రియా చక్రవర్తి అరెస్ట్ నేపథ్యంలో ఆమెకి సపోర్ట్ గా సినిమా వాళ్ల గళాలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సుషాంత్ సింగ్ కోసం ఆమె డ్రగ్స్ పలుమార్లు కొన్నదని, కొందరితో కొనిపించిందని ఆమెపై ఎఫ్ఐఆర్లో నమోదైన ఆరోపణ. అందులో ఆమె డ్రగ్స్ తీసుకుందనే ప్రస్తావన ఎక్కడా లేదు. చనిపోయిన సుషాంత్ కోసమే ఆమె ఈ పని చేసినట్టు మాత్రం అందులో వుంది. దీంతో సుషాంత్ సింగ్ బ్రతికి వున్నట్టయితే ఈ కేసులో అతనే నిందితుడయ్యే వాడని, అతని కోసం ఆమె డ్రగ్స్ కొన్నప్పుడు ఆమెను ఎందుకు నిందితురాలిని చేస్తున్నారని బాలీవుడ్ ప్రముఖులు ఆమెకి సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు.
దర్శకుడు అనురాగ్ కశ్యప్ అయితే ఒక అడుగు ముందుకు వేసి చనిపోయిన వ్యక్తి గురించి కొన్ని మాట్లాడకూడదు కాబట్టి ఇంతకాలం మౌనంగా వున్నామని, ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి కనుక మాట్లాడక తప్పట్లేదని వ్యాఖ్యానించాడు. ఇలాంటి నర్మ గర్భ వ్యాఖ్యలు ఇంకా పలువురు బాలీవుడ్ ప్రముఖులు చేస్తున్నారు. వారి మాటలను బట్టి సుషాంత్ సింగ్ డ్రగ్ అడిక్ట్ అని బాలీవుడ్లో అందరికీ తెలుసుననే అర్థం వస్తోంది.
చనిపోయిన వాడు తనను తాను డిఫెండ్ చేసుకోలేడు కనుక అతడిని నిందితుడిగా చూపిస్తున్నారా అంటూ సుషాంత్ సోదరి బాలీవుడ్లో రియాకు సపోర్ట్ గా నిలబడిన వారిని నిలదీస్తోంది. ఆమె మాటలు కూడా నిజమే. ఒక వ్యక్తి ఇప్పుడు లేడు కనుక, డ్రగ్స్ కొన్నాను కానీ, అతని కోసమే అనేస్తూ వుండొచ్చుగా? డ్రగ్స్ అసలు తాను తీసుకోలేదని చెబుతోన్న రియా మాటలలో నిజమెంత? అది సుషాంత్ అయితే వచ్చి చెప్పలేడుగా? నోరెత్తుతున్న పెద్దలు దీనిని కూడా కన్సిడర్ చేయాలి మరి.
This post was last modified on September 9, 2020 10:16 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…