మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కన్నప్పలో ఎంత పెద్ద స్టార్ అట్రాక్షన్ ఉందో చూస్తున్నాం. ప్రభాస్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ఇప్పటికే కన్ఫర్మ్ లిస్టులో ఉండగా తాజాగా ఈ జాబితాలో బాలకృష్ణ చేరొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. కథలో ఒక కీలక పాత్ర కోసం ఆయనైతే బాగుంటారని టీమ్ అభిప్రాయం వ్యక్తం చేయడంతో విష్ణుతో పాటు మోహన్ బాబు వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేయొచ్చని తెలిసింది. అయితే కథ విన్నాకే నిర్ణయం తీసుకోమని ఒకవేళ నో చెప్పినా తామేమీ ఫీల్ కామని ముందుగానే చెబుతారట. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి.
బాలయ్య అతిథి లేదా ప్రత్యేక పాత్రలు చేయడం చాలా అరుదు. ఒకప్పుడు తండ్రి ఎన్టీఆర్ కోసం మాత్రమే స్పెషల్ రోల్స్ చేశారు. చాలా కాలం తర్వాత మంచు మనోజ్ ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో నటించారు. అది కూడా స్టోరీ విపరీతంగా నచ్చి. సినిమా ఆడలేదు కానీ ఆ మాత్రం ఆడియన్స్ దాన్ని థియేటర్లలో చూశారంటే కేవలం బాలకృష్ణ బ్రాండ్ వల్లే. అయితే అది హారర్ టచ్ ఉన్న కామెడీ థ్రిల్లర్. కన్నప్ప కేసు వేరే. పూర్తి ఆధ్యాత్మికతతో వీర శివ భక్తుడి గాథను సరికొత్త టెక్నాలజీతో చెప్పబోతున్నారు. ఇన్ సైడ్ టాక్ అయితే రావణబ్రహ్మ కోసం బాలయ్యని సంప్రదిస్తారని అంటున్నారు.
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న కన్నప్ప ఇప్పటికే కీలకమైన షెడ్యూల్ ని విదేశాల్లో పూర్తి చేసుకుంది. ప్రభాస్ ఫస్ట్ లుక్ ని శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయాలనే ప్లానింగ్ ఉంది కానీ ఎంతమేరకు సాధ్యమవుతుందో చెప్పలేం. అసలు ఇంకా క్యాస్టింగ్ కు సంబంధించిన ఏ డీటెయిల్ ని కన్నప్ప టీమ్ అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ మహాపర్వదినం కాబట్టి కనీసం ఒక అప్డేట్ అయినా ఇవ్వాలని మంచు విష్ణు ఆలోచన. బాబీ దర్శకత్వంలో సినిమా, రాబోయే ఏపీ ఎన్నికల హడావిడిలో బిజీగా ఉన్న బాలయ్య విష్ణు ఫ్యామిలీ అడిగితే కాదనకపోవచ్చేమో కానీ డేట్లు ఏ మేరకు కుదురుతాయో.
This post was last modified on February 27, 2024 12:25 pm
కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడుకు పెట్టని కోట. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ టీడీపీ తప్ప…
స్టార్ ఇమేజ్ ఎంత ఉన్నా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్న డిజిటల్ మార్కెట్ వాళ్ళకో సవాల్ గా మారిపోయింది. కరోనా…
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…