రేపు దేశవ్యాప్తంగా పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో ఏ సినిమా ఏ స్క్రీన్ లో అయినా సరే కేవలం 99 రూపాయలకే చూసేయొచ్చు. కానీ ఆ అవకాశం తెలుగు రాష్ట్రాల్లో లేదు. తెలంగాణలో కనిష్టంగా 112, ఆంధ్రప్రదేశ్ లో యథావిధిగా 177 చెల్లించుకోవాల్సిందే. కానీ ఉత్తరాది ఆడియన్స్ మాత్రం ఆర్టికల్ 370, క్రాక్ లాంటి లేటెస్ట్ రిలీజులు చవక ధరలో చూసేస్తారు. రేపు మన దగ్గర సుందరం మాస్టర్, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా లాంటి చిన్న చిత్రాలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వాటికి 99 రేట్ పెడితే ఎక్కువ శాతం ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హౌస్ ఫుల్స్ కూడా కావొచ్చు.
కానీ జిఓ పరిమితులు, ప్రభుత్వ అనుమతులు క్లిష్టంగా ఉన్న కారణంగానే ఇక్కడ అమలు చేయలేకపోతున్నామని ఆఫ్ ది రికార్డ్ పివిఆర్ వర్గాలు అంటుండగా మూవీ లవర్స్ మాత్రం ఇది కేవలం వివక్షని, సినిమాలు చూడకుండా ఉండలేని దక్షిణాది ప్రేక్షకుల బలహీనతను ఆసరాగా చేసుకుని తగ్గింపు ఇవ్వడం లేదని భగ్గుమంటున్నారు. ఏపీలో మరీ అన్యాయంగా ఇలాంటి సందర్భాల్లోనూ ప్రత్యేక వెసులుబాటు లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. సలార్ లాంటి వాటికి పెంపు ఇచ్చినప్పుడు ఈ సమయంలో డిస్కౌంట్లు ఇవ్వాలనేది వాళ్ళ వాదన. అందులో లాజిక్ ఉంది కానీ వినేవారెవరు.
ఏదో ఒకటి రెండు రోజులు కాకుండా బడ్జెట్ భారీగా ఖర్చు పెట్టుకోని చిన్న సినిమాలకు తగ్గింపు రేట్లు చాలా మేలు చేస్తాయి. పది మంది కూడా రాలేదని షోలు క్యాన్సిల్ చేసే బదులు తక్కువ ధర కాబట్టి వందల్లో వచ్చే జనాలతో హౌస్ ఫుల్ చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైవా హర్ష, అభినవ్ లాంటి వాళ్ళు ఎంత ప్రమోట్ చేసుకున్నా ఓపెనింగ్స్ రావడం కష్టంగా కనిపిస్తోంది. అలాంటప్పుడు ఆఫర్లు గట్రా ఇస్తే పబ్లిక్ ఆకర్షితులవుతారు. కానీ జరుగుతున్నది వేరే. బాలీవుడ్ మూవీ ఆర్టికల్ 350కి నార్త్ లో అడ్వాన్స్ బుకింగ్ లోనే 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం బట్టి చెప్పొచ్చు ఈ పధకం ఎంత సక్సెసో.
This post was last modified on February 22, 2024 12:14 pm
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 6…
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…
ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…
భారత దేశ చరిత్రలో ఇదోక అనూహ్యమైన.. అసహ్యించుకునే ఘటన. ఈ దేశాన్ని పాలించి, రైతుల మన్ననలు, మహిళల మన్ననలు పొందిన…
ఏపీ సీఎం జగన్.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచ లన వ్యాఖ్యలు చేశారు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…