మాములుగా స్పైడర్ మ్యాన్ అంటే విదేశాల్లోనే కాదు ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. సాలెగూడు మనిషి చేసే అద్భుతాలు దశాబ్దాలు గడుస్తున్నా, ఎన్ని భాగాలు తీస్తున్నా ఆడియన్స్ ఆదరిస్తూనే ఉన్నారు. అందుకే సీక్వెల్ అనౌన్స్ చేయడం ఆలస్యం క్రేజ్ వచ్చి పడుతుంది. దీనికి దగ్గరగా ఉండే కాన్సెప్ట్ తో మేడమ్ వెబ్ అనే కామిక్ సిరీస్ అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందింది. దాన్ని సినిమాగా తీస్తే ఆడియన్స్ ఎగబడి చూస్తారనే ఆలోచనతో సోనీ, మర్వెల్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించాయి. మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తీరా చూస్తే ఈ మేడమ్ వెబ్ థియేటర్ కు వచ్చిన జనాలను అయ్యో బాబోయ్ అంటూ పరిగెత్తేలా చేసింది. వచ్చిన టాక్ ప్రకారం చూసుకుంటే ఎంత లేదన్నా 100 మిలియన్ డాలర్ల నష్టం తప్పదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం గ్రాఫిక్స్ ని నమ్ముకుని కంటెంట్, ఎమోషన్స్ ని గాలికి వదిలేస్తున్న హాలీవుడ్ మేకర్స్ కి ఇదో గుణపాఠంగా నిలుస్తుందని తలంటుతున్నారు. కనీసం పిల్లలను ఆకట్టుకునేలా ఉన్నా ఏదోలా బాక్సాఫీస్ వద్ద గట్టెక్కొచ్చు కానీ వాళ్ళను సైతం కనీస స్థాయిలో మెప్పించలేకపోతే వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రయోజనం ఏంటని దుమ్మెత్తి పోస్తున్నారు.
క్లార్క్ సన్ దర్శకత్వం వహించిన ఈ అద్భుత కళాఖండంకు మొదటి రోజే చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అవుతున్న దుస్థితి వచ్చేసింది. పట్టుమని రెండు గంటల పాటు ఎంగేజ్ చేయలేనంత నాసిరకంగా సినిమా తీసినందుకు మార్వెల్ ఖచ్చితంగా చింతిస్తుంది. ఇదే తరహాలో మొన్నామధ్య వచ్చిన ది మార్వెల్స్ ఘోరంగా దెబ్బ తినగా గత రెండేళ్లుగా తీసిన సినిమాల నుంచి ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. మనం ఇక్కడ ఆదికేశవ, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లాంటివి రొటీన్ కంటెంట్ అంటూ ట్రోల్ చేస్తాం కానీ హాలీవుడ్ లో మేడమ్ వెబ్ లాంటివి అంతకు మించే టార్చర్ పెడుతున్నాయి.
This post was last modified on February 18, 2024 2:26 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…