పేరుకి తమిళ హీరోలే అయినా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్లు సూర్య, విక్రమ్. తమ కెరీర్లలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు ఒకే సమయంలో చేయడం విశేషమే అయినా ఇద్దరికీ ఒకే రకమైన సమస్య తలెత్తడం కాకతాళీయం. సిరుతై శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువాని ముందు ఏప్రిల్ రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ బడ్జెట్ చేయి దాటిపోవడంతో పాటు విఎఫెక్స్, పోస్ట్ ప్రొడక్షన్లో విపరీతమైన ఆలస్యం జరగడంతో ఇప్పుడు ఏకంగా దసరా లేదా దీపావళికి ప్లాన్ చేసుకుంటున్నారట. కానీ దానికీ గ్యారెంటీ లేదు. అందుకే డేట్ అనౌన్స్ మెంట్ రావడం లేదు.
తంగలాన్ కూడా ఇదే రకమైన ఇబ్బందిని ఎదురుకుంటోంది. పా రంజిత్ డైరెక్షన్ లో విభిన్నమైన సెటప్ లో అడవి మనుషుల నేపథ్యంలో తీస్తున్నారు. టీజర్ చూశాక ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలిగింది. ముఖ్యంగా విక్రమ్ గెటప్ చూశాక మళ్ళీ ఏదో ప్రాణాల మీద తెచ్చుకునే స్టంట్లు చేశాడని అర్థమైపోయింది. మొదటి జనవరి 26 ప్రకటించారు. తర్వాత వాయిదా వేశారు. పోనీ మార్చి లేదా ఏప్రిల్ అనుకుంటే తమిళనాడు ఎన్నికలు ఉంటాయి కాబట్టి వద్దనుకుని ఇంకో ఆప్షన్ వైపు చూస్తున్నారు. కంగువాతో క్లాష్ కాకూడదనేది కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల మూకుమ్మడి అభిప్రాయం.
కంగువా, తంగలాన్ కు ఇంకో టెన్షన్ ఉంది. డేట్ లాక్ చేసుకునే ముందు తెలుగు ప్యాన్ ఇండియా మూవీస్ ఏమున్నాయో చూసుకోవాలి. ఓజి, దేవర పార్ట్ 1, పుష్ప 2 ది రూల్, గేమ్ ఛేంజర్ వీటితో తలపడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇవి కర్ణాటక లాంటి బయట మార్కెట్లలో ఓపెనింగ్స్ ని దెబ్బ తీస్తాయి. సో ఎన్నో క్యాలికులేషన్లు వేసుకుంటే తప్ప నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. 2025 జనవరి బెటరనే ఆలోచన చేస్తున్నారు కానీ ఈ సంవత్సరం అయలాన్, కెప్టెన్ మిల్లర్ లకు టాలీవుడ్ సంక్రాంతికి ఎంట్రీ లేకపోవడం చూసి తెలివిగా ప్లాన్ చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.
This post was last modified on February 17, 2024 5:37 pm
బాలీవుడ్ ప్రముఖుల కామెంట్లు ఒక్కోసారి భలే విచిత్రంగా ఉంటాయి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి, ఒకప్పటి మాజీ హీరోయిన్…
మామూలుగా ఒక సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి ఆలస్యంగా రిలీజైతే కొంచెం బజ్ తగ్గుతూ ఉంటుంది. కానీ ‘రాబిన్…
అతడు.. తెలుగు ప్రేక్షకులు అత్యంత మెచ్చిన చిత్రాల్లో ఇది ముందు వరసలోఉంటుందనడంలో సందేహం లేదు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్…
చట్టసభల్లో ప్రజా ప్రతినిధుల వ్యవహార తీరుకు సంబంధించి చట్టాల్లోని నియమ నిబంధనలు పెద్దగా పనిచేయడం లేదు. చట్టాలను పక్కనపెట్టేస్తున్న కొందరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం బస్సు డ్రైవర్ గా అవతారం…
బాహుబలి తర్వాత సీక్వెల్ ట్రెండ్ అనేది ఎంత పాపులరయ్యిందో చూస్తున్నాం. కెజిఎఫ్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్లు దానికి మరింత…