Movie News

తెలుగులోకి మలయాళం సినిమాల వరద

ఇప్పుడు ఇండియాలో ఎంతో సంతోషంగా ఉన్న ఫిలిం ఇండస్ట్రీ ఏదంటే.. మాలీవుడ్ అని చెప్పేయొచ్చు. అన్ సీజన్ అని భావించే ఫిబ్రవరిలో ఈ ఇండస్ట్రీ నుంచి నాలుగు బ్లాక్‌బస్టర్ సినిమాలు రావడం విశేషం. ఈ నెల మొదటి వారంలో టొవినో థామస్‌ థ్రిల్లర్‌ మూవీ అన్వేషిప్పిన్‌ కండేదుం రిలీజై మంచి టాక్‌ తెచ్చుకుంది. తర్వాతి మూడు వారాల్లో రిలీజైన ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మెల్ బాయ్స్ సైతం బ్లాక్‌బస్టర్లు అయ్యాయి.

ఈ సినిమాలకు కేరళ అవతల కూడా మంచి స్పందన వస్తోంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో మలయాళ వెర్షన్లకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ స్పందన చూసి ఒక్కో సినిమాను తెలుగులోకి అనువాదం చేసి రిలీజ్ చేసేస్తున్నారు. ఆల్రెడీ మమ్ముట్టి సినిమా ‘భ్రమయుగం’ను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్ రిలీజ్ చేసింది.

‘ప్రేమలు’ చిత్రాన్ని మార్చి 8న రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మరో చిత్రం తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. అదే.. మంజుమ్మెల్ బాయ్స్. అందరూ కొత్త వాళ్లు కలిసి చేసిన ఈ చిత్రం మలయాళ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. రిలీజైన రోజు నుంచి హౌస్ ఫుల్ వసూళ్లతో ఆడుతోంది. హైదరాబాద్‌లో కూడా షోలు బాగా రన్ అవుతున్నాయి. ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ను మార్చి 15న తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. పేరున్న బేనరే తెలుగు వెర్షన్‌ను తీసుకురాబోతోంది.

ఒకప్పుడు అనువాదాల విషయంలో మన వాళ్ల దృష్టంతా తమిళ చిత్రాల మీదే ఉండేది. అక్కడ సక్సెస్ అయిన ప్రతి సినిమానూ తెలుగులోకి తెచ్చేసేవారు. ఫ్లాప్ సినిమాలు కూడా అనువాదం అయ్యేవి. ఓటీటీల పుణ్యమా అని మలయాళ సినిమాల సత్తా ఏంటో మన వాళ్లకు బాగా తెలిసి, వాటికి బాగా అలవాటుపడిన నేపథ్యంలో ఆ చిత్రాలు పెద్ద ఎత్తున రీమేక్ కావడంతో పాటు తెలుగులోకి డబ్ అవుతున్నాయి.

This post was last modified on February 28, 2024 2:13 pm

Share

Recent Posts

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

9 minutes ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

2 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

5 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

9 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

12 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

13 hours ago