క్యారెక్టర్ రోల్స్తో మొదలుపెట్టి హీరోగా ఒక స్థాయి అందుకున్న యువ కథానాయకుడు శ్రీ విష్ణు. హీరోగా అతను ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలతో ప్రయాణం సాగిస్తుంటాడు. గత ఏడాది సామజవరగమనతో మంచి హిట్ కొట్టిన శ్రీ విష్ణు.. మార్చి 22న ఓం భీం భుష్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టీజర్ చూస్తే చాలా ప్రామిసింగ్గా అనిపించింది. శ్రీ విష్ణు ఖాతాలో ఇంకో హిట్ పడేలా కనిపిస్తోంది. గురువారం శ్రీ విష్ణు పుట్టినరోజు కాగా.. ఆ సందర్భంగా అతడి రెండు కొత్త సినిమాల అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం.
అందులో ఒకటి గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో చేయబోతున్న సినిమా. కార్తీక్ రాజు అనే కొత్త దర్శకుడు రూపొందించనున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించబోతున్నాడు. గీతా ఆర్ట్స్-2లో మిడ్ రేంజ్, యంగ్ హీరోలతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు బన్నీ వాసు. ఇప్పుడిప్పుడే పెద్ద బేనర్లలోకి వస్తున్న శ్రీ విష్ణు.. ఓం భీం బుష్ కోసం యువి ్రియేషన్స్తో జట్టు కట్టాడు. ఇప్పుడతను గీతా ఆర్ట్స్లో అడుగు పెడుతున్నాడు.
శ్రీ విష్ణు పుట్టిన రోజుకు ఇంకో సినిమా ప్రకటన కూడా ఉంటుంది. అదే రాజరాజచోర దర్శకుడు హాసిత్ గోలితో చేస్తున్న సినిమా. ఇది రాజ రాజ చోరకు సీక్వెలా వేరే కథతో తెరకెక్కుతున్న సినిమానా అన్నది క్లారిటీ లేదు. ఐతే ఈ సినిమాకు స్వాగ్ అనే టైటిల్ పెడుతున్నట్లు ఇంతకుముందే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అధికారికంగా ఆ టైటిల్తోనే సినిమాను ప్రకటించబోతున్నారట. త్త ఏడాదిలో శ్రీ విష్ణు నుంచి మంచి లైనప్పే చూడబోతున్నామన్నమాట.
This post was last modified on February 28, 2024 10:12 pm
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…