Movie News

వెబ్ సిరీస్ ఆపాలంటూ కోర్టు కేసు

వివాదాలు సినిమాలకు పరిమితం కాదు. ఇప్పుడీ ట్రెండ్ వెబ్ సిరీస్ లకూ పాకింది. వ్యవహారాలు కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. ఈ వారం 23 నెట్ ఫ్లిక్స్ లో ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ బర్రీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్ ని స్ట్రీమింగ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. పన్నెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా రూపొందించారు. అయితే తుది విచారణ ముగిసే వరకు దీన్ని ఆపాలంటూ సిబిఐ బృందం న్యాయస్థానం మెట్లు ఎక్కడం సంచలనంగా మారింది. రేపు 20న దీనికి సంబంధించిన హియరింగ్ జరగనుంది. వాయిదా పడేది లేనిది తెలుస్తుంది.

స్వంత కూతురునే హత్య చేసిన కేసులో ఇంద్రాణి అభియోగాలు ఎదురుకుంటున్నారు. డ్రైవర్ తో పాటు మాజీ భర్త ప్రమేయం కూడా ఇందులో ఉంది. బలమైన సాక్ష్యాలు దొరికాయి కానీ పూర్తి తీర్పు వెలువడలేదు. అందుకే సిబిఐ వైపు నుంచి అభ్యంతరం వస్తోంది. నిజ జీవితంలో జరిగిన క్రైమ్ సంఘటనలను ఆధారంగా చేసుకుని నెట్ ఫ్లిక్స్ తీస్తున్న సిరీస్ లకు మంచి ఆదరణ దక్కుతోంది. కేరళను కుదిపేసిన మహిళా సీరియల్ కిల్లర్, సౌత్ ని వణికించిన సైకో హంతకుడి మీద తీసిన డాక్యుమెంటరీలు బ్లాక్ బస్టరయ్యాయి. అందుకే అలాంటి స్టోరీస్ ని వెతికి తీయిస్తోంది.

మీడియాలోనే కాదు కామన్ పబ్లిక్ లోనూ షీనా బోరా మర్డర్ తీవ్ర సంచలనం రేపింది. పరువు హత్యా లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పూర్తి నిజాలు బయట ప్రపంచానికి చెప్పలేదు. ఈలోగా నెట్ ఫ్లిక్స్ ఈ నేరంలో భాగం ఉన్నవాళ్లను, సాక్షులను, పోలీస్ అధికారులను సంప్రదించి వివరాలు సేకరించి సిరీస్ పూర్తి చేయించింది. ఒకవేళ దీనికి కనక స్టే విధిస్తే అదో రకం సెన్సేషన్ అనుకోవాలి. అయినా హత్యలు, వాటి వెనుక కారణాలు ఇంత డీటెయిల్డ్ గా జనాలకు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటో కానీ ఆడియన్స్ మాత్రం ఎగబడి చూస్తున్న మాట వాస్తవం.

This post was last modified on February 19, 2024 1:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జైల్లో ఎంజాయ్ చేసిన అంబటి

ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…

2 hours ago

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…

3 hours ago

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

5 hours ago

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…

5 hours ago

పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించడం…

5 hours ago

డిల్లీ వేదికపై చైనా రోబో.. ఏంటి వివాదం?

ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…

6 hours ago