అన్ని సవ్యంగా ప్లానింగ్ ప్రకారం జరిగి ఉంటే ఇంకో ఇరవై రోజుల్లో డబుల్ ఇస్మార్ట్ విడుదలకు సిద్ధంగా ఉండేది. కానీ షూటింగ్ తో పాటు పాటల చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా తప్పలేదు. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. దర్శకుడు పూరి జగన్నాధ్ దీన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతోనే మొదలుపెట్టాడు కానీ బడ్జెట్ చేయి దాటిపోవడం వల్లే కొంత బ్రేక్ వేయాల్సి వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఇస్మార్ట్ శంకర్ బ్రాండ్ కన్నా హీరో దర్శకుడి మీద గత డిజాస్టర్ల ప్రభావం వల్లే ఆశించిన రేట్లు రావడం లేదని వినికిడి.
ఇప్పుడు దీన్ని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో పూరి పలు ప్లాన్లు సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. అందులో మొదటిది టీజర్ కట్. ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తాను ప్రేక్షకులకు ఏం చూపించబోతున్నానో ఒక శాంపిల్ వదిలితే హైప్ ఆటోమేటిక్ గా పెరుగుతుందనేది వాటిలో మొదటిది. రెండో ఆప్షన్ బాగా వైరలయ్యే అవకాశమున్న ఒక పాటని లిరికల్ వీడియో రూపంలో రిలీజ్ చేయడం ద్వారా జనాల అటెన్షన్ ని డబుల్ ఇస్మార్ట్ వైపు తిప్పుకోవచ్చు. లైగర్ దెబ్బకు పూరిని అంత ఈజీగా నమ్మే పరిస్థితిలో బయ్యర్లు లేరు. చాలా అతిశయోక్తిగా దాని గురించి చెప్పిన మాటలు దారుణంగా బోల్తా కొట్టించాయి.
ఇంకోవైపు రామ్ మీద స్కంద, ది వారియర్ ల దెబ్బ గట్టిగా పడింది. ఓపెనింగ్స్ అయితే లాగుతున్నాడు కానీ కంటెంట్ ఏ మాత్రం యావరేజ్ ఉన్నా రెండో వారం లోపే చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి. సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ క్యాస్టింగ్ ఉన్నా డబుల్ ఇస్మార్ట్ మీద హైప్ పెరగాలంటే మేజిక్ అనిపించే ప్రమోషన్లు జరగాలి. అందుకే ఇప్పుడొచ్చిన గ్యాప్ ని దానికోసమే పూరి వాడుకుంటారని తెలిసింది. ఓటిటి సంస్థలతో జరుగుతున్న బేరాలు ఒక కొలిక్కి రాకపోవడం కూడా ఆలస్యానికి కారణంగా వినిపిస్తోంది. వేసవిలో రావాలంటే మాత్రం ఇప్పుడున్న స్పీడ్ ని డబుల్ చేయాల్సిందే.
This post was last modified on February 16, 2024 12:17 pm
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…