న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం టీజర్ ఇవాళ హీరో పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. రెగ్యులర్ షూట్ కి ముందే చిన్న వీడియో తీసి ప్రత్యేకంగా కాన్సెప్ట్ ని పరిచయం చేసిన టీమ్ ఈ రోజు మరిన్ని కీలకమైన క్లూస్ తో స్టోరీకి సంబంధించిన గుట్టు విప్పింది. అంటే సుందరానికి తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కలయికలో ఇది రూపొందుతోంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా జేక్స్ బెజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. మాస్ ట్రీట్ అని పెట్టిన ట్యాగ్ కి న్యాయం జరిగేలా కంటెంట్ ఇవ్వడం విశేషం.
సూర్య(నాని)కి కోపం ఎక్కువ. కానీ దాన్ని రోజూ ప్రదర్శించడు. కేవలం శనివారం మాత్రమే అతని ఆగ్రహం బయటికి వస్తుంది. అది కూడా ఒక పద్దతి ప్రకారం ప్రణాళిక వేసుకున్నట్టు తీస్తాడు. ఆ రోజు తలపడిన వాళ్ళు ఎవరైనా సరే చిత్తు కావాల్సిందే. కానీ సందర్భాలన్నీ అలా ప్లాన్ చేసుకుని రావు కదా. అయినా సరే సూర్య భావోద్వేగాలను ఎలా అణుచుకుంటాడు, ఇతని వెంటపడిన పోలీస్ ఆఫీసర్ (ఎస్జె సూర్య) వెనుక ఉన్న కథ, వీళ్లిద్దరి మధ్య వైరం లాంటి ఎన్నో ప్రశ్నలు తెరమీద చూడాలంటున్నారు. ఆగస్ట్ 29 విడుదల తేదీని వీడియో చివర్లో ప్రకటించేసారు.
సో రిలీజ్ డేట్ కి సంబంధించిన సస్పెన్స్ తీరిపోయింది. డివివి ఎంటర్ టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో తీస్తున్న సరిపోదా శనివారం కోసం వివేక్ ఆత్రేయ తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా యాక్షన్ ప్లస్ మాస్ ని ఎంచుకోవడం విశేషం. దసరా తర్వాత మళ్ళీ ఆ స్థాయి మాస్ ఇందులో చూడొచ్చని టాక్. ఆ ఫీల్ ని ఈ సినిమా కొనసాగిస్తుందని అభిమానుల నమ్మకం. క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే హాయ్ నాన్న తర్వాత కొత్త సినిమా విడుదలకు ఆరు నెలల సమయం పడుతున్నా నాని వెనుకాడకుండా సహకరిస్తున్నాడు. వేసవిలో షూటింగ్ పూర్తి చేసి జూలై చివరి వారం నుంచి ప్రమోషన్లు మొదలుపెడతారు.
This post was last modified on February 24, 2024 12:21 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…