సెలబ్రిటీ టాక్ షోలకు ఈ మధ్య ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితమైన ఈ కల్చర్ బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు అన్ స్టాపబుల్ చేయడం ద్వారా తెలుగు లోగిళ్ళలోకి వచ్చేసింది. దాన్ని మరిపించే స్థాయిలో ఎవరూ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు టాపిక్ మన గురించి కాదు లెండి. సీనియర్ హీరోయిన్ నేహా ధూపియా గుర్తుందా. అప్పుడెప్పుడో రాజశేఖర్ విలన్ సినిమాలో హీరోయిన్ గా నటించాక కనిపించకుండా పోయింది. ఒకప్పుడు గ్లామర్ షోతో ఆడియన్స్ ని మురిపించిన ట్రాక్ రికార్డు ఆమెది. నో ఫిల్టర్ నేహా పేరుతో ఆవిడ చేసే ఆడియో పాడ్ క్యాస్ట్ బాగా పాపులర్.
ఇప్పటిదాకా అయిదు సీజన్లు చేస్తే అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని వీడియో రూపంలోకి మార్చబోతున్నారు. ఈ షోలో ఎలాంటి మొహమాటాలు లేకుండా గెస్టులు మాట్లాడాల్సి ఉంటుంది. సినిమాల నుంచి వ్యక్తిగత జీవితాల వరకు అన్ని విషయాలు ప్రస్తావనకు తెస్తుంది నేహా. కేవలం వినడానికి పరిమితమైన నో ఫిల్టర్ నేహాని జియో టీవీ తెరముందుకు తెస్తోంది. మొదటి అతిథుల లిస్టులో రష్మిక మందన్న ఉందట. యానిమల్ తర్వాత ఉత్తరాదిలో తనకు పాపులారిటీ పెరగడాన్ని గురించి ఇలా ప్లాన్ చేసుకున్నారు. అంతకు ముందు పుష్ప తెచ్చిన ఇమేజ్ చిన్నది కాదు.
గత కొంత కాలంగా వివిధ అంశాల గురించి వార్తల్లో నిలుస్తున్న రష్మిక మందన్న ఏం షేర్ చేసుకుంటుందోననే ఆసక్తి సహజంగానే అభిమానుల్లో ఉంటుంది. ముఖ్యంగా విజయ దేవరకొండతో బంధం గురించి ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ లో ఏకంగా జోకు కూడా వేశారు. అయినా సరే ఇప్పటిదాకా దాని గురించి దాటవేస్తూ వచ్చిన రష్మిక మందన్న మరి నేహా ముందు ఏమైనా ఓపెన్ అవుతుందేమో చూడాలి. పుష్ప 2 ది రూల్, గర్ల్ ఫ్రెండ్,చావ షూటింగ్స్ లో బిజీగా ఉన్న రష్మిక రైన్ బో నుంచి తప్పుకుందనే వార్త తిరుగుతోంది కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
This post was last modified on February 14, 2024 6:07 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…