Movie News

దగ్గుబాటి కొరియన్‍ కనెక్షన్‍

నిర్మాత దగ్గుబాటి సురేష్‍కి కథ చెప్పి ఒప్పించడం అంత ఈజీ కాదని ఇండస్ట్రీలో చెబుతుంటారు. ఆయనకు ఏ కథ అయినా ఒక పట్టాన నచ్చదట. అందుకేనేమో ఆయన ఈమధ్య రీమేక్‍ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇతర నిర్మాతలు తీసిన సినిమాలు చూసి, నచ్చితే హక్కులు తీసుకుంటున్నారు.

ఓ బేబీ ఓ కొరియన్‍ సినిమాకు రీమేక్‍ అనే సంగతి తెలిసిందే. ఆయన మిడ్‍నైట్‍ రన్నర్స్ అనే మరో కొరియన్‍ సినిమా రీమేక్‍ హక్కులు కూడా తీసుకున్నారు. అందులోని లీడ్‍ క్యారెక్టర్లను స్త్రీ పాత్రలుగా మార్చి దర్శకుడు సుధీర్‍ వర్మ రీమేక్‍ చేయబోతున్నాడు. రెజీనా, నివేదా థామస్‍ అందులో హీరోయిన్లుగా నటిస్తారు. సురేష్‍బాబు తాజాగా డాన్సింగ్‍ క్వీన్‍ అనే మరో కొరియన్‍ సినిమా హక్కులు కూడా తీసుకున్నట్టు సమాచారం.

ఇద్దరు భార్యాభర్తల మధ్య జరిగే ఆసక్తికరమైన డ్రామా ఇది. హ్యూమన్‍ ఎమోషన్స్ అవీ మన తెలుగు నేటివిటీకి దగ్గరగా వుంటాయి. ఓ బేబీ మాదిరిగా మన కుటుంబ ప్రేక్షకులకు నచ్చే మెటీరియల్‍ కనుక సురేష్‍ బాబు దీనిని కొన్నట్టున్నారు. దీనికి లక్ష్యం, సాక్ష్యం ఫేమ్‍ శ్రీవాస్‍ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. సురేష్‍బాబు నిర్మాణంలో వెంకటేష్‍ చేస్తోన్న నారప్ప కూడా రీమేకే కావడం గమనార్హం.

This post was last modified on September 9, 2020 2:02 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

2 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

3 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago