలో కీలక నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అనూహ్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచే ఆయా నియోజకవర్గాల్లోని…
టీడీపీ అధినేత చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఉండవల్లిలోని పోలింగ్ బూత్లో ఓటు వేసిన తర్వాత.. ఆయన మీడియాతో మాట్లాడుతూ..…