ప్రభాస్ మళ్లీ వెండితెరపై కనిపించేది రాధేశ్యామ్లో. యూరప్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి కోవిడ్ కారణంగా బ్రేక్ పడింది. మళ్లీ అక్కడకు వెళ్లేందుకు పర్మిషన్లు వచ్చేలోగా అక్టోబర్ నుంచి ఇక్కడ సెట్స్లో కొంత భాగం షూటింగ్ పూర్తి చేయనున్నారు.
ప్రభాస్ నుంచి ఇమ్మీడియట్గా వచ్చేది ఇదే సినిమా అయినా కానీ నాగ్ అశ్విన్తో చేసే చిత్రం, ఆదిపురుష్ రెండూ ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. బాహుబలితో వచ్చిన ఇమేజ్ తర్వాత ప్రభాస్ ఎంచుకున్న ప్రాజెక్ట్ కాదిది. బాహుబలి నిర్మాణ దశలో వుండగా సుజీత్తో పాటు రాధాకృష్ణ కుమార్తో సినిమా చేస్తానని ప్రభాస్ మాట ఇచ్చాడు. అలా సాహో, రాధేశ్యామ్ మొదలయ్యాయి.
నిజానికి ప్రభాస్కి ఇప్పుడున్న ఇమేజ్కి, అతని సినిమాలపై పెడుతోన్న పెట్టుబడికి న్యాయం చేసేంత అనుభవం ఈ యువ దర్శకులకు లేదు. ఒక దశలో రాధేశ్యామ్ ఆపేసారని కూడా వదంతులు వినిపించాయి. సాహో ఫెయిలైన తర్వాత మళ్లీ ఈ సినిమా కథపై కొన్ని నెలలు వర్క్ చేసారు. అందుకే షూటింగ్ డిలే అయింది. లేదంటే ఈపాటికి షూటింగ్ పార్ట్ పూర్తయిపోయేదే.
ఏదేమైనా ప్రభాస్ తలపెట్టిన పాన్ ఇండియా ప్రాజెక్టుల వల్ల రాధేశ్యామ్ అవుట్ ఫోకస్లోకి వెళ్లింది. రాధాకృష్ణకుమార్ తన సినిమాపై ఆసక్తి పెంచడానికి అసందర్భంగా ట్వీట్స్ పెట్టడంలోనే ఈ చిత్రం ఎంతగా మీడియా దృష్టిని, ఫాన్స్ ఆసక్తిని కూడా కోల్పోయిందనేది అర్థమవుతోంది.
This post was last modified on September 9, 2020 2:03 pm
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…