ప్రభాస్ మళ్లీ వెండితెరపై కనిపించేది రాధేశ్యామ్లో. యూరప్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి కోవిడ్ కారణంగా బ్రేక్ పడింది. మళ్లీ అక్కడకు వెళ్లేందుకు పర్మిషన్లు వచ్చేలోగా అక్టోబర్ నుంచి ఇక్కడ సెట్స్లో కొంత భాగం షూటింగ్ పూర్తి చేయనున్నారు.
ప్రభాస్ నుంచి ఇమ్మీడియట్గా వచ్చేది ఇదే సినిమా అయినా కానీ నాగ్ అశ్విన్తో చేసే చిత్రం, ఆదిపురుష్ రెండూ ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. బాహుబలితో వచ్చిన ఇమేజ్ తర్వాత ప్రభాస్ ఎంచుకున్న ప్రాజెక్ట్ కాదిది. బాహుబలి నిర్మాణ దశలో వుండగా సుజీత్తో పాటు రాధాకృష్ణ కుమార్తో సినిమా చేస్తానని ప్రభాస్ మాట ఇచ్చాడు. అలా సాహో, రాధేశ్యామ్ మొదలయ్యాయి.
నిజానికి ప్రభాస్కి ఇప్పుడున్న ఇమేజ్కి, అతని సినిమాలపై పెడుతోన్న పెట్టుబడికి న్యాయం చేసేంత అనుభవం ఈ యువ దర్శకులకు లేదు. ఒక దశలో రాధేశ్యామ్ ఆపేసారని కూడా వదంతులు వినిపించాయి. సాహో ఫెయిలైన తర్వాత మళ్లీ ఈ సినిమా కథపై కొన్ని నెలలు వర్క్ చేసారు. అందుకే షూటింగ్ డిలే అయింది. లేదంటే ఈపాటికి షూటింగ్ పార్ట్ పూర్తయిపోయేదే.
ఏదేమైనా ప్రభాస్ తలపెట్టిన పాన్ ఇండియా ప్రాజెక్టుల వల్ల రాధేశ్యామ్ అవుట్ ఫోకస్లోకి వెళ్లింది. రాధాకృష్ణకుమార్ తన సినిమాపై ఆసక్తి పెంచడానికి అసందర్భంగా ట్వీట్స్ పెట్టడంలోనే ఈ చిత్రం ఎంతగా మీడియా దృష్టిని, ఫాన్స్ ఆసక్తిని కూడా కోల్పోయిందనేది అర్థమవుతోంది.
This post was last modified on September 9, 2020 2:03 pm
ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజయం సాధించినప్పటికీ.. ఆ చిత్రంలో రామ్ చరణ్తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో అంత బలం…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక సమరం.. ఓ రేంజ్లో హీటు పుట్టిస్తోంది. ప్రధాన పక్షాలైన.. టీడీపీ, వైసీపీ, జనసేనలు దూకుడుగా ముందుకు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబు నాకు గురువని ఎవడన్నాడు. బుద్ధి…
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ…
మలయాళంలో గత దశాబ్ద కాలంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన నటుడు ఫాహద్ ఫాజిల్. లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫాహద్…
సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ పెరిగిపోయాక అనుకరణలు, ట్రోలింగ్ లు విపరీతంగా పెరిగిపోయాయి. త్వరగా వచ్చే పాపులారిటీ కావడంతో ఎలాంటి…