ఏడాది ముందు వరకు పూజా హెగ్డే టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ.. భారీ పారితోషకం తీసుకుంటూ.. డైరీలో ఖాళీయే లేనట్లు కనిపించిందామె. కానీ చూస్తుండగానే ఆమె జోరు తగ్గిపోయింది. వరుసగా తన సినిమాలు ఫ్లాప్ కావడం.. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి క్రేజీ ప్రాజెక్టుల నుంచి బయటికి వచ్చేయడంతో ఆమె కథ తిరగబడింది. కొత్త అవకాశాలు ఆగిపోయాయి. సడెన్గా కెరీర్ డల్ అయిపోయింది.
తెలుగులో అసలు అవకాశాలే లేకుండా ఖాళీ అయిపోవడం అనూహ్యం. పూజా కూడా తెలుగు సినిమాలను లైట్ తీసుకుని బాలీవుడ్లో బిజీ అవ్వాలని చూస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అక్కడ కూడా ఆమె కెరీర్ ఏమీ ఆశాజనకంగా లేదు. దీంతో మళ్లీ తెలుగు సినిమాల మీద ఆమె ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
పూజా ఎన్నడూ లేని విధంగా డిస్కౌంట్ బేరాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు 3 కోట్లకు అటు ఇటుగా పారితోషకం పుచ్చుకున్న పూజా.. ఇప్పుడు అందులో సగం మొత్తానికి కూడా సినిమా చేయడానికి రెడీగా ఉందట. మిడ్ రేంజ్ సినిమాలు చేయడానికి కూడా ఆమె సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం.
తాజాగా పూజా సౌత్ సినిమాలకు శైలికి తగ్గట్లు ట్రెడిషనల్ లుక్స్తో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది పూజా. ఆమెలో ఛార్మ్ ఎంతమాత్రం తగ్గలేదనిపిస్తోంది. మరి పూజా డిస్కౌంట్ బేరాలు ఆమెకు అవకాశాలు తెచ్చిపెడతాయేమో చూాడాలి.
This post was last modified on February 19, 2024 5:04 pm
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…
ఇమేజ్, మార్కెట్ ఉన్న హీరో సినిమాలు రెండు కేవలం ఒకే రోజు గ్యాప్ తో విడుదల కావడం చాలా ఇబ్బందికరమైన…