ఇటీవలే రీ రిలీజ్ జరుపుకున్న ఓయ్ సినిమాకు దక్కిన రెస్పాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏదో ఫామ్ లో ఉన్న టాలీవుడ్ స్టార్ మూవీ అనుకుంటే ఏదోలే అనుకోవచ్చు. ఆ మధ్య చిన్నా చూడండి అని నెత్తి నోరు బాదుకున్నా పట్టించుకోని సిద్దార్థ కథానాయకుడిగా వచ్చిన పాత చిత్రం. అయినా సరే జనాలు ఎగబడి చూశారు. ముఖ్యంగా యూత్ పాటలకు థియేటర్లలో లేచి మరీ డాన్సులు చేశారు. దెబ్బకు సిద్దార్థ్ చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చి మరీ శాంతి థియేటర్లో జరిగిన రచ్చని కళ్లారా చూసి షాక్ అయ్యాడు. నిజంగా ఇది తన ఓయేనా అని షాక్ తో ఆనందపడ్డాడు.
ఇప్పుడు దర్శకుడు ఆనంద్ రంగా సంతోషం బాధ కలిగిన ఫీలింగ్ తో వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓయ్ ని ఇంతగా ప్రేమిస్తున్న వాళ్ళు ఒరిజినల్ గా రిలీజైన టైంలోనే ఈ స్పందన చూపించి ఉంటే నాకో కెరీర్ దక్కేదని నిరాశను వ్యక్తం చేశారు. సెకండ్ హాఫ్ ని సరిగా హ్యాండిల్ చేయకపోవడం తప్పేనని ఒప్పుకుంటూనే మరీ తిరస్కరించేంత చెడ్డ సినిమా కాదని కూడా చెప్పుకొచ్చారు. ఆయన అన్నదాంట్లో పాయింట్ ఉంది. ఒకవేళ ఓయ్ నిజంగా హిట్ అయ్యి ఉంటే ఎన్నో కొన్ని సినిమాలు తీసేవాడుగా. దెబ్బకు ఇండస్ట్రీకి దూరమై ఏళ్ళ తరబడి అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది.
ఆ మధ్య ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో సుష్మిత కొణిదెల నిర్మించిన షూట్ అవుట్ ఏట్ అలైర్ దర్శకుడు ఈయనే. ఇది వెబ్ సిరీస్ కావడంతో జనాలకు ఆశించిన స్థాయిలో రీచ్ కాలేదు. పోలీస్ బ్యాక్ డ్రాప్ లో రూపొంది టెక్నికల్ గా మంచి పేరే తెచ్చుకుంది. ఇప్పుడు ఈయన వర్క్ ని చూసి ఎవరైనా నిర్మాత అవకాశం ఇవ్వకపోరాని ఓయ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆరంజ్ విషయంలో బొమ్మరిల్లు భాస్కర్ సైతం ఇలాంటి పరిస్థితిని చవిచూశాడు కానీ అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో కంబ్యాక్ ఇచ్చి ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డతో జాక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 19, 2024 5:04 pm
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…