న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం టీజర్ ఇవాళ హీరో పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. రెగ్యులర్ షూట్ కి ముందే చిన్న వీడియో తీసి ప్రత్యేకంగా కాన్సెప్ట్ ని పరిచయం చేసిన టీమ్ ఈ రోజు మరిన్ని కీలకమైన క్లూస్ తో స్టోరీకి సంబంధించిన గుట్టు విప్పింది. అంటే సుందరానికి తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కలయికలో ఇది రూపొందుతోంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా జేక్స్ బెజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. మాస్ ట్రీట్ అని పెట్టిన ట్యాగ్ కి న్యాయం జరిగేలా కంటెంట్ ఇవ్వడం విశేషం.
సూర్య(నాని)కి కోపం ఎక్కువ. కానీ దాన్ని రోజూ ప్రదర్శించడు. కేవలం శనివారం మాత్రమే అతని ఆగ్రహం బయటికి వస్తుంది. అది కూడా ఒక పద్దతి ప్రకారం ప్రణాళిక వేసుకున్నట్టు తీస్తాడు. ఆ రోజు తలపడిన వాళ్ళు ఎవరైనా సరే చిత్తు కావాల్సిందే. కానీ సందర్భాలన్నీ అలా ప్లాన్ చేసుకుని రావు కదా. అయినా సరే సూర్య భావోద్వేగాలను ఎలా అణుచుకుంటాడు, ఇతని వెంటపడిన పోలీస్ ఆఫీసర్ (ఎస్జె సూర్య) వెనుక ఉన్న కథ, వీళ్లిద్దరి మధ్య వైరం లాంటి ఎన్నో ప్రశ్నలు తెరమీద చూడాలంటున్నారు. ఆగస్ట్ 29 విడుదల తేదీని వీడియో చివర్లో ప్రకటించేసారు.
సో రిలీజ్ డేట్ కి సంబంధించిన సస్పెన్స్ తీరిపోయింది. డివివి ఎంటర్ టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో తీస్తున్న సరిపోదా శనివారం కోసం వివేక్ ఆత్రేయ తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా యాక్షన్ ప్లస్ మాస్ ని ఎంచుకోవడం విశేషం. దసరా తర్వాత మళ్ళీ ఆ స్థాయి మాస్ ఇందులో చూడొచ్చని టాక్. ఆ ఫీల్ ని ఈ సినిమా కొనసాగిస్తుందని అభిమానుల నమ్మకం. క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే హాయ్ నాన్న తర్వాత కొత్త సినిమా విడుదలకు ఆరు నెలల సమయం పడుతున్నా నాని వెనుకాడకుండా సహకరిస్తున్నాడు. వేసవిలో షూటింగ్ పూర్తి చేసి జూలై చివరి వారం నుంచి ప్రమోషన్లు మొదలుపెడతారు.
This post was last modified on February 24, 2024 12:21 pm
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం…