ఏడాది ముందు వరకు పూజా హెగ్డే టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ.. భారీ పారితోషకం తీసుకుంటూ.. డైరీలో ఖాళీయే లేనట్లు కనిపించిందామె. కానీ చూస్తుండగానే ఆమె జోరు తగ్గిపోయింది. వరుసగా తన సినిమాలు ఫ్లాప్ కావడం.. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి క్రేజీ ప్రాజెక్టుల నుంచి బయటికి వచ్చేయడంతో ఆమె కథ తిరగబడింది. కొత్త అవకాశాలు ఆగిపోయాయి. సడెన్గా కెరీర్ డల్ అయిపోయింది.
తెలుగులో అసలు అవకాశాలే లేకుండా ఖాళీ అయిపోవడం అనూహ్యం. పూజా కూడా తెలుగు సినిమాలను లైట్ తీసుకుని బాలీవుడ్లో బిజీ అవ్వాలని చూస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అక్కడ కూడా ఆమె కెరీర్ ఏమీ ఆశాజనకంగా లేదు. దీంతో మళ్లీ తెలుగు సినిమాల మీద ఆమె ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
పూజా ఎన్నడూ లేని విధంగా డిస్కౌంట్ బేరాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు 3 కోట్లకు అటు ఇటుగా పారితోషకం పుచ్చుకున్న పూజా.. ఇప్పుడు అందులో సగం మొత్తానికి కూడా సినిమా చేయడానికి రెడీగా ఉందట. మిడ్ రేంజ్ సినిమాలు చేయడానికి కూడా ఆమె సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం.
తాజాగా పూజా సౌత్ సినిమాలకు శైలికి తగ్గట్లు ట్రెడిషనల్ లుక్స్తో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది పూజా. ఆమెలో ఛార్మ్ ఎంతమాత్రం తగ్గలేదనిపిస్తోంది. మరి పూజా డిస్కౌంట్ బేరాలు ఆమెకు అవకాశాలు తెచ్చిపెడతాయేమో చూాడాలి.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…