ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ డంకీ హఠాత్తుగా ఫిబ్రవరి 15 నుంచి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ మొదలైపోయింది. బాక్సాఫీస్ వద్ద పఠాన్, జవాన్ అంత గొప్పగా ఆడకపోయినా నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లతో డీసెంట్ గానే బయట పడ్డ సంగతి తెలిసిందే. కాకపోతే సలార్ పోటీని తట్టుకుని విజేతగా నిలుస్తుందనే అంచనాలు తలకిందులయ్యాయి. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇదే అత్యంత వీక్ వర్క్ గా విమర్శకులు తేల్చి చెప్పారు. దీనికి మహేష్ బాబు, ప్రభాస్ లకు కనెక్షన్ ఏంటనే పాయింట్ కు వద్దాం.
మాములుగా నెట్ ఫ్లిక్స్ ఏదైనా స్టార్ హీరో మూవీ రిలీజ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. వారం పది రోజుల ముందే సోషల్ మీడియా సౌండ్ మొదలైపోతుంది. ప్రత్యేక ప్రకటనలు ఇస్తుంది. స్పెషల్ గా ట్రైలర్లు కట్ చేయిస్తుంది. గుంటూరు కారం కోసం హైదరాబాద్ లో ఓ అయిదు అంతస్థుల బిల్డింగ్ సైడ్ వాల్ మీద మహేష్ బాబు భారీ పెయింటింగ్ వేయించడం బాగా వైరల్ అయ్యింది. ప్రభాస్ కి సైతం యాడ్స్ తో హోరెత్తించి ఆడియన్స్ ని అలెర్ట్ చేస్తూ వచ్చింది. యానిమల్ కు సైతం బాగానే హడావిడి చేసింది.
వీటిలో ఏదీ డంకీకి చేయకపోవడం అభిమానులను షాక్ కి గురి చేసింది. రెండు వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్లు ఇచ్చిన హీరోకి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కస్సుమన్నారు. షారుఖ్ ప్రత్యేకంగా ఓటిటి స్ట్రీమింగ్ కోసం నటించిన యాడ్ ని ఇన్స్ టాలో వేశారు తప్పించి దాన్ని ఇంకా బాగా జనంలోకి తీసుకెళ్లేలా నెట్ ఫ్లిక్స్ చొరవ చూపలేదన్నది వాళ్ళ కంప్లయింట్. ఏది ఏమైనా మహేష్ బాబు, ప్రభాస్ ల మీద చూపించిన ప్రత్యేక శ్రద్ధ షారుఖ్ కేసులో కొరవడిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. అందుకేగా నెట్ ఫ్లిక్స్ అదే పనిగా తెలుగు మార్కెట్ మీద దృష్టి పెట్టి హక్కుల కోసం వేల కోట్లు కుమ్మరిస్తోంది.
This post was last modified on February 16, 2024 1:48 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…