తెలుగులో మంచి అభిరుచితో సినిమాలు తీసే దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. గ్రహణం లాంటి అవార్డు సినిమాతో మొదలుపెట్టి అష్టాచెమ్మా, అమీతుమీ, జెంటిల్మన్, సమ్మోహన లాంటి చిత్రాలతో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఐతే చాలా వరకు లో, మీడియం బడ్జెట్ సినిమాలే తీస్తున్న ఇంద్రగంటికి స్టార్లతో పెద్ద సినిమా తీయాలని ఉంది. కానీ ఆ ఆశ తీరట్లేదు. చివరగా ఆయన్నుంచి వచ్చిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నిరాశపరచగా.. దాని ఫలితంతో సంబంధం లేకుండా ఓ భారీ చిత్రం చేయడానికి ఇంద్రగంటి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
‘జటాయు’ పేరుతో దిల్ రాజు బేనర్లో ఇంద్రగంటి భారీ చిత్రం చేస్తున్నట్లు చర్చ జరిగింది. దిల్ రాజు సైతం ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరి ఆ బిగ్ బడ్జెట్ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తుంటే.. ఇంద్రగంటి మళ్లీ పాత స్టయిల్లో సినిమాను అనౌన్స్ చేశాడు.
కమెడియన్ టర్న్డ్ హీరో ప్రియదర్శి హీరోగా మళ్లీ ఓ చిన్న బడ్జెట్ మూవీనే చేయబోతున్నాడు ఇంద్రగంటి. ఆయనతో ‘జెంటిల్మన్’ సినిమాను నిర్మించిన సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. మార్చిలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్ రూప కొడయూర్ ఈ చిత్రంలో ప్రియదర్శికి జోడీగా నటించబోతోంది.
‘బలగం’ సినిమా తర్వాత ప్రియదర్శికి హీరోగా మంచి డిమాండే ఏర్పడింది. త్వరలోనే అతను ‘ఓం భీం బుష్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. హీరోగా ఇంకా రెండు మూడు చిత్రాలు రాబోతున్నాయి ప్రియదర్శి నుంచి. ఈ లోపు ఇంద్రగంటి లాంటి అభిరుచి ఉన్న దర్శకుడితో అతడి సినిమా ఖరారైంది. అతడి వైపు నుంచి ఇది మంచి ప్రాజెక్టే కానీ.. ఇంద్రగంటి నుంచి ఓ పెద్ద సినిమా ఆశించిన వాళ్లు మాత్రం నిరాశ చెందుతున్నారు.
This post was last modified on March 1, 2024 1:00 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…