మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఐతే ఆ సినిమా విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతుండడం.. టీం నుంచి ఏ రకమైన అప్డేట్స్ లేకపోవడంతో అభిమానుల్లో ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది. అదే సమయంలో చరణ్ చేయబోయే కొత్త చిత్రం వారి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి.
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ చిత్రానికి పని చేయబోతుండటం ఎగ్జైట్మెంట్ పెంచే విషయాలే. చరణ్ సరసన ఈ సినిమాలో జాన్వి కపూర్ కథానాయికగా నటించనున్న విషయం కూడా ఖరారైంది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి కూడా ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది.
‘యానిమల్’ సినిమాలో అబ్రార్ పాత్రతో సంచలనం రేపిన బాబీ డియోల్ను చరణ్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకు ఎంచుకోవాలని చూస్తున్నారట. ఆయనతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. బాబీ ఆల్రెడీ బాలయ్య సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నాడు. ‘యానిమల్’ రిలీజ్ కాకముందే అతనీ కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ సినిమా రిలీజ్ తర్వాత బాబీ డిమాండ్ బాగా పెరిగిపోయింది.
బాలీవుడ్ నుంచే కాక సౌత్ నుంచి కూడా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. చరణ్-బుచ్చిబాబు సినిమా రేంజ్ దృష్ట్యా అందులో విలన్ పాత్ర చేయడానికి బాబీ కచ్చితంగా అంగీకరిస్తాడనే అనుకుంటున్నారు. ఉత్తరాంద్ర నేపథ్యంలో ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్ కోచ్ పాత్ర చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో కొన్ని పాత్రల కోసం ఉత్తరాంధ్రలో ఆడిషన్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on February 26, 2024 5:37 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…