ప్రభాస్ మళ్లీ వెండితెరపై కనిపించేది రాధేశ్యామ్లో. యూరప్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి కోవిడ్ కారణంగా బ్రేక్ పడింది. మళ్లీ అక్కడకు వెళ్లేందుకు పర్మిషన్లు వచ్చేలోగా అక్టోబర్ నుంచి ఇక్కడ సెట్స్లో కొంత భాగం షూటింగ్ పూర్తి చేయనున్నారు.
ప్రభాస్ నుంచి ఇమ్మీడియట్గా వచ్చేది ఇదే సినిమా అయినా కానీ నాగ్ అశ్విన్తో చేసే చిత్రం, ఆదిపురుష్ రెండూ ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. బాహుబలితో వచ్చిన ఇమేజ్ తర్వాత ప్రభాస్ ఎంచుకున్న ప్రాజెక్ట్ కాదిది. బాహుబలి నిర్మాణ దశలో వుండగా సుజీత్తో పాటు రాధాకృష్ణ కుమార్తో సినిమా చేస్తానని ప్రభాస్ మాట ఇచ్చాడు. అలా సాహో, రాధేశ్యామ్ మొదలయ్యాయి.
నిజానికి ప్రభాస్కి ఇప్పుడున్న ఇమేజ్కి, అతని సినిమాలపై పెడుతోన్న పెట్టుబడికి న్యాయం చేసేంత అనుభవం ఈ యువ దర్శకులకు లేదు. ఒక దశలో రాధేశ్యామ్ ఆపేసారని కూడా వదంతులు వినిపించాయి. సాహో ఫెయిలైన తర్వాత మళ్లీ ఈ సినిమా కథపై కొన్ని నెలలు వర్క్ చేసారు. అందుకే షూటింగ్ డిలే అయింది. లేదంటే ఈపాటికి షూటింగ్ పార్ట్ పూర్తయిపోయేదే.
ఏదేమైనా ప్రభాస్ తలపెట్టిన పాన్ ఇండియా ప్రాజెక్టుల వల్ల రాధేశ్యామ్ అవుట్ ఫోకస్లోకి వెళ్లింది. రాధాకృష్ణకుమార్ తన సినిమాపై ఆసక్తి పెంచడానికి అసందర్భంగా ట్వీట్స్ పెట్టడంలోనే ఈ చిత్రం ఎంతగా మీడియా దృష్టిని, ఫాన్స్ ఆసక్తిని కూడా కోల్పోయిందనేది అర్థమవుతోంది.
This post was last modified on September 9, 2020 2:03 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…