రియా చక్రవర్తి అరెస్ట్ నేపథ్యంలో ఆమెకి సపోర్ట్ గా సినిమా వాళ్ల గళాలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సుషాంత్ సింగ్ కోసం ఆమె డ్రగ్స్ పలుమార్లు కొన్నదని, కొందరితో కొనిపించిందని ఆమెపై ఎఫ్ఐఆర్లో నమోదైన ఆరోపణ. అందులో ఆమె డ్రగ్స్ తీసుకుందనే ప్రస్తావన ఎక్కడా లేదు. చనిపోయిన సుషాంత్ కోసమే ఆమె ఈ పని చేసినట్టు మాత్రం అందులో వుంది. దీంతో సుషాంత్ సింగ్ బ్రతికి వున్నట్టయితే ఈ కేసులో అతనే నిందితుడయ్యే వాడని, అతని కోసం ఆమె డ్రగ్స్ కొన్నప్పుడు ఆమెను ఎందుకు నిందితురాలిని చేస్తున్నారని బాలీవుడ్ ప్రముఖులు ఆమెకి సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు.
దర్శకుడు అనురాగ్ కశ్యప్ అయితే ఒక అడుగు ముందుకు వేసి చనిపోయిన వ్యక్తి గురించి కొన్ని మాట్లాడకూడదు కాబట్టి ఇంతకాలం మౌనంగా వున్నామని, ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి కనుక మాట్లాడక తప్పట్లేదని వ్యాఖ్యానించాడు. ఇలాంటి నర్మ గర్భ వ్యాఖ్యలు ఇంకా పలువురు బాలీవుడ్ ప్రముఖులు చేస్తున్నారు. వారి మాటలను బట్టి సుషాంత్ సింగ్ డ్రగ్ అడిక్ట్ అని బాలీవుడ్లో అందరికీ తెలుసుననే అర్థం వస్తోంది.
చనిపోయిన వాడు తనను తాను డిఫెండ్ చేసుకోలేడు కనుక అతడిని నిందితుడిగా చూపిస్తున్నారా అంటూ సుషాంత్ సోదరి బాలీవుడ్లో రియాకు సపోర్ట్ గా నిలబడిన వారిని నిలదీస్తోంది. ఆమె మాటలు కూడా నిజమే. ఒక వ్యక్తి ఇప్పుడు లేడు కనుక, డ్రగ్స్ కొన్నాను కానీ, అతని కోసమే అనేస్తూ వుండొచ్చుగా? డ్రగ్స్ అసలు తాను తీసుకోలేదని చెబుతోన్న రియా మాటలలో నిజమెంత? అది సుషాంత్ అయితే వచ్చి చెప్పలేడుగా? నోరెత్తుతున్న పెద్దలు దీనిని కూడా కన్సిడర్ చేయాలి మరి.
This post was last modified on September 9, 2020 10:16 pm
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…