మాములుగా స్పైడర్ మ్యాన్ అంటే విదేశాల్లోనే కాదు ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. సాలెగూడు మనిషి చేసే అద్భుతాలు దశాబ్దాలు గడుస్తున్నా, ఎన్ని భాగాలు తీస్తున్నా ఆడియన్స్ ఆదరిస్తూనే ఉన్నారు. అందుకే సీక్వెల్ అనౌన్స్ చేయడం ఆలస్యం క్రేజ్ వచ్చి పడుతుంది. దీనికి దగ్గరగా ఉండే కాన్సెప్ట్ తో మేడమ్ వెబ్ అనే కామిక్ సిరీస్ అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందింది. దాన్ని సినిమాగా తీస్తే ఆడియన్స్ ఎగబడి చూస్తారనే ఆలోచనతో సోనీ, మర్వెల్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించాయి. మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తీరా చూస్తే ఈ మేడమ్ వెబ్ థియేటర్ కు వచ్చిన జనాలను అయ్యో బాబోయ్ అంటూ పరిగెత్తేలా చేసింది. వచ్చిన టాక్ ప్రకారం చూసుకుంటే ఎంత లేదన్నా 100 మిలియన్ డాలర్ల నష్టం తప్పదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం గ్రాఫిక్స్ ని నమ్ముకుని కంటెంట్, ఎమోషన్స్ ని గాలికి వదిలేస్తున్న హాలీవుడ్ మేకర్స్ కి ఇదో గుణపాఠంగా నిలుస్తుందని తలంటుతున్నారు. కనీసం పిల్లలను ఆకట్టుకునేలా ఉన్నా ఏదోలా బాక్సాఫీస్ వద్ద గట్టెక్కొచ్చు కానీ వాళ్ళను సైతం కనీస స్థాయిలో మెప్పించలేకపోతే వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రయోజనం ఏంటని దుమ్మెత్తి పోస్తున్నారు.
క్లార్క్ సన్ దర్శకత్వం వహించిన ఈ అద్భుత కళాఖండంకు మొదటి రోజే చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అవుతున్న దుస్థితి వచ్చేసింది. పట్టుమని రెండు గంటల పాటు ఎంగేజ్ చేయలేనంత నాసిరకంగా సినిమా తీసినందుకు మార్వెల్ ఖచ్చితంగా చింతిస్తుంది. ఇదే తరహాలో మొన్నామధ్య వచ్చిన ది మార్వెల్స్ ఘోరంగా దెబ్బ తినగా గత రెండేళ్లుగా తీసిన సినిమాల నుంచి ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. మనం ఇక్కడ ఆదికేశవ, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లాంటివి రొటీన్ కంటెంట్ అంటూ ట్రోల్ చేస్తాం కానీ హాలీవుడ్ లో మేడమ్ వెబ్ లాంటివి అంతకు మించే టార్చర్ పెడుతున్నాయి.
This post was last modified on February 18, 2024 2:26 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…