మాచో స్టార్ గోపిచంద్ హిట్టు చూసి చాలా కాలమే అయినా తనమీద ప్రేక్షకులకున్న ఆసక్తికి కొదవ లేదు. కాకపోతే సరైన సినిమా పడక సక్సెస్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఆ కొరత భీమా తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. శాండల్ వుడ్ ఫేమ్ హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏదో రెగ్యులర్ పోలీస్ డ్రామా అనుకున్నారు కానీ టీజర్ నుంచి క్రమంగా అంచనాలు మొదలైపోయాయి. ఇవాళ ట్రైలర్ చూశాక క్లారిటీ వచ్చింది. ఇదేదో రొటీన్ గా నడిచే ఖాకీ వర్సెస్ పొలిటీషియన్ బ్యాక్ డ్రాప్ కాదు. ఫాంటసీ టచ్ తో కొత్తగా ట్రై చేస్తున్న అభిప్రాయం కలిగించారు.
ఎక్కడో సుదూర తీరాన ఉండే పరశురామ క్షేత్రంలో సాక్ష్యాత్తు పరమశివుడే కొలువై ఉన్నాడని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే నిత్యం పూజా పురస్కారాలతో కొలుస్తూ ఉంటారు. ఎందరో అఘోరాలు అక్కడే ఉంటూ శివ కృప కోసం ఎదురు చూస్తుంటారు. అయితే కొందరు దుర్మార్గులు దాన్ని హస్తగతం చేసుకుని అరాచకాలకు నిలయంగా మార్చడంతో ఆ ఊరికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ భీమా(గోపిచంద్) దాన్ని కట్టడి చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉండే భయంకర వలయంలో అధికారిలా కాకుండా పరశురాముడిగా అడుగు పెడతాడు.
విజువల్స్ బాగున్నాయి. గోపీచంద్ ని గోలీమార్ తర్వాత మళ్ళీ అంతకంటే ఊర మాస్ పోలీస్ క్యారెక్టర్ లో చూడటం మాస్ కి కిచ్చి ఇచ్చేలా ఉంది. కెజిఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ నేపధ్య సంగీతం థీమ్ ని ఎలివేట్ చేసేలా సాగింది. ప్రియాంకా భవాని మోహన్ హీరోయిన్ గా నటించగా మాళవిక శర్మ, నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ఛమ్మక్ చంద్ర ఇలా భారీ తారాగణమే ఉంది. బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టు శివరాత్రి రోజు మార్చి 8 విడుదల కాబోతున్న భీమాని సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ నిర్మించారు. ట్రైలర్ కు తగ్గట్టు సినిమా ఉంటే భీముడి ఖాతాలో హిట్టు పడ్డట్టే
This post was last modified on February 24, 2024 5:16 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…