విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన గామి ఆరేళ్ళకు పైగా నిర్మాణంలో ఉంటూ చాలా మంది ప్రేక్షకులకు తెలియకుండా షూటింగ్ జరుపుకుంది. ఫైనల్ గా మార్చి 8 విడుదలకు రంగం సిద్ధం చేసుకుని థియేటర్లో అడుగు పెట్టనుంది. హైదరాబాద్ పీసీఎక్స్ స్క్రీన్ మీద ప్రత్యేకంగా లాంచ్ చేసిన ట్రైలర్ లాంచ్ కి సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరవ్వగా, వీడియో రూపంలో ప్రభాస్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడం స్పెషల్ సర్ప్రైజ్ గా నిలిచింది. కమర్షియల్ హంగులకు దూరంగా చాలా అరుదుగా దక్కే అనుభూతిని గామి ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు విద్యాధర్ కగిత.
శంకర్(విశ్వక్ సేన్)కో అరుదైన వ్యాధి ఉంటుంది. మనిషిని తాకకూడదు. ఎవరో పడే బాధని తన శరీరం తీసుకుని విచిత్రమైన వర్ణంలోకి మారుతూ ఉంటుంది. దీని పరిష్కారం మూడు దశాబ్దాలకోసారి హిమాలయాల్లో దొరికే అరుదైన మూలికలో ఉందని తెలుసుకుని అక్కడికి బయలుదేరతాడు. తోడుగా ఒక గైడ్(చాందిని చౌదరి)అతని వెంటే వెళ్తుంది. అయితే గామి లక్ష్యానికి, మారుమూల పల్లెటూర్లో ఉండే ఒక దేవదాసి(అభిరామి)కి సంబంధం ఉంటుంది. ఇంతకీ శంకర్ కు వచ్చిన రుగ్మత ఏమిటి, పురాణాలూ తాళపత్రాలతో ముడిపడిన పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడ్డాడనేదే కథ.
మూడున్నర నిమిషాలకు దగ్గరగా కట్ చేసిన ట్రైలర్ ని ఆద్యంతం టెర్రిఫిక్ విజువల్స్ తో నింపేశారు. లొకేషన్లు, విఎఫెక్స్, ఘాడత నిండిన సన్నివేశాలు, పాత్రల మధ్య సంబంధాలు ఇలా ఎన్నో అంశాలను మేళవించి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే దిశగా విద్యాధర్ చూపించిన పనితనం అబ్బురపరిచేలా ఉంది. విశ్వనాథ్ ఛాయాగ్రహణం, నరేష్ కుమరన్ నేపధ్య సంగీతం రెండూ పోటీ పడ్డాయి. విశ్వక్ సేన్ లుక్స్ డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. అఘోరాగా తనలో కొత్త షేడ్ ని పరిచయం చేయబోతున్నాడు. రేపిన అంచనాలకు తగ్గట్టు గామి అద్భుతం చేస్తాడా అనేది తెలియాలంటే ఇంకో వారం ఆగాలి.
This post was last modified on February 29, 2024 7:17 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…