మాచో స్టార్ గోపిచంద్ హిట్టు చూసి చాలా కాలమే అయినా తనమీద ప్రేక్షకులకున్న ఆసక్తికి కొదవ లేదు. కాకపోతే సరైన సినిమా పడక సక్సెస్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఆ కొరత భీమా తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. శాండల్ వుడ్ ఫేమ్ హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏదో రెగ్యులర్ పోలీస్ డ్రామా అనుకున్నారు కానీ టీజర్ నుంచి క్రమంగా అంచనాలు మొదలైపోయాయి. ఇవాళ ట్రైలర్ చూశాక క్లారిటీ వచ్చింది. ఇదేదో రొటీన్ గా నడిచే ఖాకీ వర్సెస్ పొలిటీషియన్ బ్యాక్ డ్రాప్ కాదు. ఫాంటసీ టచ్ తో కొత్తగా ట్రై చేస్తున్న అభిప్రాయం కలిగించారు.
ఎక్కడో సుదూర తీరాన ఉండే పరశురామ క్షేత్రంలో సాక్ష్యాత్తు పరమశివుడే కొలువై ఉన్నాడని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే నిత్యం పూజా పురస్కారాలతో కొలుస్తూ ఉంటారు. ఎందరో అఘోరాలు అక్కడే ఉంటూ శివ కృప కోసం ఎదురు చూస్తుంటారు. అయితే కొందరు దుర్మార్గులు దాన్ని హస్తగతం చేసుకుని అరాచకాలకు నిలయంగా మార్చడంతో ఆ ఊరికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ భీమా(గోపిచంద్) దాన్ని కట్టడి చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉండే భయంకర వలయంలో అధికారిలా కాకుండా పరశురాముడిగా అడుగు పెడతాడు.
విజువల్స్ బాగున్నాయి. గోపీచంద్ ని గోలీమార్ తర్వాత మళ్ళీ అంతకంటే ఊర మాస్ పోలీస్ క్యారెక్టర్ లో చూడటం మాస్ కి కిచ్చి ఇచ్చేలా ఉంది. కెజిఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ నేపధ్య సంగీతం థీమ్ ని ఎలివేట్ చేసేలా సాగింది. ప్రియాంకా భవాని మోహన్ హీరోయిన్ గా నటించగా మాళవిక శర్మ, నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ఛమ్మక్ చంద్ర ఇలా భారీ తారాగణమే ఉంది. బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టు శివరాత్రి రోజు మార్చి 8 విడుదల కాబోతున్న భీమాని సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ నిర్మించారు. ట్రైలర్ కు తగ్గట్టు సినిమా ఉంటే భీముడి ఖాతాలో హిట్టు పడ్డట్టే
This post was last modified on February 24, 2024 5:16 pm
ఏపీలో పోలింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటల ముందు.. సంచలనం చోటు చేసుకుంది. కూటమి పార్టీల ముఖ్య నేత, టీడీపీ అధినేత…
ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో నాయకులు, పార్టీల అధినే తలు ఎక్కడికక్కడ సేద…
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది.…
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్లో పవన్కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…
ఆంధ్రప్రదేశ్లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…