న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం టీజర్ ఇవాళ హీరో పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. రెగ్యులర్ షూట్ కి ముందే చిన్న వీడియో తీసి ప్రత్యేకంగా కాన్సెప్ట్ ని పరిచయం చేసిన టీమ్ ఈ రోజు మరిన్ని కీలకమైన క్లూస్ తో స్టోరీకి సంబంధించిన గుట్టు విప్పింది. అంటే సుందరానికి తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కలయికలో ఇది రూపొందుతోంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా జేక్స్ బెజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. మాస్ ట్రీట్ అని పెట్టిన ట్యాగ్ కి న్యాయం జరిగేలా కంటెంట్ ఇవ్వడం విశేషం.
సూర్య(నాని)కి కోపం ఎక్కువ. కానీ దాన్ని రోజూ ప్రదర్శించడు. కేవలం శనివారం మాత్రమే అతని ఆగ్రహం బయటికి వస్తుంది. అది కూడా ఒక పద్దతి ప్రకారం ప్రణాళిక వేసుకున్నట్టు తీస్తాడు. ఆ రోజు తలపడిన వాళ్ళు ఎవరైనా సరే చిత్తు కావాల్సిందే. కానీ సందర్భాలన్నీ అలా ప్లాన్ చేసుకుని రావు కదా. అయినా సరే సూర్య భావోద్వేగాలను ఎలా అణుచుకుంటాడు, ఇతని వెంటపడిన పోలీస్ ఆఫీసర్ (ఎస్జె సూర్య) వెనుక ఉన్న కథ, వీళ్లిద్దరి మధ్య వైరం లాంటి ఎన్నో ప్రశ్నలు తెరమీద చూడాలంటున్నారు. ఆగస్ట్ 29 విడుదల తేదీని వీడియో చివర్లో ప్రకటించేసారు.
సో రిలీజ్ డేట్ కి సంబంధించిన సస్పెన్స్ తీరిపోయింది. డివివి ఎంటర్ టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో తీస్తున్న సరిపోదా శనివారం కోసం వివేక్ ఆత్రేయ తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా యాక్షన్ ప్లస్ మాస్ ని ఎంచుకోవడం విశేషం. దసరా తర్వాత మళ్ళీ ఆ స్థాయి మాస్ ఇందులో చూడొచ్చని టాక్. ఆ ఫీల్ ని ఈ సినిమా కొనసాగిస్తుందని అభిమానుల నమ్మకం. క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే హాయ్ నాన్న తర్వాత కొత్త సినిమా విడుదలకు ఆరు నెలల సమయం పడుతున్నా నాని వెనుకాడకుండా సహకరిస్తున్నాడు. వేసవిలో షూటింగ్ పూర్తి చేసి జూలై చివరి వారం నుంచి ప్రమోషన్లు మొదలుపెడతారు.
This post was last modified on February 24, 2024 12:21 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మోరి-5 డ్రిల్లింగ్ సైట్లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో సంక్రాంతి సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…