లోక నాయకుడు కమల్ హాసన్ ల్యాండ్ మార్క్ మూవీ భారతీయుడు సీక్వెల్ పాతికేళ్ల తర్వాత రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నైజాం హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్ టైన్మెంట్స్ తరఫున సురేష్ బాబు, సునీల్ నారంగ్ లు సంయుక్తంగా కొన్నారన్న వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎంత మొత్తానికి అనేది బయటికి చెప్పలేదు కానీ క్రేజీ ఆఫరే ఇచ్చారట. లైకా ప్రొడక్షన్ల సినిమాలు అధిక శాతం దిల్ రాజు కొనేవారు. పొన్నియిన్ సెల్వన్ కూడా ఆయనదే. దానికి భిన్నంగా ఈసారి చేతులు మారిపోతున్నాయి.
ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పటికిప్పుడు భారతీయుడు 2 అమ్మకాలు షురూ చేశారంటే విడుదల తేదీ గురించి ఒక అంచనాకు వచ్చారనే కదా అర్థం. చెన్నై టాక్ ప్రకారం దర్శకుడు శంకర్ రెండు మూడు ఆప్షన్లు పెట్టుకున్నారట. ముందు ఏప్రిల్ అనుకున్నారు కానీ చేతిలో ఉన్న అతి తక్కువ టైంలో ప్రమోషన్లకు సమయం చాలదనే ఉద్దేశంతో వద్దనుకున్నారట. ఒకవేళ కల్కి కనక మే 9 నుంచి తప్పుకుంటే ఆ డేట్ ని తీసుకునే ఆలోచనైతే సీరియస్ గానే జరుగుతోంది. పుష్ప 2 ది రూల్ ఆగస్ట్ 15 రావడం దాదాపు ఖరారే. సో గుడ్డిగా అది పోస్ట్ పోన్ అవుతుందనే నమ్మకం వృథా.
సెప్టెంబర్ చివర్లో పవన్ కళ్యాణ్ ఓజి, అక్టోబర్ రెండో వారంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర ఉన్నాయి కాబట్టి తెలుగు మార్కెట్ కోణంలో చూసుకుంటే వాటితో తలపడటం భారతీయుడు 2కి రిస్క్ అవుతుంది. సో అయితే మే లేదా ఆగస్ట్, ఈ రెండు మిస్ చేసుకునే పనైతే ఏకంగా డిసెంబర్ లేదా సంక్రాంతికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ శంకరే దర్శకత్వం వహిస్తున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఏడాది చివర్లో క్రిస్మస్ పండగని లాక్ చేసుకునే చర్చలో ఉంది. సో ఎటూ తిరిగి భారతీయుడు 2 నవంబర్ లోపే రావాలి. ఈ సందిగ్దత అంత సులభంగా తీరేలా కనిపించడం లేదు. చూద్దాం.
This post was last modified on February 21, 2024 5:14 pm
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…