పేరుకి తమిళ హీరోలే అయినా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్లు సూర్య, విక్రమ్. తమ కెరీర్లలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు ఒకే సమయంలో చేయడం విశేషమే అయినా ఇద్దరికీ ఒకే రకమైన సమస్య తలెత్తడం కాకతాళీయం. సిరుతై శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువాని ముందు ఏప్రిల్ రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ బడ్జెట్ చేయి దాటిపోవడంతో పాటు విఎఫెక్స్, పోస్ట్ ప్రొడక్షన్లో విపరీతమైన ఆలస్యం జరగడంతో ఇప్పుడు ఏకంగా దసరా లేదా దీపావళికి ప్లాన్ చేసుకుంటున్నారట. కానీ దానికీ గ్యారెంటీ లేదు. అందుకే డేట్ అనౌన్స్ మెంట్ రావడం లేదు.
తంగలాన్ కూడా ఇదే రకమైన ఇబ్బందిని ఎదురుకుంటోంది. పా రంజిత్ డైరెక్షన్ లో విభిన్నమైన సెటప్ లో అడవి మనుషుల నేపథ్యంలో తీస్తున్నారు. టీజర్ చూశాక ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలిగింది. ముఖ్యంగా విక్రమ్ గెటప్ చూశాక మళ్ళీ ఏదో ప్రాణాల మీద తెచ్చుకునే స్టంట్లు చేశాడని అర్థమైపోయింది. మొదటి జనవరి 26 ప్రకటించారు. తర్వాత వాయిదా వేశారు. పోనీ మార్చి లేదా ఏప్రిల్ అనుకుంటే తమిళనాడు ఎన్నికలు ఉంటాయి కాబట్టి వద్దనుకుని ఇంకో ఆప్షన్ వైపు చూస్తున్నారు. కంగువాతో క్లాష్ కాకూడదనేది కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల మూకుమ్మడి అభిప్రాయం.
కంగువా, తంగలాన్ కు ఇంకో టెన్షన్ ఉంది. డేట్ లాక్ చేసుకునే ముందు తెలుగు ప్యాన్ ఇండియా మూవీస్ ఏమున్నాయో చూసుకోవాలి. ఓజి, దేవర పార్ట్ 1, పుష్ప 2 ది రూల్, గేమ్ ఛేంజర్ వీటితో తలపడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇవి కర్ణాటక లాంటి బయట మార్కెట్లలో ఓపెనింగ్స్ ని దెబ్బ తీస్తాయి. సో ఎన్నో క్యాలికులేషన్లు వేసుకుంటే తప్ప నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. 2025 జనవరి బెటరనే ఆలోచన చేస్తున్నారు కానీ ఈ సంవత్సరం అయలాన్, కెప్టెన్ మిల్లర్ లకు టాలీవుడ్ సంక్రాంతికి ఎంట్రీ లేకపోవడం చూసి తెలివిగా ప్లాన్ చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.
This post was last modified on February 17, 2024 5:37 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…