మాచో స్టార్ గోపిచంద్ హిట్టు చూసి చాలా కాలమే అయినా తనమీద ప్రేక్షకులకున్న ఆసక్తికి కొదవ లేదు. కాకపోతే సరైన సినిమా పడక సక్సెస్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఆ కొరత భీమా తీరుస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. శాండల్ వుడ్ ఫేమ్ హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏదో రెగ్యులర్ పోలీస్ డ్రామా అనుకున్నారు కానీ టీజర్ నుంచి క్రమంగా అంచనాలు మొదలైపోయాయి. ఇవాళ ట్రైలర్ చూశాక క్లారిటీ వచ్చింది. ఇదేదో రొటీన్ గా నడిచే ఖాకీ వర్సెస్ పొలిటీషియన్ బ్యాక్ డ్రాప్ కాదు. ఫాంటసీ టచ్ తో కొత్తగా ట్రై చేస్తున్న అభిప్రాయం కలిగించారు.
ఎక్కడో సుదూర తీరాన ఉండే పరశురామ క్షేత్రంలో సాక్ష్యాత్తు పరమశివుడే కొలువై ఉన్నాడని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే నిత్యం పూజా పురస్కారాలతో కొలుస్తూ ఉంటారు. ఎందరో అఘోరాలు అక్కడే ఉంటూ శివ కృప కోసం ఎదురు చూస్తుంటారు. అయితే కొందరు దుర్మార్గులు దాన్ని హస్తగతం చేసుకుని అరాచకాలకు నిలయంగా మార్చడంతో ఆ ఊరికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ భీమా(గోపిచంద్) దాన్ని కట్టడి చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉండే భయంకర వలయంలో అధికారిలా కాకుండా పరశురాముడిగా అడుగు పెడతాడు.
విజువల్స్ బాగున్నాయి. గోపీచంద్ ని గోలీమార్ తర్వాత మళ్ళీ అంతకంటే ఊర మాస్ పోలీస్ క్యారెక్టర్ లో చూడటం మాస్ కి కిచ్చి ఇచ్చేలా ఉంది. కెజిఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ నేపధ్య సంగీతం థీమ్ ని ఎలివేట్ చేసేలా సాగింది. ప్రియాంకా భవాని మోహన్ హీరోయిన్ గా నటించగా మాళవిక శర్మ, నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ఛమ్మక్ చంద్ర ఇలా భారీ తారాగణమే ఉంది. బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టు శివరాత్రి రోజు మార్చి 8 విడుదల కాబోతున్న భీమాని సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ నిర్మించారు. ట్రైలర్ కు తగ్గట్టు సినిమా ఉంటే భీముడి ఖాతాలో హిట్టు పడ్డట్టే
This post was last modified on February 24, 2024 5:16 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…