Movie News

బందిపోట్ల వేటలో బాలయ్య మాస్ యాక్షన్

వరసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఊపుమీదున్న బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బాబీతో ఓ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. బందిపోటు దొంగల బ్యాక్ డ్రాప్ లో కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని యూనిట్ నుంచి వస్తున్న లీక్. సెల్ ఫోన్లు, టెక్నాలజీ లేని 80 దశకంలో కథను మొదలుపెట్టి మెల్లగా రివెంజ్ డ్రామాగా మలచినట్టు తెలిసింది. దుల్కర్ సల్మాన్ పోషిస్తున్న పాత్రకు బాలయ్యకు బలమైన లింక్ ఉంటుందని, ఊహించని స్థాయిలో దాన్ని డిజైన్ తీసిన తీరు ఖచ్చితంగా మెప్పిస్తుందని అంటున్నారు. వాల్తేరు వీరయ్యలో రవితేజకు అయిదు రెట్లు ఎక్కువ ఉంటుందట.

ఒకరకంగా చెప్పాలంటే షోలేలో గబ్బర్ సింగ్ ని అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలు కాకుండా బాలయ్య ఒక్కడే ఎదురుకుంటే ఎలా ఉంటుందనే పాయింట్ తో బాబీ రాసుకున్నట్టు వినిపిస్తోంది. అధికారికంగా చెప్పేది కాదు కానీ ఆఫ్ ది రికార్డు నమ్మకమైన సోర్స్ నుంచే వచ్చింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఇది రూపొందుతోంది. హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ అంటున్నారు కానీ ఇంకా ఖరారుగా తెలియలేదు. ఊర్వశి రౌతేలాకు మాత్రం ప్రాధాన్యం ఉన్న రోల్ దక్కింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో కీలకమైన ఫైట్లు తీస్తున్నారట.

సో మళ్ళీ వింటేజ్ బాలయ్యని బాబీ చూపించబోతున్నాడని అర్థమవుతోంది కదా. విడుదల తేదీ ఇంకా లాక్ చేసుకోలేదు. షూటింగ్ కనీసం ముప్పాతిక అయ్యేదాకా రిలీజ్ గురించి ఆలోచించవద్దని ముందే ఫిక్స్ అయ్యారట. కుదిరితే ఈ ఏడాది లేక వచ్చే సంవత్సరం సంక్రాంతికి కానుకగా వదిలే అవకాశాలు లేకపోలేదు. అఖండ డిసెంబర్ సెంటిమెంట్ ని ఫాలో అయినా లేదా జనవరి పండగని నమ్ముకున్నా అభిమానులు హ్యాపీనే. మరి ఇందులో బాలకృష్ణ బందిపోటుగా కనిపిస్తాడా లేక ఖాకీ దుస్తుల్లో వెంటాడతాడా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. వేచి చూడాలి.

This post was last modified on February 21, 2024 12:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జైల్లో ఎంజాయ్ చేసిన అంబటి

ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…

41 minutes ago

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…

1 hour ago

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

3 hours ago

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…

3 hours ago

పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించడం…

4 hours ago

డిల్లీ వేదికపై చైనా రోబో.. ఏంటి వివాదం?

ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…

4 hours ago