సెలబ్రిటీ టాక్ షోలకు ఈ మధ్య ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితమైన ఈ కల్చర్ బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు అన్ స్టాపబుల్ చేయడం ద్వారా తెలుగు లోగిళ్ళలోకి వచ్చేసింది. దాన్ని మరిపించే స్థాయిలో ఎవరూ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు టాపిక్ మన గురించి కాదు లెండి. సీనియర్ హీరోయిన్ నేహా ధూపియా గుర్తుందా. అప్పుడెప్పుడో రాజశేఖర్ విలన్ సినిమాలో హీరోయిన్ గా నటించాక కనిపించకుండా పోయింది. ఒకప్పుడు గ్లామర్ షోతో ఆడియన్స్ ని మురిపించిన ట్రాక్ రికార్డు ఆమెది. నో ఫిల్టర్ నేహా పేరుతో ఆవిడ చేసే ఆడియో పాడ్ క్యాస్ట్ బాగా పాపులర్.
ఇప్పటిదాకా అయిదు సీజన్లు చేస్తే అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని వీడియో రూపంలోకి మార్చబోతున్నారు. ఈ షోలో ఎలాంటి మొహమాటాలు లేకుండా గెస్టులు మాట్లాడాల్సి ఉంటుంది. సినిమాల నుంచి వ్యక్తిగత జీవితాల వరకు అన్ని విషయాలు ప్రస్తావనకు తెస్తుంది నేహా. కేవలం వినడానికి పరిమితమైన నో ఫిల్టర్ నేహాని జియో టీవీ తెరముందుకు తెస్తోంది. మొదటి అతిథుల లిస్టులో రష్మిక మందన్న ఉందట. యానిమల్ తర్వాత ఉత్తరాదిలో తనకు పాపులారిటీ పెరగడాన్ని గురించి ఇలా ప్లాన్ చేసుకున్నారు. అంతకు ముందు పుష్ప తెచ్చిన ఇమేజ్ చిన్నది కాదు.
గత కొంత కాలంగా వివిధ అంశాల గురించి వార్తల్లో నిలుస్తున్న రష్మిక మందన్న ఏం షేర్ చేసుకుంటుందోననే ఆసక్తి సహజంగానే అభిమానుల్లో ఉంటుంది. ముఖ్యంగా విజయ దేవరకొండతో బంధం గురించి ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ లో ఏకంగా జోకు కూడా వేశారు. అయినా సరే ఇప్పటిదాకా దాని గురించి దాటవేస్తూ వచ్చిన రష్మిక మందన్న మరి నేహా ముందు ఏమైనా ఓపెన్ అవుతుందేమో చూడాలి. పుష్ప 2 ది రూల్, గర్ల్ ఫ్రెండ్,చావ షూటింగ్స్ లో బిజీగా ఉన్న రష్మిక రైన్ బో నుంచి తప్పుకుందనే వార్త తిరుగుతోంది కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
This post was last modified on February 14, 2024 6:07 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…