అన్ని సవ్యంగా ప్లానింగ్ ప్రకారం జరిగి ఉంటే ఇంకో ఇరవై రోజుల్లో డబుల్ ఇస్మార్ట్ విడుదలకు సిద్ధంగా ఉండేది. కానీ షూటింగ్ తో పాటు పాటల చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా తప్పలేదు. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. దర్శకుడు పూరి జగన్నాధ్ దీన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతోనే మొదలుపెట్టాడు కానీ బడ్జెట్ చేయి దాటిపోవడం వల్లే కొంత బ్రేక్ వేయాల్సి వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఇస్మార్ట్ శంకర్ బ్రాండ్ కన్నా హీరో దర్శకుడి మీద గత డిజాస్టర్ల ప్రభావం వల్లే ఆశించిన రేట్లు రావడం లేదని వినికిడి.
ఇప్పుడు దీన్ని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో పూరి పలు ప్లాన్లు సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. అందులో మొదటిది టీజర్ కట్. ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తాను ప్రేక్షకులకు ఏం చూపించబోతున్నానో ఒక శాంపిల్ వదిలితే హైప్ ఆటోమేటిక్ గా పెరుగుతుందనేది వాటిలో మొదటిది. రెండో ఆప్షన్ బాగా వైరలయ్యే అవకాశమున్న ఒక పాటని లిరికల్ వీడియో రూపంలో రిలీజ్ చేయడం ద్వారా జనాల అటెన్షన్ ని డబుల్ ఇస్మార్ట్ వైపు తిప్పుకోవచ్చు. లైగర్ దెబ్బకు పూరిని అంత ఈజీగా నమ్మే పరిస్థితిలో బయ్యర్లు లేరు. చాలా అతిశయోక్తిగా దాని గురించి చెప్పిన మాటలు దారుణంగా బోల్తా కొట్టించాయి.
ఇంకోవైపు రామ్ మీద స్కంద, ది వారియర్ ల దెబ్బ గట్టిగా పడింది. ఓపెనింగ్స్ అయితే లాగుతున్నాడు కానీ కంటెంట్ ఏ మాత్రం యావరేజ్ ఉన్నా రెండో వారం లోపే చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి. సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ క్యాస్టింగ్ ఉన్నా డబుల్ ఇస్మార్ట్ మీద హైప్ పెరగాలంటే మేజిక్ అనిపించే ప్రమోషన్లు జరగాలి. అందుకే ఇప్పుడొచ్చిన గ్యాప్ ని దానికోసమే పూరి వాడుకుంటారని తెలిసింది. ఓటిటి సంస్థలతో జరుగుతున్న బేరాలు ఒక కొలిక్కి రాకపోవడం కూడా ఆలస్యానికి కారణంగా వినిపిస్తోంది. వేసవిలో రావాలంటే మాత్రం ఇప్పుడున్న స్పీడ్ ని డబుల్ చేయాల్సిందే.
This post was last modified on February 16, 2024 12:17 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…