Movie News

తన పేరు వాడొద్దన్న మోహన్ బాబు

ఒకప్పుడు రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉండేవారు లెజెండరీ నటుడు మంచు మోహన్ బాబు. రాజ్యసభ్య సభ్యుడిగానూ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. చాలా ఏళ్ల నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన కొడుకు మంచు విష్ణుతో కలిసి ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం తెలిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఫీజు రీఎంబర్స్‌మెంట్ బిల్లులు ఇవ్వనందుకు చంద్రబాబు సర్కారు మీద యుద్ధం కూడా ప్రకటించారు మోహన్ బాబు.

కట్ చేస్తే ఎన్నికల తర్వాత కొంత కాలానికే ఆయన ఇన్‌యాక్టివ్ అయిపోయారు. అధికార వైసీపీతోనూ సంబంధాలు నెరపట్లేదు. తటస్థంగా ఉంటున్నారు. త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోహన్ బాబు ఇప్పుడేం స్టాండ్ తీసుకుంటారా అని అందరూ చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన రాజకీయంగా ఎవరూ తన పేరు వాడొద్దంటూ విజ్ఞప్తి చేస్తూ.. అలా చేసే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

“ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టిపెట్టగలగాలి గాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల లోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ.. ధన్యవాదాలతో మంచు మోహన్ బాబు” అని మోహన్ బాబు పేర్కొన్నారు.

Satya

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

27 minutes ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

1 hour ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

1 hour ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

1 hour ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

2 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

2 hours ago