రేపు దేశవ్యాప్తంగా పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో ఏ సినిమా ఏ స్క్రీన్ లో అయినా సరే కేవలం 99 రూపాయలకే చూసేయొచ్చు. కానీ ఆ అవకాశం తెలుగు రాష్ట్రాల్లో లేదు. తెలంగాణలో కనిష్టంగా 112, ఆంధ్రప్రదేశ్ లో యథావిధిగా 177 చెల్లించుకోవాల్సిందే. కానీ ఉత్తరాది ఆడియన్స్ మాత్రం ఆర్టికల్ 370, క్రాక్ లాంటి లేటెస్ట్ రిలీజులు చవక ధరలో చూసేస్తారు. రేపు మన దగ్గర సుందరం మాస్టర్, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా లాంటి చిన్న చిత్రాలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వాటికి 99 రేట్ పెడితే ఎక్కువ శాతం ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హౌస్ ఫుల్స్ కూడా కావొచ్చు.
కానీ జిఓ పరిమితులు, ప్రభుత్వ అనుమతులు క్లిష్టంగా ఉన్న కారణంగానే ఇక్కడ అమలు చేయలేకపోతున్నామని ఆఫ్ ది రికార్డ్ పివిఆర్ వర్గాలు అంటుండగా మూవీ లవర్స్ మాత్రం ఇది కేవలం వివక్షని, సినిమాలు చూడకుండా ఉండలేని దక్షిణాది ప్రేక్షకుల బలహీనతను ఆసరాగా చేసుకుని తగ్గింపు ఇవ్వడం లేదని భగ్గుమంటున్నారు. ఏపీలో మరీ అన్యాయంగా ఇలాంటి సందర్భాల్లోనూ ప్రత్యేక వెసులుబాటు లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. సలార్ లాంటి వాటికి పెంపు ఇచ్చినప్పుడు ఈ సమయంలో డిస్కౌంట్లు ఇవ్వాలనేది వాళ్ళ వాదన. అందులో లాజిక్ ఉంది కానీ వినేవారెవరు.
ఏదో ఒకటి రెండు రోజులు కాకుండా బడ్జెట్ భారీగా ఖర్చు పెట్టుకోని చిన్న సినిమాలకు తగ్గింపు రేట్లు చాలా మేలు చేస్తాయి. పది మంది కూడా రాలేదని షోలు క్యాన్సిల్ చేసే బదులు తక్కువ ధర కాబట్టి వందల్లో వచ్చే జనాలతో హౌస్ ఫుల్ చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైవా హర్ష, అభినవ్ లాంటి వాళ్ళు ఎంత ప్రమోట్ చేసుకున్నా ఓపెనింగ్స్ రావడం కష్టంగా కనిపిస్తోంది. అలాంటప్పుడు ఆఫర్లు గట్రా ఇస్తే పబ్లిక్ ఆకర్షితులవుతారు. కానీ జరుగుతున్నది వేరే. బాలీవుడ్ మూవీ ఆర్టికల్ 350కి నార్త్ లో అడ్వాన్స్ బుకింగ్ లోనే 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం బట్టి చెప్పొచ్చు ఈ పధకం ఎంత సక్సెసో.
This post was last modified on February 22, 2024 12:14 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…