అన్ని సవ్యంగా ప్లానింగ్ ప్రకారం జరిగి ఉంటే ఇంకో ఇరవై రోజుల్లో డబుల్ ఇస్మార్ట్ విడుదలకు సిద్ధంగా ఉండేది. కానీ షూటింగ్ తో పాటు పాటల చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా తప్పలేదు. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. దర్శకుడు పూరి జగన్నాధ్ దీన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతోనే మొదలుపెట్టాడు కానీ బడ్జెట్ చేయి దాటిపోవడం వల్లే కొంత బ్రేక్ వేయాల్సి వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఇస్మార్ట్ శంకర్ బ్రాండ్ కన్నా హీరో దర్శకుడి మీద గత డిజాస్టర్ల ప్రభావం వల్లే ఆశించిన రేట్లు రావడం లేదని వినికిడి.
ఇప్పుడు దీన్ని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో పూరి పలు ప్లాన్లు సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. అందులో మొదటిది టీజర్ కట్. ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తాను ప్రేక్షకులకు ఏం చూపించబోతున్నానో ఒక శాంపిల్ వదిలితే హైప్ ఆటోమేటిక్ గా పెరుగుతుందనేది వాటిలో మొదటిది. రెండో ఆప్షన్ బాగా వైరలయ్యే అవకాశమున్న ఒక పాటని లిరికల్ వీడియో రూపంలో రిలీజ్ చేయడం ద్వారా జనాల అటెన్షన్ ని డబుల్ ఇస్మార్ట్ వైపు తిప్పుకోవచ్చు. లైగర్ దెబ్బకు పూరిని అంత ఈజీగా నమ్మే పరిస్థితిలో బయ్యర్లు లేరు. చాలా అతిశయోక్తిగా దాని గురించి చెప్పిన మాటలు దారుణంగా బోల్తా కొట్టించాయి.
ఇంకోవైపు రామ్ మీద స్కంద, ది వారియర్ ల దెబ్బ గట్టిగా పడింది. ఓపెనింగ్స్ అయితే లాగుతున్నాడు కానీ కంటెంట్ ఏ మాత్రం యావరేజ్ ఉన్నా రెండో వారం లోపే చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి. సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ క్యాస్టింగ్ ఉన్నా డబుల్ ఇస్మార్ట్ మీద హైప్ పెరగాలంటే మేజిక్ అనిపించే ప్రమోషన్లు జరగాలి. అందుకే ఇప్పుడొచ్చిన గ్యాప్ ని దానికోసమే పూరి వాడుకుంటారని తెలిసింది. ఓటిటి సంస్థలతో జరుగుతున్న బేరాలు ఒక కొలిక్కి రాకపోవడం కూడా ఆలస్యానికి కారణంగా వినిపిస్తోంది. వేసవిలో రావాలంటే మాత్రం ఇప్పుడున్న స్పీడ్ ని డబుల్ చేయాల్సిందే.
This post was last modified on February 16, 2024 12:17 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…