Movie News

వెబ్ సిరీస్ ఆపాలంటూ కోర్టు కేసు

వివాదాలు సినిమాలకు పరిమితం కాదు. ఇప్పుడీ ట్రెండ్ వెబ్ సిరీస్ లకూ పాకింది. వ్యవహారాలు కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. ఈ వారం 23 నెట్ ఫ్లిక్స్ లో ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ బర్రీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్ ని స్ట్రీమింగ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. పన్నెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా రూపొందించారు. అయితే తుది విచారణ ముగిసే వరకు దీన్ని ఆపాలంటూ సిబిఐ బృందం న్యాయస్థానం మెట్లు ఎక్కడం సంచలనంగా మారింది. రేపు 20న దీనికి సంబంధించిన హియరింగ్ జరగనుంది. వాయిదా పడేది లేనిది తెలుస్తుంది.

స్వంత కూతురునే హత్య చేసిన కేసులో ఇంద్రాణి అభియోగాలు ఎదురుకుంటున్నారు. డ్రైవర్ తో పాటు మాజీ భర్త ప్రమేయం కూడా ఇందులో ఉంది. బలమైన సాక్ష్యాలు దొరికాయి కానీ పూర్తి తీర్పు వెలువడలేదు. అందుకే సిబిఐ వైపు నుంచి అభ్యంతరం వస్తోంది. నిజ జీవితంలో జరిగిన క్రైమ్ సంఘటనలను ఆధారంగా చేసుకుని నెట్ ఫ్లిక్స్ తీస్తున్న సిరీస్ లకు మంచి ఆదరణ దక్కుతోంది. కేరళను కుదిపేసిన మహిళా సీరియల్ కిల్లర్, సౌత్ ని వణికించిన సైకో హంతకుడి మీద తీసిన డాక్యుమెంటరీలు బ్లాక్ బస్టరయ్యాయి. అందుకే అలాంటి స్టోరీస్ ని వెతికి తీయిస్తోంది.

మీడియాలోనే కాదు కామన్ పబ్లిక్ లోనూ షీనా బోరా మర్డర్ తీవ్ర సంచలనం రేపింది. పరువు హత్యా లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పూర్తి నిజాలు బయట ప్రపంచానికి చెప్పలేదు. ఈలోగా నెట్ ఫ్లిక్స్ ఈ నేరంలో భాగం ఉన్నవాళ్లను, సాక్షులను, పోలీస్ అధికారులను సంప్రదించి వివరాలు సేకరించి సిరీస్ పూర్తి చేయించింది. ఒకవేళ దీనికి కనక స్టే విధిస్తే అదో రకం సెన్సేషన్ అనుకోవాలి. అయినా హత్యలు, వాటి వెనుక కారణాలు ఇంత డీటెయిల్డ్ గా జనాలకు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటో కానీ ఆడియన్స్ మాత్రం ఎగబడి చూస్తున్న మాట వాస్తవం.

Satya

Recent Posts

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

2 hours ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

5 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

7 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

8 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

8 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

8 hours ago