మాములుగా అయితే భారతీయుడు 2ని రామ్ చరణ్ అభిమానులు అంత సీరియస్ గా తీసుకునేవాళ్లు కాదు కానీ తమ హీరో గేమ్ ఛేంజర్ కి, దానికి ఒకే దర్శకుడు కావడంతో రిలీజ్ డేట్ కోసమైనా ఫాలో కాక తప్పడం లేదు. శంకర్ ఇప్పటిదాకా ముందు ఏది విడుదల చేయాలనే దాని మీద స్పష్టత ఇవ్వలేదు. నిర్మాణ సంస్థలు దాని కోసమే ఎదురు చూస్తున్నాయి. ఇంకోవైపు గుట్టుచప్పుడు కాకుండా ఇండియన్ 2 ప్రమోషన్లు తమిళనాడులో భారీ ఎత్తున మొదలుపెట్టారు. నిలువెత్తు బిల్డింగులు మీద కమల్ హాసన్ పెయింటింగులు, హోర్డింగులు ఆఘమేఘాల మీద ఏర్పాటు చేస్తున్నారు.
అంటే ఆల్రెడీ ప్రచారం జరుగుతున్నట్టు భారతీయుడు 2 మేలో వస్తుందనే కామెంట్లకు బలం చేకూరినట్టే. అయితే కల్కి 2898 ఏడిలోనూ కమల్ హాసన్ ఉన్నారు కాబట్టి తక్కువ గ్యాప్ లో రెండు రిలీజులు ఉండటం అసాధ్యం. కనీసం పదిహేను రోజుల నిడివి ఉండాలి. ఆ దిశగానే లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ 2ని మే మూడు లేదా నాలుగో వారంలో దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తోందని చెన్నై వర్గాల కథనం. మూడో భాగం కూడా ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ప్రమోషన్లు మొదలుపెట్టేసి అభిమానులను విడుదలకు సిద్ధం చేస్తే హైప్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవనే ప్లానింగ్ జరుగుతోంది.
ఆడియో రిలీజ్ ఈవెంట్ ని ఏప్రిల్ లో చేసే అవకాశముంది. కమల్ తో పాటు సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జె సూర్య, ప్రియా భవాని శంకర్, బ్రహ్మానందం, బాబీ సింహ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉండటంతో బజ్ మాములుగా ఉండేలా లేదు. పైగా మొదటిసారి శంకర్ తో కలిసి అనిరుద్ రవిచందర్ పని చేస్తున్నాడు. ఇక అంచనాలు ఎలా ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. ఒకవేళ ఇక్కడ చెప్పినట్టు రిలీజ్ కనక మేలోనే ఉంటే గేమ్ ఛేంజర్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రావడం ఖాయం. అది కూడా పవన్ ఓజి మీద ఆధారపడి ఉంది. శంకర్ మాత్రం రెండు సినిమాల పీకల్లోతు పనుల్లో యమా బిజీగా తిరుగుతున్నారు.
This post was last modified on February 27, 2024 12:21 pm
యానిమల్ విడుదలైన టైంలో, అంతకు ముందు కబీర్ సింగ్ సమయంలో బాలీవుడ్ విమర్శకులు, కొందరు నటీనటులు అదే పనిగా దర్శకుడు…
ఎన్నికల ప్రచారంలో ఎండనక.. వాననక.. నానా కష్టాలూ పడిన రాజకీయ ప్రముఖులు, పోలింగ్ తర్వాత, కౌంటింగ్కి ముందు.. కొంత ఉపశమనం…
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోటీకి దిగిన వైసీపీ ఎంపీ (కాకినాడ) వంగా గీత, జనసేన పార్టీలోకి…
ఏపీలో రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ఎన్నికల పోలింగ్ జరిగిన ఈ నెల 13న, ఆ రోజు తర్వాత కూడా..…
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 6…
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…