ప్రభాస్ సినిమాలు అంటే వాటి రేంజే వేరు. అన్నీ భారీ చిత్రాలే. అంతంత పెద్ద రేంజిలో చేస్తూ కూడా ఒకేసారి మల్టిపుల్ మూవీస్ చేయడం ప్రభాస్కే చెల్లింది. గత ఏడాది ప్రభాస్ నుంచి వచ్చిన ఆదిపురుష్, సలార్ రెండూ భారీ చిత్రాలే. ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ‘కల్కి’ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘రాజా సాబ్’ను ముందు మామూలు సినిమానే అనుకున్నారు కానీ అది కూడా వీఎఫెక్స్తో ముడిపడ్డ పెద్ద రేంజ్ సినిమానే అంటున్నారు. ఈ రెండు చిత్రాలను పూర్తి చేసి.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ చేయాల్సి ఉంది ప్రభాస్. సందీప్ ఈ మధ్యే ‘యానిమల్’ను రిలీజ్ చేసి ఫ్రీ అయ్యాడు. అతను ‘స్పిరిట్’ స్క్రిప్టు రెడీ చేసుకుని రావడం.. ప్రభాస్ ఆ సినిమా పని మొదలుపెట్టడమే తరువాయి అని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు ప్రణాళికలు మారినట్లు తెలుస్తోంది. సందీప్ రెడీగా లేడా.. లేదా అతడికి వేరే ఆలోచనలున్నాయా.. లేక ప్రభాస్ ఫోకస్ మారిందా తెలియదు కానీ ‘స్పిరిట్’ను కొంచెం హోల్డ్లో పెట్టి ‘సలార్-2’ను పూర్తి చేయాలని ప్రభాస్ ఫిక్సయ్యాడట. ‘సలార్-2’కు స్క్రిప్టు దాదాపు సిద్ధంగా ఉండడం, వేగంగా ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయడానికి ప్రశాంత్ పక్కా ప్రణాళికతో ఉండడంతో ప్రభాస్ అటు వైపు చూస్తున్నాడట.
మరోవైపు సందీప్ కూడా ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ చేయాల్సి ఉంది. ఈలోపు అతను అది పూర్తి చేసుకుని వస్తాడేమో చూడాలి. మొత్తానికి ప్రభాస్-సందీప్ కలయిక వచ్చే ఏడాదే ఉంటుందన్నది ఇరువురి సన్నిహిత వర్గాల సమాచారం.
This post was last modified on February 13, 2024 4:46 pm
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…