అన్ని సవ్యంగా ప్లానింగ్ ప్రకారం జరిగి ఉంటే ఇంకో ఇరవై రోజుల్లో డబుల్ ఇస్మార్ట్ విడుదలకు సిద్ధంగా ఉండేది. కానీ షూటింగ్ తో పాటు పాటల చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా తప్పలేదు. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. దర్శకుడు పూరి జగన్నాధ్ దీన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతోనే మొదలుపెట్టాడు కానీ బడ్జెట్ చేయి దాటిపోవడం వల్లే కొంత బ్రేక్ వేయాల్సి వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఇస్మార్ట్ శంకర్ బ్రాండ్ కన్నా హీరో దర్శకుడి మీద గత డిజాస్టర్ల ప్రభావం వల్లే ఆశించిన రేట్లు రావడం లేదని వినికిడి.
ఇప్పుడు దీన్ని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో పూరి పలు ప్లాన్లు సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. అందులో మొదటిది టీజర్ కట్. ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తాను ప్రేక్షకులకు ఏం చూపించబోతున్నానో ఒక శాంపిల్ వదిలితే హైప్ ఆటోమేటిక్ గా పెరుగుతుందనేది వాటిలో మొదటిది. రెండో ఆప్షన్ బాగా వైరలయ్యే అవకాశమున్న ఒక పాటని లిరికల్ వీడియో రూపంలో రిలీజ్ చేయడం ద్వారా జనాల అటెన్షన్ ని డబుల్ ఇస్మార్ట్ వైపు తిప్పుకోవచ్చు. లైగర్ దెబ్బకు పూరిని అంత ఈజీగా నమ్మే పరిస్థితిలో బయ్యర్లు లేరు. చాలా అతిశయోక్తిగా దాని గురించి చెప్పిన మాటలు దారుణంగా బోల్తా కొట్టించాయి.
ఇంకోవైపు రామ్ మీద స్కంద, ది వారియర్ ల దెబ్బ గట్టిగా పడింది. ఓపెనింగ్స్ అయితే లాగుతున్నాడు కానీ కంటెంట్ ఏ మాత్రం యావరేజ్ ఉన్నా రెండో వారం లోపే చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి. సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ క్యాస్టింగ్ ఉన్నా డబుల్ ఇస్మార్ట్ మీద హైప్ పెరగాలంటే మేజిక్ అనిపించే ప్రమోషన్లు జరగాలి. అందుకే ఇప్పుడొచ్చిన గ్యాప్ ని దానికోసమే పూరి వాడుకుంటారని తెలిసింది. ఓటిటి సంస్థలతో జరుగుతున్న బేరాలు ఒక కొలిక్కి రాకపోవడం కూడా ఆలస్యానికి కారణంగా వినిపిస్తోంది. వేసవిలో రావాలంటే మాత్రం ఇప్పుడున్న స్పీడ్ ని డబుల్ చేయాల్సిందే.
This post was last modified on February 16, 2024 12:17 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…