మే 9 విడుదల నుంచి తప్పుకునే అవకాశాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా కల్కి 2898 ఏడి టీమ్ తన పని తాను చేసుకుపోతోంది. 78 సెకండ్ల నిడివి ఉన్న టీజర్ శివరాత్రి పండక్కు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ఆ చిన్న వీడియోకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వైజయంతి మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో కథానాయిక దిశా పటానితో ఇటీవలే కీలక పాటల చిత్రీకరణ జరిపాడు దర్శకుడు నాగ అశ్విన్.
చేతిలో ఉన్నదీ కేవలం రెండున్నర నెలలే అయినప్పటికీ టార్గెట్ మిస్ కాకూడదనే ఉద్దేశంతో స్వప్న బృందం డే అండ్ నైట్ వర్క్ చేస్తోంది. ప్రభాస్ మినహాయించి మిగిలిన వాళ్లతో డబ్బింగ్ కూడా చెప్పిస్తున్నారని సమాచారం. కమల్ హాసన్ పాత్ర రెండో భాగంలో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి పార్ట్ 1కి సంబంధించి ఎక్కువ టైం అవసరం లేకుండానే ఆయన భాగాన్ని పూర్తి చేశారట. అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్ తాలూకు పార్ట్ కూడా అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు విఎఫెక్స్ ని సమాంతరంగా చేస్తూ ఆలస్యం జరగకుండా చూసుకుంటున్నారు.
సో ప్రభాస్ ఫ్యాన్స్ నిశ్చింతగా ఉండొచ్చు. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తెరవెనుక చకచకా పూర్తి చేసేస్తున్నారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చిన ఆరు నెలలకే కల్కి రిలీజ్ ఉంటుందా లేదా అనే సందేహాలకు చెక్ పడినట్టే. ఏప్రిల్ మొత్తం విపరీతమైన ప్రమోషన్ల కోసం రంగం సిద్ధమవుతోంది. భారతీయ చరిత్రలో పెద్ద ఓపెనింగ్ వచ్చే దిశగా కల్కికి పబ్లిసిటీ చేసేందుకు ప్లాన్ రెడీ చేశారని తెలిసింది. అయితే సీక్వెల్ కు సంబంధించి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏదైనా ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేయాలా లేక డైరెక్ట్ గా క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇవ్వాలనేది ఇంకా డిసైడ్ చేయలేదట.
This post was last modified on February 23, 2024 3:47 pm
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…